ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు పండిత కోట వెంకటాచలం గారు తన పుస్తకం "ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు(1955)" లో ఈవిధంగా వ్రాశారు:
చంద్రవంశక్షత్రియుడగు యయాతి చక్రవర్తి నాలుగవ కుమారుడగు 'అనువు' నుండి లెక్కింపగా పదమూడవ ప్రముఖవంశమువాడగు 'బలి' అను రాజు బంగాళాదేశము లగాయతు దక్షణముగా మద్రాసుకు దిగువభాగమునగల ప్రదేశమువఱకు పరిపాలించుచుండెను. అతని పితృపితామహులు కూడ దీనిని పాలించియుండిరి. ఈ రాజ్యమునకు 'ప్రాచ్యక' రాజ్యమని పేరు. ఈ ప్రా చ్యకరాజ్య మంతటను చాతుర్వర్ణ్యస్ధులైన అర్యులును వారియందంతర్భూతమై యుండిన బాహ్య కులములవారును ఇంకను అనులోమ, విలోమ శాఖలకు చెందిన వివిధ కులములవారును నివసించియుండిరి. రాజును ప్రజలును వేదధర్మముల నాచరించెడి వైదిక సాంప్రదాయములకు చెందినవారైయుండిరి.
ప్రాచ్యక రాజ్య ప్రభువగు 'బలి' మహారాజునకు ఆఱుగురు కుమారులు గలరు. వారు: 1. అంగరాజు 2. వంగరాజు 3. కళింగరాజు 4. సుంహ్మరాజు 5. పుండ్రరాజు 6. ఆంధ్రరాజు అనెడి పేరులు గలవా రైయుండిరి. తండ్రి అనంతరము వారార్గురును తమ ప్రాచ్యకరాజ్యమును ఆఱు భాగములుగా విభజించుకొని ఎవరి వంతునకు వచ్చిన రాజ్యభాగమునకు వారు తమతమ పేరులు పెట్టి రాజ్యము చేసియుండిరి.
ఈ చరిత్రను భాగవత పురాణ మిట్లు చెప్పియున్నది:
శ్రీమద్భాగవతే నవమస్కంధే 23 అధ్యాయే 5,6 శ్లోకాః
'శ్లో|| “అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
జ ఙ్ఞి రే దీ ర్ఘ తమసో బలేః క్షే త్రే మ హేక్షితః|| " ( శ్లో 5 )
శ్లో|| “ చ క్రు స్స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాoశ్చతే|| " ( శ్లో 6 )
'''' తా|| “ బలియను మహారాజునకు దీ ర్ఘ తముడను ఋషి యను గ్ర హమున 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుం డ్ర 6 ఆం ధ్ర యను పే ర్లు గల ఆ ర్గురు కుమారులు గలిగిరి. వారు తూర్పుదేశమునకు రాజు లై ఆరు దేశభాగములకు తమ నామములనే పే ర్లుగానుంచి ఏలిరి.
పై శ్లోకములకు పూర్వాపర సందర్భములను చేర్చి శ్రీ బమ్మెర పోతనామాత్యు డి ట్లు తెనిగించి యున్నాడు :-
“తితిక్షునకు రుశ ద్రధుండు, రుశ ద్రధునకు హేముండు, హేమునకు సుతపుండును, సుతపునకు బలియు బు ట్టిరి. ఆ బలివలన అంగ, వంగ, కళింగ, సుంహ్మ, పుం డ్రాం ధ్రులను పేరులు గలవారార్వురు కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబులకు(ప్రాచ్యక దేశభాగములు) రాజు లై దేశంబులకు తమతమ నామధేయంబులిడి యేలిరి.” (శ్రీ మద్భాగవత నవమస్కంధము 685 వచనము చూడుడు)
రాజుల నామములచే వారిచే పాలింపబడిన ప్ర దేశములు పిలువబడుట గలదు. అంగ , వంగ , కళింగ , సుంహ్మ , పుం డ్ర , ఆం ధ్ర రాజులు రాజ్యము చేసిన ప్రదేశములు అంగ దేశము , వంగ దేశము , కళింగ దేశము , సుంహ్మ దేశము , పుం డ్ర దేశము , ఆం ధ్ర దేశము అను నామములతో పిలువబడినవి. ఆం ధ్ర దేశపు ప్రజలు ఆం ధ్రులు అను నామము చే పిలువబడిరి.
"ప్రాచ్యకదేశమ" ని పిలువబడినపుడు ఈ ప్రాంతముననివసించిన ప్రజలు "ప్రాచ్యక”జాతీయులని(తూర్పుభారతమున నివసించిన ఆర్యులని) పేరు కలిగియుండిరి. పిమ్మట "ఆంధ్రరాజు” తనకు భాగలబ్ధమైన ప్రాచ్యక రాజ్యభాగమునకు "ఆంధ్రదేశ” మని పేరుపెట్టినపుడు అందు నివసించుచుండిన అన్ని కులములకు చెందిన ఆర్యులును, అందుండిన దస్యుజాతివారలును, బాహ్యశాఖీయు లాదిగాగల జనసమూహ మంతయు "ఆంధ్రజాతీయులు” లేక “ఆంధ్రులు” అని పిలువబడిరి. వారు మాట్లాడుచుండిన ప్రాచ్యకభాషలలో నొకటియగు తెలుగుభాష "ఆంధ్రము” లేక “ఆంధ్రభాష” యని పిలువబడజొచ్చినది. వేదభాషయైన దేవనాగరిభాష నుండి సంస్కృతమును అందుండి ప్రాకృతభాషయు, ప్రాకృతమునుండి వికృతినొంది తెలుగు మెదలుగాగల వివిధరాష్ట్రభాషలును ఉద్భవించినవి. ఈ తెలుగే కాలక్రమమున ఉచ్చారణలోను, ప్రాయులిపిలోను చాలమార్పులను జెంది చివరకు "ఆంధ్రము” అనెడి దేశనామమును కూడ గ్రహించినది. తెలుగు, ఆంధ్రము వేఱువేఱు భాషలనెడి వాదమునకు తావు లేదు.
ఆంధ్రరాజు కాలము: ఆంధ్రరాజుయెక్క దరిమిలా వంశపరంపర మనకు దొరుకుటలేదు. అది త్రేతాయుగములోని చరిత్ర. కనీసము ఇప్పటికి తొమ్మిదిలక్షల సంవత్సరముల పైకాలమగును. శ్రీరాముని తండ్రి దశరథుడు, ఆంధ్రరాజు సమకాలికులు. (భాగవతము 9_685_686 చూడుడు.)
ప్రాచ్యకదేశస్థులైన ఈ ఆర్యాంధ్రులను గురించి శ్రీరామాయణమునందు సుగ్రీవుడు సీతాన్వేషణమునకు వానరులను పంపు ఘట్టమున స్మరింపబడినది. శ్రీ దేవీభాగవతమున సుక్షత్రియుడైన సింహళదేశాధీశుడు తన కుమార్తెను ఆంధ్రదేశపు రాజునకిచ్చుటకు రాయబారములు నడిపియుండెను. భారతములో రాజసూయాధ్వరముచేయు ప్రయత్నమున జరుపబడిన దిగ్విజయ యాత్రాసందర్భమున సహదేవునివలన జయింపబడిన రాజ్యములలో "ఆంధ్రదేశము” గలదు. (సభాపర్వాంతర దిగ్విజయ పర్వం 31 అధ్యా.). అశ్వమేధపర్వము:చతుర్థాశ్వాసమున యజ్ఞాశ్వముతో వెళ్ళిన అర్జునుడు దక్షిణ సముద్ర తీరమునగల ద్రవిడ, ఆంధ్ర, రౌద్ర, మాహిషక, కేరళ కర్ణాట దేశాధీశులను జయించి యజ్ఞాశ్వమును తోలుకొని పోయినట్లు గలదు. ఉషాకన్య స్వప్నమందు గనిన పురుషుని గుర్తించుటకొఱకు ఆమె చెలికత్తె వ్రాసిచూపిన రూపపటములలోఆంధ్రరాజు కూడ కలడని చెప్పబడెను. ద్వాపరయుగాంతమున జరిగిన మహాభారతయుద్ధములో ఆంధ్రుల ప్రశంస వచ్చినట్లు కనబడదు.----
By : naakanipinchinadi.blogspot.in
మూలము:
చంద్రవంశక్షత్రియుడగు యయాతి చక్రవర్తి నాలుగవ కుమారుడగు 'అనువు' నుండి లెక్కింపగా పదమూడవ ప్రముఖవంశమువాడగు 'బలి' అను రాజు బంగాళాదేశము లగాయతు దక్షణముగా మద్రాసుకు దిగువభాగమునగల ప్రదేశమువఱకు పరిపాలించుచుండెను. అతని పితృపితామహులు కూడ దీనిని పాలించియుండిరి. ఈ రాజ్యమునకు 'ప్రాచ్యక' రాజ్యమని పేరు. ఈ ప్రా చ్యకరాజ్య మంతటను చాతుర్వర్ణ్యస్ధులైన అర్యులును వారియందంతర్భూతమై యుండిన బాహ్య కులములవారును ఇంకను అనులోమ, విలోమ శాఖలకు చెందిన వివిధ కులములవారును నివసించియుండిరి. రాజును ప్రజలును వేదధర్మముల నాచరించెడి వైదిక సాంప్రదాయములకు చెందినవారైయుండిరి.
ప్రాచ్యక రాజ్య ప్రభువగు 'బలి' మహారాజునకు ఆఱుగురు కుమారులు గలరు. వారు: 1. అంగరాజు 2. వంగరాజు 3. కళింగరాజు 4. సుంహ్మరాజు 5. పుండ్రరాజు 6. ఆంధ్రరాజు అనెడి పేరులు గలవా రైయుండిరి. తండ్రి అనంతరము వారార్గురును తమ ప్రాచ్యకరాజ్యమును ఆఱు భాగములుగా విభజించుకొని ఎవరి వంతునకు వచ్చిన రాజ్యభాగమునకు వారు తమతమ పేరులు పెట్టి రాజ్యము చేసియుండిరి.
ఈ చరిత్రను భాగవత పురాణ మిట్లు చెప్పియున్నది:
శ్రీమద్భాగవతే నవమస్కంధే 23 అధ్యాయే 5,6 శ్లోకాః
'శ్లో|| “అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
జ ఙ్ఞి రే దీ ర్ఘ తమసో బలేః క్షే త్రే మ హేక్షితః|| " ( శ్లో 5 )
శ్లో|| “ చ క్రు స్స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాoశ్చతే|| " ( శ్లో 6 )
'''' తా|| “ బలియను మహారాజునకు దీ ర్ఘ తముడను ఋషి యను గ్ర హమున 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుం డ్ర 6 ఆం ధ్ర యను పే ర్లు గల ఆ ర్గురు కుమారులు గలిగిరి. వారు తూర్పుదేశమునకు రాజు లై ఆరు దేశభాగములకు తమ నామములనే పే ర్లుగానుంచి ఏలిరి.
పై శ్లోకములకు పూర్వాపర సందర్భములను చేర్చి శ్రీ బమ్మెర పోతనామాత్యు డి ట్లు తెనిగించి యున్నాడు :-
“తితిక్షునకు రుశ ద్రధుండు, రుశ ద్రధునకు హేముండు, హేమునకు సుతపుండును, సుతపునకు బలియు బు ట్టిరి. ఆ బలివలన అంగ, వంగ, కళింగ, సుంహ్మ, పుం డ్రాం ధ్రులను పేరులు గలవారార్వురు కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబులకు(ప్రాచ్యక దేశభాగములు) రాజు లై దేశంబులకు తమతమ నామధేయంబులిడి యేలిరి.” (శ్రీ మద్భాగవత నవమస్కంధము 685 వచనము చూడుడు)
రాజుల నామములచే వారిచే పాలింపబడిన ప్ర దేశములు పిలువబడుట గలదు. అంగ , వంగ , కళింగ , సుంహ్మ , పుం డ్ర , ఆం ధ్ర రాజులు రాజ్యము చేసిన ప్రదేశములు అంగ దేశము , వంగ దేశము , కళింగ దేశము , సుంహ్మ దేశము , పుం డ్ర దేశము , ఆం ధ్ర దేశము అను నామములతో పిలువబడినవి. ఆం ధ్ర దేశపు ప్రజలు ఆం ధ్రులు అను నామము చే పిలువబడిరి.
"ప్రాచ్యకదేశమ" ని పిలువబడినపుడు ఈ ప్రాంతముననివసించిన ప్రజలు "ప్రాచ్యక”జాతీయులని(తూర్పుభారతమున నివసించిన ఆర్యులని) పేరు కలిగియుండిరి. పిమ్మట "ఆంధ్రరాజు” తనకు భాగలబ్ధమైన ప్రాచ్యక రాజ్యభాగమునకు "ఆంధ్రదేశ” మని పేరుపెట్టినపుడు అందు నివసించుచుండిన అన్ని కులములకు చెందిన ఆర్యులును, అందుండిన దస్యుజాతివారలును, బాహ్యశాఖీయు లాదిగాగల జనసమూహ మంతయు "ఆంధ్రజాతీయులు” లేక “ఆంధ్రులు” అని పిలువబడిరి. వారు మాట్లాడుచుండిన ప్రాచ్యకభాషలలో నొకటియగు తెలుగుభాష "ఆంధ్రము” లేక “ఆంధ్రభాష” యని పిలువబడజొచ్చినది. వేదభాషయైన దేవనాగరిభాష నుండి సంస్కృతమును అందుండి ప్రాకృతభాషయు, ప్రాకృతమునుండి వికృతినొంది తెలుగు మెదలుగాగల వివిధరాష్ట్రభాషలును ఉద్భవించినవి. ఈ తెలుగే కాలక్రమమున ఉచ్చారణలోను, ప్రాయులిపిలోను చాలమార్పులను జెంది చివరకు "ఆంధ్రము” అనెడి దేశనామమును కూడ గ్రహించినది. తెలుగు, ఆంధ్రము వేఱువేఱు భాషలనెడి వాదమునకు తావు లేదు.
ఆంధ్రరాజు కాలము: ఆంధ్రరాజుయెక్క దరిమిలా వంశపరంపర మనకు దొరుకుటలేదు. అది త్రేతాయుగములోని చరిత్ర. కనీసము ఇప్పటికి తొమ్మిదిలక్షల సంవత్సరముల పైకాలమగును. శ్రీరాముని తండ్రి దశరథుడు, ఆంధ్రరాజు సమకాలికులు. (భాగవతము 9_685_686 చూడుడు.)
ప్రాచ్యకదేశస్థులైన ఈ ఆర్యాంధ్రులను గురించి శ్రీరామాయణమునందు సుగ్రీవుడు సీతాన్వేషణమునకు వానరులను పంపు ఘట్టమున స్మరింపబడినది. శ్రీ దేవీభాగవతమున సుక్షత్రియుడైన సింహళదేశాధీశుడు తన కుమార్తెను ఆంధ్రదేశపు రాజునకిచ్చుటకు రాయబారములు నడిపియుండెను. భారతములో రాజసూయాధ్వరముచేయు ప్రయత్నమున జరుపబడిన దిగ్విజయ యాత్రాసందర్భమున సహదేవునివలన జయింపబడిన రాజ్యములలో "ఆంధ్రదేశము” గలదు. (సభాపర్వాంతర దిగ్విజయ పర్వం 31 అధ్యా.). అశ్వమేధపర్వము:చతుర్థాశ్వాసమున యజ్ఞాశ్వముతో వెళ్ళిన అర్జునుడు దక్షిణ సముద్ర తీరమునగల ద్రవిడ, ఆంధ్ర, రౌద్ర, మాహిషక, కేరళ కర్ణాట దేశాధీశులను జయించి యజ్ఞాశ్వమును తోలుకొని పోయినట్లు గలదు. ఉషాకన్య స్వప్నమందు గనిన పురుషుని గుర్తించుటకొఱకు ఆమె చెలికత్తె వ్రాసిచూపిన రూపపటములలోఆంధ్రరాజు కూడ కలడని చెప్పబడెను. ద్వాపరయుగాంతమున జరిగిన మహాభారతయుద్ధములో ఆంధ్రుల ప్రశంస వచ్చినట్లు కనబడదు.----
By : naakanipinchinadi.blogspot.in
మూలము: