Sunday, June 29, 2014

ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు

ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు పండిత కోట వెంకటాచలం గారు తన పుస్తకం "ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు(1955)" లో ఈవిధంగా వ్రాశారు:
చంద్రవంశక్షత్రియుడగు యయాతి చక్రవర్తి నాలుగవ కుమారుడగు 'అనువు' నుండి లెక్కింపగా పదమూడవ ప్రముఖవంశమువాడగు 'బలి' అను రాజు బంగాళాదేశము లగాయతు దక్షణముగా మద్రాసుకు దిగువభాగమునగల ప్రదేశమువఱకు పరిపాలించుచుండెను. అతని పితృపితామహులు కూడ దీనిని పాలించియుండిరి. ఈ రాజ్యమునకు 'ప్రాచ్యక' రాజ్యమని పేరు. ఈ ప్రా చ్యకరాజ్య మంతటను చాతుర్వర్ణ్యస్ధులైన అర్యులును వారియందంతర్భూతమై యుండిన బాహ్య కులములవారును ఇంకను అనులోమ, విలోమ శాఖలకు చెందిన వివిధ కులములవారును నివసించియుండిరి. రాజును ప్రజలును వేదధర్మముల నాచరించెడి వైదిక సాంప్రదాయములకు చెందినవారైయుండిరి.
ప్రాచ్యక రాజ్య ప్రభువగు 'బలి' మహారాజునకు ఆఱుగురు కుమారులు గలరు. వారు: 1. అంగరాజు 2. వంగరాజు 3. కళింగరాజు 4. సుంహ్మరాజు 5. పుండ్రరాజు 6. ఆంధ్రరాజు అనెడి పేరులు గలవా రైయుండిరి. తండ్రి అనంతరము వారార్గురును తమ ప్రాచ్యకరాజ్యమును ఆఱు భాగములుగా విభజించుకొని ఎవరి వంతునకు వచ్చిన రాజ్యభాగమునకు వారు తమతమ పేరులు పెట్టి రాజ్యము చేసియుండిరి.
ఈ చరిత్రను భాగవత పురాణ మిట్లు చెప్పియున్నది:
శ్రీమద్భాగవతే నవమస్కంధే 23 అధ్యాయే 5,6 శ్లోకాః
'శ్లో|| “అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
జ ఙ్ఞి రే దీ ర్ఘ తమసో బలేః క్షే త్రే మ హేక్షితః|| " ( శ్లో 5 )
శ్లో|| “ చ క్రు స్స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాoశ్చతే|| " ( శ్లో 6 )
'''' తా|| “ బలియను మహారాజునకు దీ ర్ఘ తముడను ఋషి యను గ్ర హమున 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుం డ్ర 6 ఆం ధ్ర యను పే ర్లు గల ఆ ర్గురు కుమారులు గలిగిరి. వారు తూర్పుదేశమునకు రాజు లై ఆరు దేశభాగములకు తమ నామములనే పే ర్లుగానుంచి ఏలిరి.
పై శ్లోకములకు పూర్వాపర సందర్భములను చేర్చి శ్రీ బమ్మెర పోతనామాత్యు డి ట్లు తెనిగించి యున్నాడు :-
“తితిక్షునకు రుశ ద్రధుండు, రుశ ద్రధునకు హేముండు, హేమునకు సుతపుండును, సుతపునకు బలియు బు ట్టిరి. ఆ బలివలన అంగ, వంగ, కళింగ, సుంహ్మ, పుం డ్రాం ధ్రులను పేరులు గలవారార్వురు కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబులకు(ప్రాచ్యక దేశభాగములు) రాజు లై దేశంబులకు తమతమ నామధేయంబులిడి యేలిరి.” (శ్రీ మద్భాగవత నవమస్కంధము 685 వచనము చూడుడు)
రాజుల నామములచే వారిచే పాలింపబడిన ప్ర దేశములు పిలువబడుట గలదు. అంగ , వంగ , కళింగ , సుంహ్మ , పుం డ్ర , ఆం ధ్ర రాజులు రాజ్యము చేసిన ప్రదేశములు అంగ దేశము , వంగ దేశము , కళింగ దేశము , సుంహ్మ దేశము , పుం డ్ర దేశము , ఆం ధ్ర దేశము అను నామములతో పిలువబడినవి. ఆం ధ్ర దేశపు ప్రజలు ఆం ధ్రులు అను నామము చే పిలువబడిరి.
"ప్రాచ్యకదేశమ" ని పిలువబడినపుడు ఈ ప్రాంతముననివసించిన ప్రజలు "ప్రాచ్యక”జాతీయులని(తూర్పుభారతమున నివసించిన ఆర్యులని) పేరు కలిగియుండిరి. పిమ్మట "ఆంధ్రరాజు” తనకు భాగలబ్ధమైన ప్రాచ్యక రాజ్యభాగమునకు "ఆంధ్రదేశ” మని పేరుపెట్టినపుడు అందు నివసించుచుండిన అన్ని కులములకు చెందిన ఆర్యులును, అందుండిన దస్యుజాతివారలును, బాహ్యశాఖీయు లాదిగాగల జనసమూహ మంతయు "ఆంధ్రజాతీయులు” లేక “ఆంధ్రులు” అని పిలువబడిరి. వారు మాట్లాడుచుండిన ప్రాచ్యకభాషలలో నొకటియగు తెలుగుభాష "ఆంధ్రము” లేక “ఆంధ్రభాష” యని పిలువబడజొచ్చినది. వేదభాషయైన దేవనాగరిభాష నుండి సంస్కృతమును అందుండి ప్రాకృతభాషయు, ప్రాకృతమునుండి వికృతినొంది తెలుగు మెదలుగాగల వివిధరాష్ట్రభాషలును ఉద్భవించినవి. ఈ తెలుగే కాలక్రమమున ఉచ్చారణలోను, ప్రాయులిపిలోను చాలమార్పులను జెంది చివరకు "ఆంధ్రము” అనెడి దేశనామమును కూడ గ్రహించినది. తెలుగు, ఆంధ్రము వేఱువేఱు భాషలనెడి వాదమునకు తావు లేదు.
ఆంధ్రరాజు కాలము: ఆంధ్రరాజుయెక్క దరిమిలా వంశపరంపర మనకు దొరుకుటలేదు. అది త్రేతాయుగములోని చరిత్ర. కనీసము ఇప్పటికి తొమ్మిదిలక్షల సంవత్సరముల పైకాలమగును. శ్రీరాముని తండ్రి దశరథుడు, ఆంధ్రరాజు సమకాలికులు. (భాగవతము 9_685_686 చూడుడు.)
ప్రాచ్యకదేశస్థులైన ఈ ఆర్యాంధ్రులను గురించి శ్రీరామాయణమునందు సుగ్రీవుడు సీతాన్వేషణమునకు వానరులను పంపు ఘట్టమున స్మరింపబడినది. శ్రీ దేవీభాగవతమున సుక్షత్రియుడైన సింహళదేశాధీశుడు తన కుమార్తెను ఆంధ్రదేశపు రాజునకిచ్చుటకు రాయబారములు నడిపియుండెను. భారతములో రాజసూయాధ్వరముచేయు ప్రయత్నమున జరుపబడిన దిగ్విజయ యాత్రాసందర్భమున సహదేవునివలన జయింపబడిన రాజ్యములలో "ఆంధ్రదేశము” గలదు. (సభాపర్వాంతర దిగ్విజయ పర్వం 31 అధ్యా.). అశ్వమేధపర్వము:చతుర్థాశ్వాసమున యజ్ఞాశ్వముతో వెళ్ళిన అర్జునుడు దక్షిణ సముద్ర తీరమునగల ద్రవిడ, ఆంధ్ర, రౌద్ర, మాహిషక, కేరళ కర్ణాట దేశాధీశులను జయించి యజ్ఞాశ్వమును తోలుకొని పోయినట్లు గలదు. ఉషాకన్య స్వప్నమందు గనిన పురుషుని గుర్తించుటకొఱకు ఆమె చెలికత్తె వ్రాసిచూపిన రూపపటములలోఆంధ్రరాజు కూడ కలడని చెప్పబడెను. ద్వాపరయుగాంతమున జరిగిన మహాభారతయుద్ధములో ఆంధ్రుల ప్రశంస వచ్చినట్లు కనబడదు.----
By : naakanipinchinadi.blogspot.in

మూలము:

రామకృష్ణ విలోమ కావ్యమ్ - సూర్య కవి విరచితం

రామకృష్ణ విలోమ కావ్యమ్
సూర్య కవి విరచితమ్
********

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః |
శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతం || 1 ||

చిరం  విరంచిర్న చిరం విరంచిః
సాకారతా సత్యసతారకా సా |
సాకారతా సత్యసతారకా సా
చిరం విరంచిర్న చిరం విరంచిః || 2 ||

తామసీత్యసతి సత్యసీమతా
మాయయాక్షమసమక్షయాయమా |
మాయయాక్షమసమక్షయాయమా |
తామసీత్యసతి సత్యసీమతా || 3 ||

కా తాపఘ్నీ తారకాద్యా విపాపా
త్రేధా విద్యా నోష్ణకృత్యం నివాసే |
సేవా నిత్యం కృష్ణనోద్యా విధాత్రే
పాపావిద్యాకారతాఘ్నీ పతాకా || 4 ||

శ్రీరామతో మధ్యమతోది యేన
ధీరో೭నిశం వశ్యవతీవరాద్వా |
ద్వారావతీవశ్యవశం నిరోధీ
నయేదితో మధ్యమతో೭మరా శ్రీః || 5 ||

కౌశికే త్రితపసి క్షరవ్రతీ
యో೭దదాద్೭ద్వితనయస్వమాతురమ్ |
రంతుమాస్వయన తద్విదాదయో೭
తీవ్రరక్షసి పతత్రికేశికౌ || 6 ||

లంబాధరోరు త్రయలంబనాసే
త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా |
జ్ఞాతాగమా రక్ష హి యాహి యా త్వం
సేనా బలం యత్ర రురోధ బాలం || 7 ||

లంకాయనా నిత్యగమా ధవాశా
సాకం తయానున్నయమానుకారా |
రాకానుమా యన్నను యాతకంసా
శావాధమాగత్య నినాయ కాలం || 8 ||

గాధిజాధ్వరవైరా యే
తే೭తీతా రక్షసా మతాః |
తామసాక్షరతాతీతే
యే రావైరధ్వజాధిగాః || 9 ||

తావదేవ దయా దేవే
యాగే యావదవాసనా |
నాసవాదవయా గేయా
వేదే యాదవదేవతా || 10 ||
సభాస్వయే భగ్నమనేన చాపం
కీనాశతానద్ధరుషా శిలాశైః |
శైలాశిషారుద్ధనతాశనాకీ
పంచాననే మగ్నభయే స్వభాసః || 11 ||
న వేద యామక్షరభామసీతాం
కా తారకా విష్ణుజితేऽవివాదే |
దేవావితే జిష్ణువికారతా కా
తాం సీమభారక్షమయాదవేన || 12 ||
తీవ్రగోరన్వయత్రార్యా
వైదేహీమనసో మతః |
తమసో న మహీదేవై-
ర్యాత్రాయన్వరగోవ్రతీ || 13 ||
వేద యా పద్మసదనం
సాధారావతతార మా |
మారతా తవ రాధా సా
నంద సద్మప యాదవే || 14 ||
శైవతో హననే೭రోధీ
యో దేవేషు నృపోత్సవః |
వత్సపో నృషు వేదే యో
ధీరో೭నేన హతో೭వశైః || 15 ||
నాగోపగో೭సి క్షర మే పినాకేऽ
నాయో೭జనే ధర్మధనేన దానమ్ |
నందాననే ధర్మధనే జయో నా
కేనాపి మే రక్షసి గోపగో నః || 16 ||
తతాన దామ ప్రమదా పదాయ
నేమే రుచామస్వనసుందరాక్షీ |
క్షీరాదసుం న స్వమచారు మేనే
యదాప దామ ప్రమదా నతాతః || 17 ||
తామితో మత్తసూత్రామా
శాపాదేష విగానతామ్ |
తాం నగావిషదే೭పాశా
మాత్రాసూత్తమతో మితా || 18 ||
నాసావద్యాపత్రపాజ్ఞావినోదీ
ధీరో೭నుత్యా సస్మితో೭ద్యావిగీత్యా |
త్యాగీ విద్యాతో೭స్మి సత్త్యానురోధీ
దీనో೭విజ్ఞా పాత్రపద్యావసానా || 19 ||
సంభావితం భిక్షురగాదగారం
యాతాధిరాప స్వనఘాజవంశః |
శవం జఘాన స్వపరాధితాయా
రంగాదగారక్షుభితం విభాసం || 20 ||
తయాతితారస్వనయాగతం మా
లోకాపవాదద్వితయం పినాకే |
కేనాపి యం తద్విదవాప కాలో
మాతంగయానస్వరతాతియాతః || 21 ||
శవే೭విదా చిత్రకురంగమాలా
పంచావటీనర్మ న రోచతే వా |
వాతే೭చరో నర్మనటీవ చాపం
లామాగరం కుత్రచిదావివేశ || 22 ||
నేహ వా క్షిపసి పక్షికంధరా
మాలినీ స్వమతమత్త దూయతే |
తే యదూత్తమతమ స్వనీలిమా-
రాధకం క్షిపసి పక్షివాహనే || 23 ||
వనాంతయానస్వణువేదనాసు
యోషామృతే೭రణ్యగతావిరోధీ |
ధీరో೭వితాగణ్యరతే మృషా యో
సునాదవేణుస్వనయాతనాం వః || 24 ||
కిం ను తోయరసా పంపా
న సేవా నియతేన వై |
వైనతేయనివాసేన
పాపం సారయతో ను కిం || 25 ||
స నతాతపహా తేన
స్వం శేనావిహితాగసమ్ |
సంగతాహివినాశే స్వం
నతేహాప తతాన సః || 26 ||
కపితాలవిభాగేన
యోషాదో೭నునయేన సః |
స నయే నను దోషాయో
నగే భావిలతాపికః || 27 ||
తే సభా ప్రకపివర్ణమాలికా
నాల్పకప్రసరమభ్రకల్పితా |
తాల్పికభ్రమరసప్రకల్పనా
కాలిమార్ణవ పిక ప్రభాసతే || 28 ||
రావణే೭క్షిపతనత్రపానతే
నాల్పకభ్రమణమక్రమాతురమ్ |
రంతుమాక్రమణమభ్రకల్పనా
తేన పాత్రనతపక్షిణే వరా || 29 ||
దైవే యోగే సేవాదానం
శంకా నాయే లంకాయానే |
నేయాకాలం యేనాకాశం
నందావాసే గేయో వేదైః || 30 ||
శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం
యానే నద్యాముగ్రముద్యాననేయా |
యానే నద్యాముగ్రముద్యాననేయా
శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం || 31 ||
వా దిదేశ ద్విసీతాయాం
యం పాథోయనసేతవే |
వేతసేన యథోపాయం
యాంతాసీద్೭విశదే దివా || 32 ||
వాయుజో೭నుమతో నేమే
సంగ్రామే೭రవితో೭హ్ని వః |
వహ్నితో విరమే గ్రాసం
మేనే೭తో೭మనుజో యువా || 33 ||
క్షతాయ మా యత్ర రఘోరితాయు-
రంకానుగానన్యవయో೭యనాని |
నినాయ యో వన్యనగానుకారం
యుతారిఘోరత్రయమాయతాక్షః || 34 ||
తారకే రిపురాప శ్రీ-
రుచా దాససుతాన్వితః |
తన్వితాసు సదాచారు
శ్రీపరా పురి కే రతా || 35 ||
లంకా రంకాగారాధ్యాసం
యోనే మేయా కారావ్యాసే |
సేవ్యా రాకా యామే నేయా
సంధ్యారాగాకారం కాలం || 36 ||

ఇతి
శ్రీదైవజ్ఞపండిత సూర్యకవి విరచితం
విలోమాక్షర రామకృష్ణకావ్యం
సమాప్తమ్
మరిన్ని వివరముల కొరకు  "అందమైన మనసులో " బ్లాగును
" అచ్చంగా తెలుగు " బ్లాగును సందర్శించగలరు

మీకో విషయం తెలుసా? - గోవు

Photo: మీకో విషయం తెలుసా?
ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....
ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....
మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.
మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.
ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.
అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.
అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం

అడ్మిన్ సుకన్య
 
మీకో విషయం తెలుసా?
ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....
ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....
మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.
మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.
ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.
అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.
అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం

రాగంతో రోగ నివారణ



రాగంతో
రోగ నివారణ
కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య తమ 'రుతుగానం'లో శరదృతువును వర్ణిస్తూ- 'తెల్లచీర గట్టి తెలివెల్గులన్గల్గి సితకుముదము దాల్చు రుతులతాంగి దైవతమును పాడె...' అన్నారు. రుతువనేది కాలానికి సంబంధించినది. తెలుపు- వర్ణాలకు చెందినది. దైవతం- సంగీతశాస్త్ర పారిభాషిక పదం. సప్తస్వరాల్లో దైవతాన్ని '' అనే స్వరస్థానంగా సంకేతిస్తారు. మామూలు దృష్టికి ఇవి ఒకదానికొకటి పొంతన లేనివిగా, పరస్పర విరుద్ధాలుగా తోస్తాయి. అందుకే దీన్ని 'శాస్త్రదృష్టి'తో పరిశీలించాలని తమ పీఠికలో సూచించారు విశ్వనాథ. వేకువకీ భూపాలరాగానికీ ఉన్న సంబంధం ఏమిటో సంగీతజ్ఞుడికే తెలుస్తుంది. వేణువుకూ మోహనరాగానికీ ఒక తరహా స్వరమైత్రి. కదనకుతూహల రాగానికీ వీణకూ మరోబాపతు అన్యోన్యత. బాంధవ్యాల్లోని లోతులను అర్థం చేసుకోవడానికి ఒకానొక విశేష శాస్త్రదృష్టి మనిషికి చాలా అవసరం. మన సంగీత వైశిష్ట్యాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఇక్కడి సంగీతం గంధర్వ విద్యగా వాసికెక్కింది. 'గాంధర్వేచ భువిశ్రేష్ఠో... సంగీత గాంధర్వ విద్య నెరిగిన శ్రేష్ఠుల్లో రాముడు అగ్రశ్రేణికి చెందినవాడు' అన్నారు వాల్మీకి. రుషుల దృష్టిలో సంగీతమనగా సాక్షాత్తు వేదమే! సామసంహిత భారతీయ సంగీత శాస్త్రానికి ఆధార షడ్జమం. ముముక్షువులకు సంగీతం ఒక మోక్షసాధనం. 'సంగీత జ్ఞానము, భక్తివినా సన్మార్గము కలదే? మనసా!' అని త్యాగరాజస్వామి ప్రశ్నించారు. 'సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధన్యులైన వారెందరో మహానుభావులు... అందరికీ వందనాలు' అంటూ చేతులు జోడించారు. సామగానం శరీరధాతువులపై చూపించే ప్రభావం మనిషిని ధన్యుణ్ని చేస్తుంది. అందుకే కైమోడ్పు.
నెమలి, ఎద్దు, మేక, సింహం, కోకిల, గుర్రం, ఏనుగు చేసే ధ్వనుల నుంచి వరసగా సరిగమపదని స్వరభేదాలు ఏర్పడ్డాయన్నది లోకంలో ప్రసిద్ధమైన సిద్ధాంతం. మహాదేవుడి ఏడుముఖాల నుంచి సప్తస్వరాలు ప్రభవించాయని సంగీత శాస్త్రాలు వర్ణించాయి. పరశివ, ఈశ్వర, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే ఏడుముఖాలు వరసగా సరిగమపదని స్వరాలకు జన్మస్థానాలు. సంగీతానికి ప్రకృతితోను పంచభూతాలతోనే కాకుండా గ్రహరాశుల చలనంతోనూ లోహాలతోసైతం సంబంధం ఉంది. విషయాన్ని దివ్యజీవన సమాజానికి చెందిన హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ తమ 'సీక్రెట్డాక్ట్రిన్‌'లో సాధికారికంగా ప్రస్తావించారు. షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదాలకు వరసగా ఇనుము, బంగారం, పాదరసం, సీసం, తగరం, రాగి, వెండి లోహాలతో సంబంధం ఉంది. మళ్ళీ అదే వరసలో కుజుడు, సూర్యుడు, బుధుడు, శని, గురుడు, శుక్రుడు, చంద్రుడు అనే గ్రహాలతో సంబంధం ఉంది. అలాగే వివిధ రంగులతోనూ ఉందని మేడమ్బ్లావెట్స్కీ నిరూపించారు. ఇదే విశ్వనాథ సూచించిన శాస్త్రదృష్టి. సంగీత విద్వాంసులు తథరిణోం అంటూ కచేరీ మొదలుపెడతారు. తత్హరిః ఓం అనేవి అందులోని అక్షరాలు. సంగీతం ద్వారా సృష్టి మొత్తాన్ని సంబోధించే సంప్రదాయమది. సంగీతానికి, ప్రకృతికి గల బాంధవ్యానికి జేజేలవి.
ప్రతీరాగానికి ఒకో ప్రత్యేక జీవస్వరం ఉంటుంది. శంకరాభరణంలోను కల్యాణిలోను స్వరాలు సమానమే గాని '' పలకడంలో తేడా ఉంది. శుద్ధమధ్యమం అయితే అది శంకరాభరణం. ప్రతిమధ్యమం అయితే కల్యాణి. మధ్యమం ఎలా పలికాడన్నదాన్నిబట్టి గాయకుడు వాటిలో రాగం పాడుతున్నాడో రసజ్ఞులు గ్రహిస్తారు. బ్లావెట్స్కీ వివరణ ప్రకారం సప్తస్వరాల్లోని దైవతానికి, లోహాల్లో రాగికి సంబంధం. రాగి లోపంవల్ల మానవ దేహానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దైవతం జీవస్వరంగా కలిగిన రాగాన్ని వినడానికి మనిషి ఇష్టపడతాడు. సంగీత సారం మనిషికన్నా దేహానికి బాగా తెలుసు. ఒంట్లో నీరు శాతం తగ్గినప్పుడు దాహం అనే కోరిక పుడుతుంది. కాల్షియం లోపించిన పిల్లలు సున్నాన్ని గోక్కొని తింటారు. కడుపులోబిడ్డ పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) పీల్చేస్తున్నప్పుడు బియ్యం తినాలని గర్భిణికి అనిపిస్తుంది. అలాగే శరీరంలో లోహాల కొరత ఏర్పడినప్పుడు వాటిని భర్తీచేసే సంగీత స్వరాలను దేహం కోరుకుంటుంది. కొరవడిన లోహంతో సంబంధం కలిగిన జీవస్వరమున్న పాటవైపు మనసు పోతుంది. దేహంలోని జీవధాతువులకు సంగీతంపట్ల గల అవగాహనకు అది సాక్ష్యం. కూనిరాగాల్లోని రహస్యం ఇదేనంటారు పెద్దలు. ఒక్కోరోజు ఒకోపాట మనసును వెంటాడుతుంది. పొడిబారిన ఇసుక నీటిని పీల్చుకున్నట్లు- పాటలోని స్వర చైతన్యాన్ని జీవధాతువులు పీల్చుకుని లోహాలకు చెందిన కొరతను భర్తీ చేసుకుంటాయి. సిద్ధాంతం మీదే 'సంగీతంతో చికిత్సా విధానం'(మ్యూజిక్థెరపీ) అభివృద్ధి చెందింది. రాగంతో రోగం కుదర్చడం దాని లక్ష్యం. రాగం రోగానికి చికిత్స చేయగలదనేది రోగ లక్షణాలను బట్టి, లోపాలను సరిదిద్దగల శక్తిని తమలో ఇముడ్చుకున్న రాగాలను బట్టీ ఉంటుంది. దాదాపుగా వినోదానికే పరిమితమవుతున్న భారతీయ సంగీతపు వివిధ కోణాలను, శక్తిసామర్థ్యాలను దిశగా పరిశోధించి, మానవాళికి మేలు చేకూర్చవలసిన బాధ్యత విద్వాంసులపై ఉంది.

మరింత సమాచారము కొరకు జాజి శర్మ గారి టపా