Monday, July 13, 2015

స్నానం అంటే ఏమిటి?

స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి?
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. స్నానాలని అయిదు విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధానాలు. అవి
నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.
నైమిత్తిక స్నానం : ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం.
ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.
కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం.
ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.
స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు.
ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు.
మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.
"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "
అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.
వారుణం : ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.
అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు. ఇది అయిదు రకాలు
* ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.
"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"
పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.
* భౌమస్నానం : పుణ్య నదులలో దొరికే మన్ను లేక పుట్ట మన్ను మొదలైన పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చెట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.
* వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.
* దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది.
* మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.
ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||
అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.
ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా|
తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే|
య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:|
ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:|
సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్|
ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||
ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్|
సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||
ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.
అభ్యంగన స్నానం : ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట . ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం -
1. వేడినీటి స్నానం --చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.
2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు --చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.
3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాలలోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.
4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మెదడు చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.
సముద్ర స్నానము:
మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.
కార్తీక స్నానము:
కార్తీకమాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణాలను విస్మరించరాదు. కార్తీకమాసంన వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెడు. కాబట్టి వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయాలన్న కుతూహలం కలవారు మాత్రమే వేడినీటి స్నానం చేయవచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి.
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.
మంత్ర స్నానం వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"
భౌమ స్నానం పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది "భౌమ స్నానం".
ఆగ్నేయ స్నానం సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది "ఆగ్నేయ స్నానం"
వాయువ్య స్నానం ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేయునది "వాయువ్య స్నానం"
దివ్య స్నానం లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
వారుణ స్నానం పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".
మానస స్నానం నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.
రావుల.రాంబాబు ॐ హిందు ॐ - హిందుత్వం నా ధర్మం. మా అమ్మ మరియు నా ధర్మం ఒకటే

Wednesday, July 1, 2015

మానవ జన్మని ఎట్లా వాడుకోవాలో తెలిపేదే రామావతారం !

మానవ జన్మని ఎట్లా వాడుకోవాలో తెలిపేదే రామావతారం !
మనిషి బుద్దిని సరిగ్గా వాడుకోవాలంటే కొన్ని స్థాయిలు ఉన్నాయి. మొదట శరీరాన్ని గుర్తించాలి. శరీరానికి తగినట్లు పనిచేయాలి. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరాన్ని పోషించుకోవాలి, దానికి తగినట్లు పనిచేయాలి, పనిచేయడానికి వీలయ్యేట్టు ఆలోచించాలి. ఇది ఒక మెట్టు. ఆలోచనలలో ఒక భాగం శరీరం కోసం వాడుకోవాలి, కానీ అక్కడికే సర్వస్వం కాదు, ఇక్కడితోనే ఆగిపోవడం కాదు, ఇది ఒక భాగమే. శ్రీకృష్ణుడు 6వ ఆధ్యాయంలో "యుక్త ఆహార యుక్త విహార యుక్త చేష్టశ్చ్య కర్మసు యుక్త స్వప్న యుక్త అవబోధ", ఇవన్నీ యుక్తంగా ఉండాలి, మానేయాల్సిన అవసరం లేదు. ఆహారం ఏవి ఎంతవరకు అవసరమో తెలుసుకొని తిని. హాయిగా తిరుగు, కానీ ఎవరెవరో తెలుసుకొని తిరుగు. ఏఏపనులు తగివవో ఏవి తగనినో తెలుసుకొని చెయ్యి. ఎంత అవసరమో అంత నిద్ర,ఎంత మెలుకువగా ఉండాలో అంత తప్పవు. శరీరానికి ఒక క్రమం ఉంది, ఆక్రమాన్ని గుర్తించి దాన్ని గౌరవించి జీవిస్తే అప్పుడు శరీర పోషణ తప్పుకాదు.

రెండో భాగం, ఈ లోకంలోకి తెచ్చే వ్యవస్థ ప్రకృతి, ఇది మనకు తల్లిగా, తండ్రిని ఇచ్చింది. వారికి వారి తల్లి తండ్రులు, మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందులో ఒకనిగా మనం వచ్చాం. మనంతట మనం స్వతంత్రంగా రాలేదు. శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఎంత భాగం ఆలోచిస్తున్నామో, అంత మన కుటుంబ విషయంలో కూడా ఆలోచించాలి. శరీరాన్ని కొంతకు మించి వాడుకోలేము. అట్లానే మనం జన్మించిన కుటుంబం యొక్క నియమాన్ని పాటిస్తూ, అందరిని గౌరవించి బ్రతకాలి. అందులో తల్లి తండ్రులు ఉండొచ్చు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఉండొచ్చు. హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి. జంతువులు వాటి హద్దులు తెలిసి ప్రవర్తిస్తాయి. తమ పిల్లలను ఎంత వరకు అవసరమో అంతవరకు పెంచుతాయి. మనుషులం కనక ఎంతవరకు చేయాలో చేసి, ఆపై పిల్లలు అడిగితే సలహా ఇవ్వడానికి ఉండాలి తప్ప అన్నింటిని తమపై పూసుకోకూడదు. "వార్ధకే ముని వృత్తినాం" ఒక కాలంలో వృద్దాప్యం వచ్చాక బాధ్యతలు అప్పగించి ప్రశాంతంగా భగవంతుని గురించి ఆలోచించుకొనే వారు. సలహాలు మాత్రం ఇచ్చేవారు. పిల్లలు పాటిస్తున్నారా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. చెప్పడం వరకు పెద్దల బాధ్యత. మాట వినక నష్టపోతుంటే పట్టించుకోనవసరం లేదు. హద్దులు ఉంటాయి అని గుర్తించాలి. అట్లా ఒక భాగం కుటుంబం కోసం ఆలోచించాలి, ఆ ఆలోచనని ఆచరణలోకి తేవాలి. ఇది రెండవ మెట్టు.

మన కుటుంబం చుట్టూ సమాజం ఉంది, కొన్ని కోట్ల సంస్కారాలు కలిగిన సమాజం ఉంది. దాన్ని గుర్తించి, దాన్ని ఇబ్బంది కలిగించకుండా, దానికి తగినట్లుగా మనం బ్రతకాలి. ఇది మూడో భాగం. శరీరం, కుటుంబం ఎంత వాస్తవమో సమాజం కూడా అంతే వాస్తవం, దాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇది మూడో మెట్టు.

సమాజంతో పాటు, రకరకాల ప్రాణికోటి జీవిస్తుంది, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. శాస్త్రం కూడా అదే చెబుతుంది. ప్రతి వస్తువు కూడా మన యొక్క ఉనికికి ఆధారమే. కొన్ని జీవుల ద్వారా మనం ఎక్కువ లాభం పొందవచ్చు, కొన్ని ఉపయోగపడక పోవచ్చు. కానీ వాటి కంటూ ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది, ఈ విశ్వంలోని ప్రతి వస్తువుకి మరొక వస్తువుకి పరస్పర సంబంధం ఉంటుంది. ప్రపంచంలో ఏమూల ఒక గడ్డిపోచ కదిలినా అది ప్రపంచం అంతటిమీదా ప్రభావం ఉంటుంది. ఎంత ఎలా అనేది మనం గుర్తించలేనంతగా ఉంటుందేమో కాని తప్పక ఒక ప్రభావం ఉంటుంది. మన శరీరంలో ఒక భాగంలో నొప్పి అయితే మరొక భాగం ఎందుకు స్పందిస్తుంది. ఈ ప్రపంచంలోని ధూలికణం కదిలినా, గాలి తరంగం వీచినా, చిన్న నీటి బొట్టు కదిలినా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుకీ స్పందన ఉంటుంది. అట్లా ప్రపంచంలో ఉండే ప్రతి జీవితో మనకు సంబంధం ఉంటుంది. కదిలే జంతువులే కాదు, కదలని చెట్లు, రాల్లు, గాలి అన్నింటితో సంబంధం ఉంటుంది. మన బుద్దిలో ఒక భాగం వాటికి కూడా కెటాయించాలి. మన చుట్టూ ఉండే ప్రాణికోటితో సహా ప్రకృతిలోని నీటితో, నేలతో, గాలితో అట్లానే ప్రవర్తించాలి. అందుకే వేదమంత్రాలలో "ఓం ద్యౌ శాంతిః అంతరిక్షగుం శాంతిః పృథివీ శాంతిః " ఆకాశానికి శాంతి కలుగుగాక, భూమికి శాంతి కలుగుగాక, అంతరిక్షానికి శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. ఇదంతా ఏమిటో చాదస్తం అని కొందరి అభిప్రాయం. అది ఎవడెవడికి వాడిదాకా వచ్చినప్పుడు అర్థం అవుతుంది. శరీరం పంచభూతాల కలయిక. ఒక్కో సారి ఒకటి ఎక్కువ, తక్కువ లైతే ఏమవుతుందో మనకు తెలుసు. ఆకాశం తక్కువైటే అంటే ఖాలి తక్కువ అయితే భుక్తాయసం. నీటి శాతం పెరిగితే శరీరం వాచి కష్టమే. ఒక్కో సారి వేడి శాంతం పెరిగి నీరు తగ్గుతుంది, అప్పుడు శరీరంలో నీటిని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రకృతిలో కూడా అంతే కదా. అది గుర్తించగలిగేవాడు మానవుడు. మన శరీరంలో మట్టి భాగం కానీ, నీటిభాగం కానీ, గాలి భాగం గానీ, అగ్ని భాగం గానీ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు మనకు. ఎది ఎక్కువైనా, ఏది తక్కువైనా ఇబ్బందే. అట్లానే ప్రకృతిలో ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇది నాలుగో స్థాయి.

ఈ శరీరాన్ని మనకిచ్చి, వెనకాతల ఉండి నడిపే తత్వం బ్రహ్మ తత్వం. దైవం అంటాం. పరమాత్మ అంటాం. అక్కడి దాకా గుర్తించి, మనకు దైవానికి ఉన్న సంబంధం గుర్తించి మన బుద్దిలో ఒక భాగాన్ని కెటాయించ గలిగితే అది ఐదవ భాగం. ఇది ఐదో మెట్టు.

ఈ ఐదింటికి మన బుద్దిలో ఒక్కో భాగం ఇచ్చి ఆలోచించగలగాలి, దాన్ని కార్య రూపం చేయాలి. ఒకదానితో ఒకటి పరస్పర భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగినటువంటివి, ఏదో ఒకదానికే మనం పూర్తిగా కెటాయిస్తే, అది సరికాదు. ఇవన్నింటిని ఆలోచించి బ్రతక గలిగితే మనిషి అంటారు. ఇది మానవ జన్మకు ఉన్న గొప్పతనం. అది గ్రహించి బ్రతికితే వేరే యోగాలు, యాగాలు చేయనవసరం లేదు, ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలోకి రానవసరం లేదు. అది మోక్షం అంటే. శరీరం పోతే మరోక శరీరం వస్తుంది, మనం అది కోరటంలేదు, ఈ కర్మ బంధం తొలగాలి అని కోరుకుంటుంన్నాం. ఆట్లా తొలగించుకొనే అవకాశం మానవ జన్మకు మాత్రమే ఉంది. జీవితాన్ని ఎలా వాడుకోవాలో, మన చుట్టు ఉండే వారి ప్రేమను ఎట్లా పొందగల్గుతామో, అట్లే వారిని ఆనందంగా ఉంచగలమో ఒకరు ఆచరించి చూపితే మనం కొంతనైనా సాధించగలం. ఇవన్నీ ఆచరించి చూపాడు శ్రీరామచంద్రుడు ఒక మానవుడిగా, ఆయన ఎలా ఆచరించాడు, ఎందుకు ఆచరించాడు, ఏమి ఆచరించడం తెలుసుకోవడం విలువలకి తిలోదకాలు ఇచ్చే ఈనాటి మన వంటి వారికి చాలా అవసరం.

Monday, June 29, 2015

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.
దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం.
పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ
నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి
కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి
దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు
కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి.
అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు
పాత్రులము అవుతాము.
1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి
వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట
కుంకుమ ధరించాలి.
2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి.
స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం,
ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి.
( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు-
మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.
ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని
ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి
తండ్రులు ప్రొత్సహించరాదు .)
3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి
దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో
వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం
ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే
నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని
ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను''
అన్నాడు.
4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి
నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని
నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత
అంతా దేవుడిపైనే ఉంచాలి.
7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం
చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు
స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.
8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి
అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి
చూస్తూ లీనం కావాలి.
9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు
నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే
సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద
ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు
హరణం ...'' అనే మంత్రం స్వయంగా
చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని
చప్పుడురాకుండా తీస్కోవాలి.
10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ
జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో
తీస్కోవాలి.
12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి
నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ
గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం
కూడదు.
14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం
ఉపయోగించకూడదు
15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల
గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
16) జననం, మరణం సంబంధించిన విషయాలపై
మాట్లాడకూడదు.
17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం
చేయకూడదు.
18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క
కూడదు.
19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో
వెళ్ళకూడదు.
21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త
దూరం నడిచి, తర్వాత తిరగాలి.
22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం
చేయకూడదు.
24) ఆలయంలో భుజించడం, నిద్రించడం
చేయకూడదు.
25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో
కూర్చోకూడదు.
26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస
ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో
బిల్వ దళాలను తుంచకూడదు.
29) ఆలయంలో స్నానం చేయకుండా
ప్రవేశించకూడదు.
30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం
చేయకూడదు.
31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను
కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ
చేయాలి.
32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు
నిదానం ప్రదానంగా ఉండాలి.
33) గోపుర దర్శనం తప్పక చేయాలి.
34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం
6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా
ఉండకూడదు.
Unlike · Comment ·

Sunday, June 28, 2015

సనాతన ధర్మం - తెలుసుకోదగ్గ విషయాలు

సనాతన ధర్మం
తెలుసుకోదగ్గ విషయాలు
1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.
49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.

Wednesday, June 17, 2015

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమలు

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమలు
1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.
3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
5)దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.
17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి

Wednesday, June 3, 2015

మొద‌ట ఒక్క వ‌ర్ణమే

ఎల్లరును బ్రాహ్మణులు కావ‌లెను.
మొద‌ట ఒక్క వ‌ర్ణమే
బ్రాహ్మణ‌, క్షత్రియ‌, వైశ్య‌, శూద్రవ‌ర్ణము లెట్లేర్పడెను?
వ‌ర్ణ వ్యవ‌స్థ యొక్క త‌త్త్వము తెలుసుకొన‌న‌చో ప్రజ‌ల‌లో ఐక్యత యేర్పడి ధ‌ర్మాచ‌ర‌ణ‌మున‌కు మంచి మార్గము క‌లుగును. ప్రధ‌మ‌ములో ప‌ర‌మేశ్వరుడొక్క బ్రాహ్మణుల‌నే సృష్టించెను. బ్రాహ్మణుల‌న‌గా బ్రహ్మనిష్టులు. కాని కాల‌క్రయేణ వారియందు బ్రహ్మనిష్ట త‌గ్గుట‌యు, ఇత‌ర క‌ర్మలయందు వారికి ఆస‌క్తిక‌లుగుట‌యు త‌ట‌స్థింప‌గా మిగతా వ‌ర్ణము లేర్పడిన‌వి. ప్రధ‌మ‌ములోని ద్విజులే తామ‌వ‌లంభించిన క‌ర్మల బ‌ట్టియు గుణ‌ముల బ‌ట్టియు క్షత్రియ‌, వైశ్య, శూద్రులైరి. బ్రాహ్మణుడొక్కడే ఆద‌ర్శపురుషుడు. బ్రాహ్మణ‌, క్షత్రియ‌, వైశ్య, శూద్రులు తిరిగి త‌మ బ్రహ్మనిష్టను పెంచుకొని బ్రహ్మణులు కావ‌ల‌సియున్నది. ఒక్క వ‌ర్ణము నుండియే మిగ‌తా వ‌ర్ణము లేర్‌యడిన‌ట్లు వేద‌మువ‌ల్లను మ‌హ‌భార‌తము వ‌ల్లను స్పష్టప‌డుచున్నది. 1. బృహ‌దార‌ణ్యక ఉప‌నిష‌త్తు, 1 అధ్యాయ‌ము 4వ బ్రాహ్మణము 11 నుండి 15 కాండ‌లు ఇచ్చట మొట్టమొద‌ట బ్రాహ్మణ‌వ‌ర్ణ మొక్కటియే వుండెన‌నియు, మిగ‌తావ‌ర్ణములు దానిలో నుండి సాంఘిక అవ‌స‌ర‌ముల‌నుబ‌ట్టి క‌లిగెన‌నియు బ్రాహ్మణుని జీవిత‌మే యెల్లవారికిని ఆద‌ర్శన‌మ‌నియు స్పష్టముగ వ‌ర్ణింప‌బ‌డి యున్నది. యీ శ్రుతిభాగ‌మున‌కు శంక‌రుడు వ్రాసిన భాష్యమునందు స‌యిత‌ము యిట్లే వ్రాసియున్నాడు.
మ‌హ‌భార‌త శాంతిప‌ర్వమునందు (186,187 అధ్యాయ‌ములు) బృహ‌దార‌ణ్యక శ్రుతియందు కొంచ‌ము క్లిష్టముగా చెప్పబ‌డిన యీ వ‌ర్ణవ్యవ‌స్థ బ‌హుచక్కగా భృగుమ‌హ‌ర్షిచే చెప్పబ‌డిన‌ది. భృగుభ‌ర‌ద్వాజుల‌కు జ‌రిగిన సంవాద‌ములో వ‌ర్ణర‌హ‌స్యము చెప్పబ‌డిన‌ది. భృగుభ‌ర‌ద్వాజులు గొప్ప ఋషులు. గోత్రకారులు. మ‌నువుచే ధ‌ర్మముప‌దేశించుట‌కు ఆదేశింప‌బ‌డిన వాడు భృగువు. భ‌ర‌ద్వాజుడు చాల‌కాల‌ము వేదాభ్యాస‌మునందు గ‌డ‌పినాడు. వారికి వ‌ర్ణధ‌ర్మము తెలియ‌ద‌ని చెప్పనొప్పడు. వారిద్దరికిని జ‌రిగిన సంవాదముయావ‌త్తు ప్రతివాడ‌ను చ‌దివితీరవ‌ల‌యును.
"అసృజ‌ద్ర్బాహ్మణానేవ పూర్వం బ్రహ్మప్రజాప‌తేః
ఆత్మతేజోభినిర్వృత్తాన్ భాస్కరాగ్ని స‌మప్రభాన్‌".
"త‌త‌స్సత్యంచ ధ‌ర్మంచ త‌నో బ్రహ్మచ‌శాశ్వతం
అచారం చైవ శౌ చంచ స్వర్గాయ‌విద‌ధే ప్రభుః"
"న‌వి శేషోస్థివ‌ర్ణానాం స‌ర్వంబ్రాహ్మ్యమిదంజగ‌త్‌
బ్రాహ్మణాః పూర్వసృష్టంహిక‌ర్మభిర్వర్ణతాంగ‌త‌మ్‌".
"కామ‌భోగ ప్రియాస‌క్తాః క్రోధ‌నాః ప్రియ‌సాహ‌సాః
త్యక్తస్వధ‌ర్మార‌క్తాంగా స్తేద్విజాః క్షత్రతాంగ‌తా".
"గోభ్యోవృత్తిం స‌మాస్థాయ‌పీతాః కృష్యుప‌జీవినః
స్వధ‌ర్మానానుతిష్టంతి తేద్విజా వైశ్యతాం గ‌తాః"
"హింసానృత క్రియాలుబ్ధాః స‌ర్వక‌ర్మో ప‌జీవినః
కృష్ణాః శౌచ‌ప‌రిభ్రష్టాస్తేద్విజాః శూద్రతాంగ‌తాః"
"ఇత్యేతైః క‌ర్మభిర్వ్యస్తా ద్విజ‌వ‌ర్ణాం త‌రంగ‌తాః
ధ‌ర్మోయ‌జ్ఞ క్రియా తేషాం నిత్యం న‌ప్రతిషిద్ధ్యతె".
"ఇత్యేతే చ‌తురోద‌వ‌ర్ణా యేషాం బ్రాహ్మీస‌ర‌స్వతీ
విహితా బ్రహ్మణా పూర్వం లోభాత్వజ్ఞాన‌తాం గ‌తాః"
"బ్రహ్మచైవ ప‌రంసృష్టం యేన‌జానంతి తేద్విజాః
తేషాంబ‌హు విధా స్త్యన్యాస్తత్ర త‌త్రహిజాత‌యః!
పిశాచారాక్షసా ప్రేతా వివిదామ్లేచ్ఛ జాత‌యః
ప్రన‌ష్టజ్ఞాన విజ్ఞానాః స్వచ్ఛందాచార‌చోష్టితాః"
ఆధ్యాత్మిత‌క సంప‌త్తిగ‌ల బ్రాహ్మణుల‌చే మొద‌ట సృష్టించెన‌నియు, అప్పుడు స‌త్యము, ధ‌ర్మము మొద‌లైన‌వి బాగుగానున్న వ‌నియు, వారిలో కొంద‌రు కామ‌భోగ‌ప్రియులై సాహ‌స కార్యముల‌బూని, స్వధ‌ర్మాచ‌ర‌ణ‌ము మానినందున క్షత్రియులైర‌నియు, మ‌రికొంద‌రు బ్రాహ్మణులు గోవుల పెంచుట‌, వ్యవ‌సాయ‌ము మొద‌లైన వృత్తుల న‌వ‌లంభింప‌చుట‌చే వైశ్యులైర‌నియు, మ‌రికొంద‌రు శౌచ‌ప‌రిభృష్టులై హింసావ‌లంబ‌కులై స‌ర్వక‌ర్మోప‌జీవు లైనందున వారు శూద్రులైర‌నియు, యీ విధ‌ముగా వేరు వేరు వృత్తుల న‌వ‌లంభించుట‌చే బ్రాహ్మణులు వ‌ర్ణాంత‌ర‌గుతు లైర‌నియు, యింకకొంద‌రు స్వచ్ఛందాచారులై మ్లేచ్ఛజాతులుగా యేర్పడి ర‌నియు పై శ్లోక‌ముల యొక్క భావ‌మైయున్నది. ఈ భావమునే అర‌ణ్యప‌ర్వములో యుధిష్టురుని గూర్చి వైశంపాయ‌నుడు చెప్పియున్నాడు.
"నకులేన న‌జాత్యావాక్రియా భిర్బ్రాహ్మణోభ‌వ‌త్‌,
చండాలోపిహివృత్తస్థో బ్రాహ్మణ‌స్సయుధిష్టర‌".
ఏక‌వ‌ర్ణ మిదంపూర్వం విశ్వమ‌సీద్యుధిష్టిర‌
క‌ర్మక్రియా విశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్టతం!!.
స‌ర్వేవైయోని జామ‌ర్త్యాః స‌ర్వేమూత్ర పురీషిణః
ఏకేంద్రియేంద్రియార్థ శ్చత‌స్మాచ్ఛీల గుణైర్ద్విజః!!
శూద్రోపి శీల‌సంప‌న్నో గుణ‌వాన్ బ్రాహ్మణోభ‌వేత్‌
బ్రాహ్మణోపి క్రియాహీనః శూద్రాత్ప్రత్యవ‌రో భ‌వేత్‌!!
న‌జాతిర్దృశ్యతేరాజ‌న్‌గుణాః క‌ళ్యాణ కార‌కాః
జీవితం య‌స్యధ‌ర్మార్ధం ప‌రార్ధే య‌స్యజీవితం!!
అర్థము :- కుల‌ముచేత‌ను పుట్టుకచేత‌ను కాదు. కార్యముల‌చేత‌నే బ్రాహ్మణుడ‌గును. మంచిన‌డ‌వ‌డి క‌ల‌వాడు చండాలుబైన‌ను వాడే బ్రాహ్మణుడు. పూర్వము యీ ప్రపంచ‌ము ఏక వ‌ర్ణముతో నిండియుండెను. క‌ర్మక్రియా విశేష‌ముచేత చాతుర్వర్ణ్వము ప్రతిష్టింప‌బ‌డిన‌ది. న‌రులంద‌రు యోని నుండి పుట్టినారు. అంద‌రును మూత్ర పురీష‌ములు క‌ల‌వారు. ఏక‌విధ‌మైన యింద్రియ‌ములున్ను వాని ప్రయోజ‌ర‌ల‌ములును గ‌ల‌వారు కాబ‌ట్టి స‌దాచార స‌ద్గుణ‌ము చేత ద్విజుడ‌గును. శూద్రుడైన‌ను స‌దాచార సంపన్నుడును, గుణ‌వంతుడునున‌గువాడు బ్రాహ్మణుడు అగును. బ్రాహ్మణుడైన‌ను, క్రియాహీనుడు శూద్రుని కంటెను త‌క్కువ‌వాడు. జాతియందేమియులేదు. గుణ‌ములే క‌ళ్యాణ‌దాయ‌క‌ములు. ఎవ‌నిజీవిత‌ము ధ‌ర్మార్థమును ప‌రోప‌కారార్ధమున‌గునో వాడే బ్రాహ్మణుడు.
స‌ద్వృత్తియే ప్రధాన‌ము
భార‌త అనుశాస‌నిక ప‌ర్వములో ఉమామ‌హేశ్వర సంవాద‌మందు మంచిప‌నులు చేయుట‌చేత శూద్రుడు బ్రాహ్మణ‌త్వమును పొందున‌నియు, వైశ్యుడు క్షత్రియ‌త్వమును పొందున‌నియు లోక‌ములో బ్రాహ్మణ‌త్వమంత‌యు స‌ద్వృత్తి చేత‌నే క‌లుగున‌నియు, స‌ద్వృత్తియందున్న శూద్రుడు బ్రాహ్మణ‌త్వము పొందున‌నియు స్పష్టముగ జెప్పబ‌డియున్నది.
"ఏభిస్తు క‌ర్మభిర్ధేవి శుభైరా చ‌రితైస్తథా
శూద్రో బ్రాహ్మణ‌తాంయాతి వైశ్యః క్షత్రియ‌తాం వృజేత్‌
స‌ర్వోయం బ్రాహ్మణోలోకేవృతైన చ‌విధీయ‌తే
వృతేస్థిత‌స్తు శూద్రోపిబ్రాహ్మణ‌త్వం నియ‌చ్ఛతి"
మ‌హ‌మునియైన ఋశ్యశృంగుడు లేడిక‌డుపున బుట్టియు వ్యాసుని తండ్రి మాల‌దానికి బుట్టియు, వ‌సిష్ఠ మ‌హ‌ముని వేశ్యకు బుట్టియు, త‌ప‌స్సు చేత బ్రాహ్మణులైర‌నియు దీనికి కార‌ణ‌ము సంస్కార‌మ‌నియు వేదము న‌నుస‌రించి భ‌విష్యత్పురాణ‌ము చెప్పుచున్నది.
"హ‌రిణీగ‌ర్భసంభూతో ఋష్యశృంగో మ‌హ‌మునిః!
శ్వపాకీ గ‌ర్భసంభూతో పితామ్యన‌న్య స‌త్తమః!!
గ‌ణికా గ‌ర్భసంభూతో వ‌సిష్ఠశ్చ మ‌హ‌మునిః!
త‌ప‌సా బ్రాహ్మణోజాతః సంస్కార‌స్త్ర త్రకార‌ణం"!!
వ్యాసుడు ప‌ల్లెదాని వ‌ల‌న‌ను ప‌రాశురుడు మాల‌దాని వ‌ల్లను బుట్టర‌నియు, పూర్వము ద్విజులు కానివార‌నేకులు బ్రాహ్మణ‌త్వమును పొందిర‌నియు భార‌తార‌ణ్య ప‌ర్వమునందున్నది.
జాతోవ్యాస‌స్తు కైవ‌ర్త్యాశ్శ్వ పాక్యాస్తుప‌రాశ‌రః
బ‌హ‌వోన్యేసి విప్రత్వం ప్రాప‌యే పూర్వమ‌ద్విజాః
3. మ‌హభార‌త వ‌న‌ప‌ర్వమందు (180 అధ్యాయం) జ‌న్మవ‌ల‌న బ్రాహ్మణుడు కాడ‌నియు వృత్తమే కార‌ణ‌మ‌నియు దానిని బ‌ట్టియే వ‌ర్ణము నిర్ణయించ వ‌ల‌యున‌నియు స్పష్టముగ చెప్పబ‌డి యున్నది. ఇది స‌ర్ప యుధిష్ఠిర సంవాద రూప‌క‌ముగా నున్నది. దానినిట వ్రాయుచున్నాను.
స‌ర్పః :- బ్రాహ్మణః కోభ‌వేద్రాజ వేద్యం కించ‌యుధిష్టిర ( ఓ ధ‌ర్మరాజా బ్రాహ్మణుడ‌న నెవ్వడు తెలిసినొన‌ద‌గిన‌దేది)
యుధిష్టిర :- స‌త్యందానం క్షమాశీల‌మానృశంస్యం త‌పోఘృణా దృశ్యంతే య‌త్రనాగేంద్ర స‌బ్రాహ్మణ ఇతిస్మృతః
(ఓ న‌గేంద్రుడా స‌త్యము, దాన‌ము, ఓర్పు, ఆచార‌ము, అహింస త‌ప‌ము, ద‌య‌, యెవ‌నియందుగ‌ల‌వో అట్టివాడు బ్రాహ్మణుడు.)
శూద్రేతు య‌ద్భవేల్లక్ష ద్విజేత‌చ్చ న‌విద్యతే
న‌వైశూద్రోభ‌వేచ్చూద్రోబ్రాహ్మణోన‌చ‌బ్రాహ్మణః
(పైన చెప్పిన గుణ‌ము లెవ‌నికిక‌ల‌వో వాడు జాతి శూద్రుడ‌య్యును శూద్రుడుకాడు. ఎవ‌నియందివిలేవో వాడు బ్రాహ్మణుడుయ్యును కాడు.)
య‌త్త్రెత‌ల్లక్ష్యతే స‌ర్ప వృత్తం స‌బ్రాహ్మణ‌స్స్హృతః
య‌త్త్రెత‌న్నభ‌వేత్సర్వం తంశూద్రమితినిర్దిశేత్‌
(ఓ స‌ర్పమా యీ గుణ‌ము లెవ్వనియందు కాన్పించుచున్నవో వాడే బ్రాహ్మణుడ‌ని యెన్నబ‌డుచున్నడు. ఎవ‌నియందీ గుణ‌ములులేవో వానిని శూద్రునిగా భావించ‌వ‌ల‌యును)
4.మ‌హ‌భార‌త అర‌ణ్యప‌ర్వము 312 అధ్యాయ‌ము 105, 106 శ్లోక‌ముల‌లో కూడ నీయ‌ర్ధయే చెప్పబ‌డిన‌ది.
య‌క్ష :- రాజ‌న్ క‌లేన‌వృత్తే న‌స్వాధ్యాయేన శ్రుతేన‌వా, బ్రాహ్మణ్యం కేన‌భ‌వ‌తి ప్రబ్రూహ్యేత‌త్సు నిశ్చితం.
యుధిష్టిర :- శ్రుణుయ‌క్షకులంతాత న‌స్వాధ్యాయోన చ‌శ్రుతం, కార‌ణం వాద్విజ‌త్వేచ వృత్త మేవ‌న‌సంశయః
5.మ‌హ‌భార‌త‌ము, వ‌న‌ప‌ర్వము 108.
న‌యోనిర్నాపి సంస్కారో, న‌శ్రుతం న‌చ‌సంత‌తిః
కార‌ణానిద్విజ‌త్వస్య, వృత్తి రే వ‌తుకార‌ణం
పుట్టుక‌వ‌ల్లగాని, సంస్కార‌ములు చేయుట వ‌ల్లగాని వేద‌ములు చ‌దివినంత మాత్రమునగాని పూర్వుల వ‌ల్లగాని బ్రాహ్మణు డ‌నిపించు కొన‌డు. న‌డ‌త‌నుబ‌ట్టియే బ్రాహ్మణుడ‌గున‌ని మ‌హ‌భార‌త‌ము వేద‌ధ‌ర్మమునే ఘోషిల్లుచున్నది.
6. మ‌నుస్మృతియందు స‌యిత‌ము వేద‌ధ‌ర్మావ‌లంబి కాని బ్రాహ్మణుడు శూద్రుడై పోవున‌నిము, అత‌డు కేవ‌ల‌ము నామ‌ధార‌క బ్రాహ్మణుడ‌నియు చెప్పబ‌డిన‌ది. అట్టివాడు కొయ్యయేనుగ‌కును తోలులేడికిని పోల్పబ‌డినాడు. ద్విజుడు వేద‌ము చ‌దువ‌క యిత‌ర‌త్రాశ్రమ చేసిన‌చో వాడీజ‌న్మములోనే యావ‌త్తు వంశ‌ముతో శూద్రత్వము పొందున‌నియు మ‌నువు చెప్పుచున్నాడు. (2 - 157, 168 )
బ్రాహ్మణుడు శూద్రుడు కావ‌చ్చున‌నియు. శూద్రుడు బ్రాహ్మణుడు కావ‌ల‌చ్చున‌నియు, క్షత్రయ వైశ్యుల యెడ‌ల‌ను యీ సూత్రమే వ‌ర్తించున‌నియు శుత్రి చెప్పిన‌రీతినే, మ‌నుస్మృతి అంగీక‌రించుచున్నది. శూద్రో బ్రాహ్మణ‌తామేతి, బ్రహ్మ వైశ్యౌన శూద్రతాం క్షత్రియా జ్జాత‌మేవంతు విద్యుద్వైశ్వాత్తధైవ‌చ‌. (10 - 65 )
జాతివ‌ల‌న‌నే బ్రాహ్మణుడు కాడు
7. వ‌జ్రసూచికోప‌నిష‌త్తు (సామ‌వేద‌ము) నందు యీ విష‌య‌ము వివ‌రింప‌బ‌డి యిద‌యే శ్రుతి స్మృతి పురాణేతిహ‌స‌ముల అభిప్రాయ‌మ‌నికూడా సృష్టప‌రుప‌బ‌డిన‌ది.
"త‌ర్హిజాతిర్బ్రాహ్మణ ఇతి చేత్తన్న త‌త్రజాత్యస్తరేష్వనేక జాతిసంభ‌వాత్ మ‌హ‌ర్ష‌యో బ‌హ‌వ‌స్సన్తి, ఋష్యశృంగో మృగ్యాచ కౌశికః కుశాత్‌, జాంబూకో జంబుకాత్‌, వాల్మీకో వ‌ల్మీకాత్‌, వ్యాసః కైవ‌ర్తక‌న్యాయాం, శ‌శ‌పృష్ఠాగ్గౌత‌మః వ‌సిష్ఠ ఊర్వశ్యాం, అగ‌స్త్యః క‌ల‌శేజాత ఇతి శ్రుతిత్వాత్‌, ఏతేషాం జాత్యావి నాప్యగ్రేజ్ఞాన ప్రతిపాదితా ఋష‌యో బ‌హ‌వ‌స్సన్తి త‌స్మాన్ న‌జాతిర్ర్బాహ్మణ ఇతి.
తాత్పర్యము వ‌ర్ణము బ్రాహ్మణుడ‌నిన యెడ‌ల‌న అదియు కాదు. ఒక వ‌ర్ణములోనే అనేక వ‌ర్ణములు క‌లుగుచుండుట వ‌ల‌న‌ను, అనేకులు మ‌హ‌ర్షులు ఋష్యశృంగుడు లేడివ‌ల‌న‌ను, కౌశికుడు ద‌ర్భవ‌ల‌న‌ను, జాంబూకుడు న‌క్కవ‌ల‌న‌ను, వాల్మీకుడు పుట్టవ‌ల‌న‌ను, వ్యాసుడు చండాల స్త్రీయందును, గౌత‌ముడు కుందేటివీపున‌ను, వ‌సిష్టుడూర్వశివ‌ల‌న‌ను, అగ‌స్త్యుడు కుండ‌యందును పుట్టిన‌ట్టు తెలియుచుండుట‌వ‌ల‌న‌ను, వీరిలో జాతిలేక‌యు జ్ఞాన‌ము క‌లుగ‌జేయు ఋషులు అనేకులుండుట చేత‌ను వ‌ర్ణము బ్రాహ్మణుడ‌న‌కూడ‌దు.
వేద‌ము కొన్ని ల‌క్షణ‌ముల‌ను చెప్పి్ప ఆ ల‌క్షణ‌ములు క‌ల‌వాడు బ్రాహ్మణుడ‌నియు- "ఇతి శ్రుతి స్మృతి పురాణేతిహ‌సానామ‌భిప్రాయః అన్యధా బ్రాహ్మణ‌త్వసిద్ధిర్నాస్త్యేవ" - అని ఖండిత‌ముగా ప‌లుకుచున్నది.
వ‌ర్ణము - గీత‌
శ్రీ భ‌గ‌వ‌ద్గీత‌యందు నాలుగు వ‌ర్ణములు ప‌ర‌మేశ్వరునిచే సృజింప బ‌డెన‌నియు, గుణక‌ర్మముల బ‌ట్టి వ‌ర్ణ నిర్ణయ‌ము త‌ప్పనియు నున్నటుల కొంద‌రు వాదించుట మ‌న‌ము వినుచున్నాము. ఇది కేవ‌ల‌ము పొర‌పాటు.
"చాతుర్వర్ణ్యం మ‌యాసృష్టం, గుణ‌క‌ర్మవిభాగ‌శః
త‌స్యక‌ర్తార మపిమాం, విధ్యక‌ర్తార‌మ‌వ్య‌యం"
ఈ కాల‌మందు వ‌ర్ణము త‌ల్లిదండ్రుల‌ను బ‌ట్టి నిర్ణయించున్నాము. శ్రీ‌కృష్టుడు వ‌ర్ణమును దేనినిబ‌ట్టి నిర్ణయించెను? "గుణ‌క‌ర్మవిభాగ‌శః". గుణ‌ముల‌ను బ‌ట్టియు, క‌ర్మను బ‌ట్టియు నిర్ణయించెను.
భ‌గ‌వంతుడు వ‌ర్ణముల‌ను సృష్టింప లేద‌నియు, మాన‌వులే వారివారి గుణ‌ముల‌ను బ‌ట్టియు, అవ‌లంభించిన వృత్తుల‌ను బ‌ట్టియు వ‌ర్ణములు సృష్టించికొనిర‌నియు ఈ శ్లోక‌మునందే క‌ల‌దు. "విథ్యకర్తారం" అనుప‌ద‌ముల‌లో యావత్తు అర్ధము యిమిడియున్నది. మ‌న‌ము బుద్ధిన‌నుస‌రించి తెచ్చుకొనిన‌వీ వ‌ర్ణములు. భ‌గ‌వంతుడు కేవ‌ల‌ము నిమిత్త మాత్రుడు. ఆయ‌న లేనిది సృష్టిలేదు గ‌నుక నేను చేసిన‌ద‌ని చెప్పుట త‌ట‌స్థించిన‌ది.
"స్వధ‌ర్మే నిధ‌నం శ్రేయః" (గీ. 3-35) అని చెప్పుట‌లో జాత్యతః వ‌ర్ణముల‌ను శ్రీ కృష్టుడు చెప్పన‌ని కొంద‌రి వాద‌న‌. ఇదియును స‌త్యమున‌కు దూర‌ము. స్వధ‌ర్మమ‌న‌గా స్వభావ‌నియ‌తంక‌ర్మ య‌ని వేరొక‌చోట గీత‌లో చెప్పబ‌డిన ధ‌ర్మయే.
అయితే ఒక వ‌ర్ణము వారియింట మ‌రియొక వ‌ర్ణము వారు భుజియింప వ‌ల‌యున‌ని గాని, అంత‌ర్వివాహ‌దులు చేసికొన‌వ‌చ్చున‌ని గాని నేను చెప్పుట‌లేదు. చ‌దువ‌రులు విప‌రీతార్ధమును చేసికొన‌కుందురు గాక‌.
సాంఘిక జీవ‌న‌ము యొక్క ప‌విత్రత‌, శౌచ‌ము కొర‌కు అట్టివికూడ‌వ‌నియే నా అభిప్రాయ‌ము. ఆధ్యాత్మిక జీవ‌న‌ము పెంపు చేసికొని బ్రహ్మనిష్టుల‌గుట‌యే మ‌దీయాశ‌య‌ము.
జాతి వ్యవ‌హ‌ర క‌ల్పిత‌ము
శుక్లయ‌జుర్వేద‌గ‌త నిరాలంబొప‌నిష‌త్తునందు జాతియ‌నున‌ది వ‌ట్టి భ్రమ‌య‌నియు లోక‌ములో వ్యవ‌హ‌ర‌ముసాగ‌గ‌లందుల‌కు క‌ల్పిత‌మ‌నియు చెప్పబ‌డిన‌ది.
న‌చ‌ర్మణోన‌రక్తస్య, న‌మాంస‌స్యన‌చాస్థినః
న‌జాతిరాత్మనో, జాతిర్వ్యవ‌హ‌ర ప్రక‌ల్పితః
తా!! జాతిదేహ‌ము మీద నుండు చ‌ర్మమున‌కులేదు. రక్తమున‌కులేదు, మాంస‌మున‌కు లేదు. ఎముక‌కు లేదు. ఆత్మకు లేదు. జాతియ‌నున‌ది వ్యవ‌హ‌ర‌ము నిమిత్తము క‌ల్పింప‌బ‌డియున్నది. లోక‌ము న‌డ‌చుట‌కు క్షత్రియ వైశ్య శూద్రు ల‌వ‌లంభించు క‌ర్మల‌వ‌స‌ర‌మ‌గుట‌చే ఎవ‌రు చేయుక‌ర్మను బ‌ట్టి వారికి ఆవ‌ర్ణము పేరు పెట్టినారు. "క‌ర్మభిర్ వ‌ర్ణతాంగ‌తః" అని భృగుమ‌హ‌ర్షి చెప్పిన‌దియే య‌ధార్ధము.
పురుష‌నూక్త మంత్ర వివ‌ర‌ణ‌ము
1. కొంద‌రు ఋగ్వేద‌ములోని పురుష‌సూక్త భాగమంద‌లి బ్రాహ్మణోస్యముఖ‌మాసీత్ !బాహూరాజ‌న్యఃకృతః, ఊరూత‌ద‌స్యయ‌ద్వైశ్య ! ప‌ద్భ్యాంశూద్రో అజాయ‌త !! అను మంత్రము వ‌ల్ల నాల్గువ‌ర్ణములును బ్రహ్మనుండి పుట్టిన‌వ‌ని లేని అర్ధము చెప్పుచున్నారు. ఆ మంత్రము ఎందుల‌కు చెప్పబ‌డిన‌దో, దాని విశాల భావ‌మేమో వారు యోచింప‌క పైకి క‌నుప‌డురీతినైన‌ను గ‌మ‌నింప‌క విప‌రీతార్థమును చెప్పుచున్నారు.
ఆమంత్రలు ఒక అలంకార‌మ‌ని ముందు గుర్తెరుగ వ‌ల‌యును. ఆమంత్రము గొప్ప సిద్ధాంత‌ముల‌ను సూచించుచున్నది. మాన‌వ‌కోటి యావ‌త్తును భ‌గ‌వంతుని సంతాన‌మ‌ని మొద‌టి సిద్ధాంత‌ము. మాన‌వుల‌లో వారివారి గుణ‌క‌ర్మల‌ను బ‌ట్టి మార్పులున్నవ‌నియు, వారువారు ప‌నుల‌ను శ‌రీర‌మున‌కు ఆయా అవ‌య‌వ‌ములు యేలాగున వేరువేరు ప‌నినిచేసి నిలుపుచున్నచో, భ‌గ‌వంతుని సృష్టిలో లోక‌సంగ్రహ‌వు జ‌రుగుట‌కు అన‌గా స్వార్థప‌ర‌త్వముతో త‌మ మంచి కేకాక లోక‌ము యావ‌త్తు బాడుప‌డ‌గ‌లందుల‌కు చేయ‌వ‌ల‌యున‌ని రెండ‌వ సిద్ధాంత‌ము. సృష్టియావ‌త్తును ప‌ర‌మేశ్వరుని స్వరూప‌మే యనున‌ది మూడ‌వ సిద్ధాంత‌ము.
ఋగ్వేద‌ములోని పురుష‌సూక్త భాగ‌ము నిట‌కొంత చ‌ర్చింత‌ము. మంత్రార్ధము లోగ‌డ‌నే తెలుప‌బ‌డెను. పాద‌మువ‌ల‌న శూద్రుడు పుట్టెను అను వాక్యమునుబ‌ట్టి బ్రాహ్మణాదులు త‌త్తద‌వ‌య‌వ‌ముల‌నుండి పుట్టిర‌ని కొంద‌రు సాంప్రదాయ‌కులు వాదింప‌బూనిరి. కాని సూక్తముల‌లోని 11వ మంత్రములోని ప్రశ్నల‌కు 12వ మంత్రము ఉత్తరున‌ని వారు గ‌మ‌నింప‌రైరి. య‌త్పురుషం వ్యద‌ధాః ! క‌ధితావ్యక‌ల్పయ‌న్‌, ముఖంకిమ‌స్య కౌబాహూ ! కావూరూపాదావ్రచ్యేతే !!
(దేవ‌త‌లు) పురుషుని క‌ల్పించిప్పుడు, ఎన్ని విధ‌ములుగా క‌ల్పించిరి అత‌నికి ముఖ‌మేది బాహూవులేవి ఊరువులేవి పాదములేవి (అని ప‌లుక బ‌డుచున్నవి.)
2. ఇంతేకాక పురుష‌సూక్త మందు వ‌ర్ణింప‌బ‌డిన పురుష య‌జ్ఞాదిక‌ము యావ‌త్తు మాన‌సిక‌మే యైయున్నది. లేనిచో విప‌రీతార్ధము త‌ట‌స్థించును. వాచ్యార్ధమును గైకొనిన‌చో ఛాంద‌సుల‌నియే చెప్పవ‌ల‌సి వ‌చ్చును. 6 వ మంత్రమును చూడుడు.
"య‌త్పురుషేణ‌హ‌విషా దేవాయ‌జ్ఞమ‌త‌న్వత‌,
వ‌సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మఇధ్మశ్శర‌ద్ధవిః"
(పురుషుడ‌ను హ‌విస్సుతో దేవత‌ను య‌జ్ఞము చేసిన‌ప్పుడు దానికి వ‌సంతఋతువు నెయ్యియు, గ్రీష్మఋతువు స‌మిధ‌యు, శ‌ర‌దృతువు హ‌విస్సును అయ్యెను.) ఇంద‌లి య‌జ్ఞము హొమ‌ద్రవ్యములు కేవ‌ల‌ము మాన‌సిక‌మ‌ని చెప్పమ‌ల‌యును గాని పైన‌క‌న‌ప‌డురీతిని అర్ధము చెప్పన‌గునా?
3. పురుష సూక్తములోని మొద‌టి మంత్రమున‌కైన‌ను వాచ్యార్ధము చెప్ప నెవ్వడు సాహ‌సించును?.
"స‌హ‌స్రశీర్షాపురుషః స‌మ‌స్రాక్షస్సహ‌స్రపాత్‌
స‌భూమిం విశ్వతోవృత్వా అత్యతిష్ఠద‌శాంగులం"
(పురుషుడు వేయిశిర‌స్సులు క‌ల‌వాడు, వేయిక‌న్నులు గ‌ల‌వాడు. వేయిపాద‌ములు గ‌ల‌వాడు. భూమినంత‌ట ఆవ‌రించి ప‌ది అంగుళ‌ములు మించినిలుచును.)
ఇంతవరుకు ఓపికగా చదివిన వాళ్ళు ఇంకా తెలుసుకోవాలంటే
http://www.syamasahithi.com/vedicreligion ని సంప్రదించండి.

Sunday, May 10, 2015

facts of fast food

దయచేసి షేర్ చేయండి..........కనీసం చదవండి..........ప్లీజ్............ఇలాంటి పోస్టింగ్స్ వల్ల ఒక్కరైనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నమ్మకంతో...........

దినేష్ అనే వ్యక్తి తన మాటలతో నిజాలను చెప్పి ....తను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరెవరూ పోగొట్టుకోకూడదని భావించి తాను చేసిన తప్పిదాలను మనకు తెలియజేశారు.......

దినేష్ అనే వ్యక్తి .ఫాస్ట్ ఫుడ్డు సెంటర్ నిర్వహించిన ఓ యజమాని.......5 నిమిషాలలో 400 రూ; సంపాదించేవాడు.......తనకు జరిగిన ఓ సంఘటననే
అతని నోటివెంట నిజాలను చెప్పించింది......తాను చేసిన ఆహారాన్ని తానేతిని
చాలా అనారోగ్యంతో ఇలా చేప్పాడు........అతను చెప్పిన నిజాలు ఇవి.......

1.ఫాస్టు ఫుడ్డు షాపులో వాడే చికెను తాజా అయినది కాదు.. . ....నిన్నటిది......మొన్నటిది........ఒక్కోసారి ఒకవారం క్రితంవి కూడా వాడుతాము.
చెడిపోయిన చికెనును వెనీగరులో ముంచి వాటి వాసన కస్టమర్లకు
తెలియకుండా చేస్తాము.

2.చికెను రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెనుకు ఆరెంజ్ కలరును
వాడి రంగును మారుస్తాము.......ఆ కలరును మీ చేతిలో వేసుకుని ఒక నిమిషం
తరువాత కడిగితే ఆ కలరు వారం రోజులవరకు పోదు......అలాంటి కలరు మీ
కడుపులోకి పోతే........

3.సోయా సాస్ ....రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ,,,,,,,10 రోజుల క్రితం
కాగి కాగి మరరిగిన నూనెతో కలిపి వాడుతాము........

4.ఏ షాపులోనూ మంచి నూనె వాడరు...పామాయిలు తప్ప ఏదీ వాడరు....

5.కళాయిలో అన్నం అంటుకుపోకుండా,ఎక్కువగా పామాయిలును వాడి,
తొందరగా,లేటు లేకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తాము,,,,,,,,,

6. చెపితే నమ్మరు.........ఆ కళాయిలను రోజుల తరబడి కడగనే కడగము........\
నూనే జిడ్డుపోయి మళ్ళీ లేటు అయితే పక్క షాపుకు వె్ళ్ళిపోతారని........
I
7. అజినోమోటో అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు...........మేము దాన్ని
చాలా ఎక్కువగా వాడుతాము.......మీరు ఒక్కసారి దాన్ని మీ నాలుక మీద
పెట్టుకుని చూడండి మీ కే తెలుస్తుంది......

8. తెల్ల మిరియాలపొడి లో చేతికి దొరికిన పిండిని కలిపి వాడుతాము......ఆ పిండిలో
పురుగులు కూడా ఉంటాయి.......

9.టొమాటో సాస్ .......ఎక్కువమోతాదులలో కొనిపారేస్తాము.........అందువల్ల
అవి చెడిపోయినా,,,,,,,,,exp.date అయిన వాటిని కూడా వాడేస్తాము..

10.చిల్లీ సాస్ .....వాడుతున్న బాటిలును మీ ముక్కుదగ్గర పెట్టుకుని చూడండి.
ఆ వాసనకు మీకు వాంతులు రాక మానవు......

5 నిమిషాలలో 8 ప్లేట్లు అందిస్తాము........ఒక్కొక్క ప్లేటు 50 రూ......అంటే
5 నిమిషాలలో 400 సంపదించేవాడిని....కానీ డబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నానే కానీ నేను నా పిల్లలు కూడా అవి తిని చాలా అనారోగ్యంతో
బాధపడుతున్నాము..........చేసిన తప్పును చెప్పుకుని మీలో కొంతమందిలో
అయినా మార్పు రావాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ......తప్పుకు శిక్ష అనుభవిస్తూ.........8,000 జీతానికి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను...........ఆ ఫాస్టుఫుడ్డు సెంటరును మూసేసి ఇలా నిజాలను మనకు చెప్పి..........కనీసం మనలో కొందరైనా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని

మూలము 

ఆదిశంకరులు – ఐదు అశ్రుకణాలు ( మాతృదినోత్సవ సందర్భంగా)

From Shri కొంపెల్ల రామకృష్ణమూర్తి Time Line
ఆదిశంకరులు – ఐదు అశ్రుకణాలు
( మాతృదినోత్సవ సందర్భంగా)
శంకరుల అద్వైతప్రచార జైత్రయాత్ర అప్రతిహతంగా జరుగుతోంది. కాలటిలో ఆర్యాంబ మరణ శయ్యపై ఉంది. ఆమె శంకరులను స్మరించింది. ఎంతో దూరంలో ఉన్న శంకరులకు ధ్యానం చెదరింది. ఇది ఏ తర్కానికీ అందని స్పందన. తల్లి అవసాన దశలో ఉన్నట్లు గ్రహించారు. యోగశక్తితో వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, తత్త్వోపదేశం చేసి సద్గతిని కలిగించారు. ఆమెకు ఉత్తరక్రియలు ఆయనే చేయవలసి వచ్చింది.
ఆ సందర్భంలో ఆయన చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధాలు. అంతటి జగద్గురువు, పరమేశ్వరాంశ, లోకానికి దుఃఖ నివృత్తిమార్గం చెప్పిన అద్వైతసిద్ధాంత ప్రతిష్ఠాత - మాతృమూర్తి మృతికి స్పందించిన తీరు అనిర్వచనీయం. "విరాగికి రాగమేమిటి ?" అనే తర్కానికి ఇక్కడ తావులేదు. ఆ మహామహుడు మాతృవాత్సల్యాన్ని గౌరవించిన తీరు - అందరికీ తమ తల్లుల పట్ల మంచి ఆలోచనను కలిగించాలి.
ఆ శ్లోకాలూ, వాటి స్థూలభావాలూ ఇవీ -
1. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కమ్.
“నా ముత్యానివి ! నా రత్నానివి ! నా కంటి వెలుగువు ! కుమారా ! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో అమ్మా ! ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను !
2. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిః.
"అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అంటూ పంటిబిగువున ప్రసవవేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ ! నీకు నమస్కరిస్తున్నాను.
3. ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమో
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.
అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను అనుభవించావో కదా ! కళను కోల్పోయి, శరీరం శుష్కించి,శయ్య మలినమైనా - సంవత్సరకాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావోకదా ! ఎవరైనా అలాంటి బాధను సహించ గలరా ? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు అంజలి ఘటిస్తున్నాను.
4. గురుకులముపసృత్య స్వప్నకాలేపి తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం
సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః.
స్వప్నంలో నన్ను సన్యాసివేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా !
5. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ గావా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న దత్తో మాతస్తే మరణసమయే తారక మనురకాలే
సంప్రాప్తే మయి కురు దయాం మాతరతులామ్.
అమ్మా ! సమయం మించిపోయాక వచ్చినందువల్ల మరణసమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని ఉచ్చరించలేదు. నన్ను క్షమించి, నాయందు తులలేని దయ చూపించు తల్లీ !
ఈ ఐదు శ్లోకాశ్రు కణాల్లోనూ "మాతృదేవోభవ" అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్ఠితమై ఉంది. మహిత వేదాంత ప్రవచనానికే కాదు – మహనీయ మాతృభక్తిప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.
(శంకరుల సన్న్యాసాశ్రమ స్వీకారానికి సంబంధించి, వారి మాతృదేవి మరణాన్ని గూర్చి భిన్న కథనాలు లోకంలో ఉన్నాయి)

Tuesday, April 14, 2015

వేసవి కాలం జాగ్రత్తలు


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.
రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి చిట్కాలు:--
1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.

2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
🍂🍃🍂🍃
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
Important note ***
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.
<<HEALTH IS WEALTH>>
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

Tuesday, April 7, 2015

వనవాసం నుండి పట్టాభిషేకం వరకు తిధులు

వనవాసం నుండి పట్టాభిషేకం వరకు తిధులు
గొవిందరాజియము ఉత్తరప్రాంత గ్రంధము అందువలన తిధి,నక్షత్రాలు వారి ఆచారము ప్రకారము వుంటాయి.వారిది బార్హస్పత్యమానము మనది చాంద్రమానము. మనకన్నా వారు 30 రోజులు ముందు వుంటారు. ఇది గమనించగలరు. పొస్ట్ నందు వున్న తిధులు ఉత్తరాది గ్రంధము. ప్రకారము వున్నాయి
1వ రోజున చైత్ర శుద్ధ దశమినాడు వనవాసప్రయాణము.రాత్రి తమసాతీర వాసము.
2వ రోజున జాహ్నవీ తీరవాసము - గుహుని రాక.
3వ రోజున గంగాదక్షిణ తీర తరువు క్రింద వుండుట.
4వ రోజున ప్రయాగలో వుండుట,భరద్వాజ దర్శనము.
5వ రోజున యమునాతీర వాసము,చిత్రకూట ప్రవెశము.
6వ రొజున సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుట,రాత్రికి దశరధుని మృత్యువు.
7వ రొజున కౌసల్యాదుల విలాపము భరతునికై దూతలను పంపుట.
8వ రొజునుండి 12వ రోజువరకు భరతుని అయోధ్యా ప్రయాణము.
13వరొజున పౌరలౌకిక కర్మ.
14వరొజున నుండి 17వ రోజువరకు వనమార్గము బాగు చేయుట.
18వరొజునుండి 20వ రోజువరకు భరతుని వన ప్రయాణము.
21వరొజూనుండి 23వరోజువరకు భరతుడు రాముని వద్ద నుండుట.
24వరోజునుండి 27వ రొజూవరకు భరతుడు అయోధ్యకు పాదుకలతో వచ్చుట.
45వ రొజున పాదుకా పట్టాభిషేకము.

శ్రీరాముడు చిత్రకూటమున పదిన్నర మాసములుండెను.మొదటి సంవత్సరము ఇట్లు గడిచెను.పిదప చిత్రకూటము విడచి దండాకారణ్యమున ప్రవేశించి ఋషుల ఆశ్రమములను చూచుచూ గడిపినవి 10సంవత్సరములు.పిదప పంచవటిలో ఓకటిన్నరసంవత్సరములు గడిపేను.ఈ విధముగా 12.5 సంవత్సరములు పూర్తి అయ్యెను.
13వ సంవత్సరము కొంచము మిగిలి వుందనగా మాఘశుద్ధ అష్టమినాడు విందము అన్న ముహుర్తములో రావణుడు సీతను అపహరించినాడు.
* జ్యేష్ట శుద్ధ పౌర్ణమి వాలి వధ.
* కార్తీక్ శుక్ల పాడ్యమి వరకు సుగ్రీవ పట్టాభిషేకము.
* 4మాసములు వర్షాకాలము సీతా అన్వేషణ జరుగలేదు.
* కార్తీకము చివర లక్ష్మణ ఆగ్రహము, అక్కడి నుండి మార్గ శిర్షము వరకు సీతాన్వేషణ.
* హనుమంతుడు మార్గశిర శుద్ధ ఏకాదశిన లంకా ప్రవేశము.అర్ధరాత్రిన సీతా దర్శనము.
* ద్వాదశినాడు వృక్షము పైనుంచి రావణుని చూడటము.సీతతో సంభాషణ.
* త్రయోదశీనాడు అక్షాది వధ.
* చతుర్దశినాడు లంకా దహనము.
* మరలా వానరులతో కలయకకు 5 రోజులు.
* మార్గశిర శుక్ల షష్టినాడు మధువన భంజనము.
* అష్టమినాడు ఉత్తర నక్షత్రమున విజయాఖ్య ముహుర్తమున రామ దండు ప్రస్థానము.
* పుష్య పాడ్యమికి సముద్ర తీరమునకు చేరుట.
* పుష్య శుక్ల చవితీకి విభిషుణుడు రాక.
* పంచమికి సముద్రముదాటుటకై అలోచన
* పిదప 4 దినములు సముద్రుని రాముడు ప్రార్ధించుట,ప్రాయోప్రవేశమునకు యత్నము.
* దశమికి సేతుబంధన ప్రారంభము.
* త్రయోదశికి సేతుబంధనము పూర్తి.
* చతుర్దశికి రాముడు సువేలగిరిని నెక్కుట.
* పుష్య పౌర్ణమి నుండి బహుళ విదియ వరకు సైన్యము దాటుట.
* తదియ నుండి దశమివరకు సేనా నివేశము
* ఏకాదశిన రావణ అదేశముపై శుకసారణులు వచ్చి రామసేనను చూచుట.
* ద్వాదశి వానరసేన గణనము
* అమావాస్య రాక్షసేన గణనము.
* మాఘ శుద్ధ పాడ్యమి అంగద రాయభారము.
* విదియ నుండి అష్టమి వరకు వానర రాక్షస యుద్ధము.
* నవమిరాత్రి ఇంద్రజిత్ నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించుట.
* దశమీ గరుత్మంతుని ఆగమనము నాగపాశవిమోచనము
. * ఏకాదశి,ద్వాదశిలలొ ధుమ్రాక్షవధ,
* త్రయోదశినాడు అకంపన వధ.
* చతుర్దశినుండి బహుళ పాడ్యమి వరకు యుద్ధము నీలుడు ప్రహస్తుని చంపుట,రాముడు రావణుని మకుటభంగము.
* పంచమి నుంచి చతుర్దశివరకు కుంభకర్ణునితో యుద్ధము
. * అమావాస్య యుద్ధ విరామము.
* ఫాల్గుణ పాడ్యమి నుంచి చవితివరకు నరాంతక వధ.
* పంచమి నుంచి సప్తమి వరకు అతికాయుని వధ.
* అష్టమి నుంచి ద్వాదశి వరకు కుంభ,నికుంభుల వధ.
* పిదప మూడురొజులు మకరాక్షవధ.
* ఫాల్గున శుద్ధ విదియ ఇంద్రజిత్ యుద్ధము.
* తదియనుంచి సప్తమి వరకు యుద్ధ విరామము.
* త్రయోదశినాడు ఇంద్రజిత్ వధ.
* చతుర్దశి యుద్ధ విరామము.
* ఫాల్గున అమావాస్య రావణుని యుద్ధ యాత్ర.
* చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి రామ రావణ యుద్ధము.
* నవమి రావణపలాయనము.లక్ష్మణ మూర్చ సంజీవిని తెచ్చుట.
* దశమి యుద్ధ విరామము.
* ఏకాదశి ఇంద్రుడు రామునకు రధము పంపుట.
* ద్వాదశినుంచి బహుళ చతుర్దశి వరకు 18 రోజులు రామ రావణ యుద్ధము.
* చతుర్దశి రావణ వధ.
* అమావాస్య రావణునికి సంస్కారము.
* మొత్తము 18రోజుల విరామము,72 రోజుల యుద్ధము.
* వైశాఖ శుద్ధ పాడ్యమి విభీషుణుని పట్టాభిషేకము.
* తదీయ సీత అగ్నీ ప్రవేశము.
* చవితీ పుష్పక విమానము ఎక్కి భరద్వాజ ఆశ్రమమునకు రాక.
* షష్టి నంది గ్రామములో భరతుని కలియుట.
* వైశాఖ శుద్ధ నవమి శ్రీరామ పట్టాభిషేకము............Alapati Ramesh Babu

Friday, March 20, 2015

వదిలేయమంటారా ??

రోజూ అందరూ ఇక్కడ రామాయణ,భారతాలు, సనాతన గ్రంధాలు, పురాణాలు, దేవుని కధలు ...ఇత్యాదివాటిపై నిప్పులు చెరుగుతున్నారు కదా ... చాలామంది ఆనాటి కాలపు పురాతన ఆచారాలు నేడు పాటిస్తావా అని ప్రశ్నిస్తున్నారు కదా.. వారు ఈ అజ్ఞానికి ఒక్క సలహా ఇవ్వగలరు.
-----------------------------------------------------------------------------
మీరంటున్న అవే పుక్కిట పురాణాల నుండి నేను నేర్చుకున్నవి కొన్ని ఉన్నాయి.
మరి వాటిల్ని వదిలేయమంటారా??

౧) పెద్దలను గౌరవించుట (రాముని చూసి)
౨) వదినని తల్లిగా గౌరవించుట/భావించుట ( లక్ష్మణుని చూసి)
౩) తమ్ముడు అనుబంధం ఎలా ఉండాలో నేర్చుకున్నా (భరతుని చూసి)
౪) పరాయి స్త్రీ ని కామిస్తే ఎంత గొప్పవాడైనా మట్టి కరుస్తాడు అని తెలుసుకున్నా (రావణ బ్రహ్మ ను చూసి )
౫)ధర్మానిదే తుది గెలుపు అని చూసి నేర్చుకున్నా
౬)బంటు/సేవకుడు ఎలా ఉండాలో నేర్చుకున్నా
7)౭ బాధ్యత ఎలా నిర్వర్తించాలో నేర్చుకున్నా
8)౮ వెళ్తున్న మార్గం మంచిదైనప్పుడు ఎవరెన్ని చెప్పినా ఆ మార్గమును వీడకూడదన్నది నేర్చుకున్నా (ప్రహ్లాదుని చూసి)
9)౯ గొప్పతనం అనేది బాధ్యతను నిర్వర్తించటంలో ఉన్నదని తెలుసుకున్నా
10)౦౧ మంచిదే పై చేయి అని తెలుసుకుని చెడు సావాసాల జోలికి పోకూడదని నేర్చుకున్నా
11)౧౧ నా జీవితాన నేటి వరకు నలుగురిలో నాకు పేరు తెచ్చిపెట్టిన ప్రతీ సంధర్భం నాకు పురాణాలు పెట్టిన భిక్ష
1౧౨) జూదం లో మునిగితే నువ్వెంత గొప్పవాడివైనా , ఎంత గొప్ప జూదరి వైనా అన్నీ మరచి అధ:పాతాళానికి పోతావని మాయాజూదాన్ని చూసి తెలుసుకున్నా
౧౩) కష్టాలొచ్చినా కుంగిపోక , ధర్మమార్గమును వీడక ముందడుగు వేయాలని నేర్చుకున్నా
౧౪) ఏ పరిస్థితుల్లోనైనా ఆలిపై చేయి చేసుకోరాదని, తన వారిని వదిలి నాతో జీవితాన్ని పంచుకోవటానికి వచ్చిన ఆమెను అన్ని వేళలా తోడుగా ఉండాలని నేర్చుకున్నా.
౧౫) సన్మార్గం ఎంత ఉన్నతమైనదో తెలుసుకున్నా
౧౬) పుట్టుకని బట్టి కాదు గుణాన్ని, చేసే పనిని , వాడి సంస్కారాన్ని బట్టి వాడి వర్ణం లెక్క వేయాలని నేర్చుకున్నా (చాతుర్వర్ణాం మయా సృష్టం గుణ కర్మ విభాగస:) [అంటే భేదం చూపడానికి కాదు]
17)౭౧ ప్రతి జీవిలోనూ పరమాత్ముడున్నాడని తెలుసుకుని అన్నిటినీ సమానంగా చూడడం నేర్చుకున్నా
౧౮) జన్మనా జాయతే సూద్ర: సంస్కారేన జాయతే ద్విజ: అన్న సూత్రం ప్రతి మనిషికీ వర్తిస్తుందని తెలుసుకున్నా.
19)౯౧ విచక్షణ, విశ్లేషణ నేర్చుకున్నా
౨౦) నీ ప్రయత్నం నీవు చేయనిదే లాభం ఏం ఉండదు.
౨౧) వక్రవ్యాఖ్యానాల జోలికి అసలు పోకూడదు అని తెలుసుకున్నా

"గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం"" అన్న చందాన ప్రవర్తించకూడదు ,
కష్ట పడడం వరకు మనచేతిలో ఉంటుంది . ఫలితం మన చేతుల్లో ఉండదు అన్న విషయాన్ని అర్ధం చేసుకున్నా
______________________________
పాత మట్టి చిప్ప తినడానికి పనికిరాకపోవచ్చు కానీ లెక్కలేనంత విలువ చేస్తుంది (పురాతన వస్తువు)
ఇవన్నీ స్వతహాగా తెలుసుకోలేని మూర్ఖుడను , పురాణాలలోని వాటిని ఉదాహరణలుగా తీసుకుని చిన్నప్పటి నుంచి నన్ను(సాధారణంగా ప్రతి ఇంటిలోనూ అంతే) పెంచారు .
నన్ను ఏం చేయమంటారు మరి??
సుష "సౌ"రభాలు #సుషస్వరాలు

Tuesday, March 17, 2015

మన పురాణాలు - శాస్త్రీయత

మన పురాణాలు ఎంతో శాస్త్రీయమైనవి. ప్రాచీన ఋషులు గొప్ప వైజ్ఞానికులు.. ఈమాటంటే , నమ్మని వారు , అదెలా ? అని అడగొచ్చు కానీ , వారికి తెలిసిందీ , వారు విన్నదీ , వారికి నచ్చిందీ తప్ప మిగిలినవన్నీ చెత్త అని పరిహాసము చేయుట , " వారు నేర్చినది వారికేమి నేర్పినదో " తెలుపుతుంది, అంతే..
ఉదాహరణకు , మనస్సును గురించి పురాణాలలో అనేకచోట్ల ఎలా వర్ణించారో చూడండి,
" మనస్సు కు అధిదేవత చంద్రుడు. మనస్సును ప్రేరేపించునవి మోదుగ వంటి సమిధల హవనపు ధూమము. "
నవగ్రహమంత్రాలలో చంద్రునికి సంబంధించిన మంత్రము , " ఆప్యాయస్వ సమేతుతే... " అనేది. అంతే కాదు , పంచామృతాలలో పాలతో అభిషేకం చేసేటప్పుడు చెప్పే మంత్రము కూడా అదే !! అంటే , చంద్రునికీ , పాలకూ ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.. మరి చంద్రుడు పుట్టింది పాల సముద్రములోనే కదా ?
పద్మ పురాణములో , " శివుడు మనో నియామకుడు " అనీ , " విష్ణువుపై మనస్సును నిలుపునట్లు చేసేవాడు శివుడు " అనీ ఉంది.
మన మనస్సు మన ఆధీనములో ఉండదు. దాని ఇఛ్చవచ్చినట్టు పరుగెడుతుంది. శివుడు మనో నియామకుడైనప్పుడు , మనసు శివుని నియంత్రణలో ఉంటుందే కానీ మన ఆధీనములో ఎందుకుంటుంది?, అందుకే , మనకు చిత్తశుద్ధి, మంచి బుద్ధీ కలగాలంటే ఆ శివుడినే వేడుకోవాలి. శివుడికి క్షీరాలాభిషేకం చేసేది అందుకే..
మనస్సును , దాని అధిదేవతనూ , మనో నియామకుడినీ , మనసును ప్రభావితం చేసే పదార్థములనూ ఇంతగొప్పగా అనుసంధానము చేసి చెప్పే పు

Friday, March 6, 2015

నిర్భయ మీద డాక్యుమెంటరీ - by విభాతమిత్ర

నిర్భయ మీద డాక్యుమెంటరీ

నిర్భయ మీద డాక్యుమెంటరీ

చాలామంది, ఆ డాక్యుమెంటరీ లో తప్పేముంది ? నిజాలే కదా ? మనోభావాలను దెబ్బతీయలేదు కదా ? వాస్తవాలను అంగీకరించక, బ్యాన్ చేస్తే ఉపయోగమేమి ? అని అడుగుతున్నారు.

అయ్యా, మాంసము తింటారు కదా అని ఎవరూ ఎముకలు మెడలో వేసుకొని తిరగరు.  ఎందుకు తిరగరంటే అదొక సంస్కారము.

ఆ డాక్యుమెంటరీ తీసినావిడ తన పద్ధెనిమిదేళ్ళ వయసులో మాన భంగానికి గురయ్యిందట . చాలా యేళ్ళు ఆత్మ న్యూనత తో బాధపడిందట. నిర్భయ కేసు , స్పందనలూ చూసి , ధైర్యము వచ్చి , తన తప్పేమీ లేదని గ్రహించి , అటువంటి కాముకుల మనస్తత్త్వాలు ఎలాగుంటాయో కనుక్కుందామని వచ్చిందట.
ఆమె ఉద్దేశం బాగున్నా , ఇక్కడికే ఎందుకు రావాలి? మెడ అటూఇటూ తిప్పి చూస్తే కాముకులు అక్కడే ఎక్కువ కనపడరా ? అంటే , నిర్భయ కేసును ఉపయోగించుకొని , శవం మీద మరమరాలు ఏరుకొనే ఉద్దేశమే కదా ?  రామ్ గోపాల్ వర్మ 26/11 సంఘటనలో ఆ ప్రదేశాన్ని దర్శించుట కూడా అదే ఉద్దేశంతోనే కదా ?  అంతే కాదు , భారత్ ను తక్కువ చేసి చూపించే ప్రయత్నమే ముఖ్యోద్దేశంగా కనబడుతుంది. దాన్ని కప్పిపుచ్చటానికి,  నిజమో కాదో తెలీని తన అనుభవాన్ని అడ్డుపెట్టుకోవటమొకటి.
పైగా , ఆ డాక్యుమెంటరీ తీసేందుకు ఒప్పుకున్న షరతులను ఉల్లంఘించి బీబీసీ కి అమ్ముకుంది.

సరే , దాన్ని చూస్తే తప్పేమి , ఎందుకు బ్యాన్ చేయాలి?

పైన ’ సంస్కారం ’ గురించి ఉటంకించాను.

అంటే అదిచూస్తే మన సంస్కారాలు పాడవుతాయా ? అందరూ రేపిస్టులవుతారా ?

" అ.ను.మా.న.మా ? "

" ఎలా ?"

ఇక్కడే అందరూ అయోమయానికి లోనవుతుంటారు. ఏవో కొన్ని చూసినంత మాత్రానో , చదివినంత మాత్రానో , అవి మనల్ని ప్రభావితం చేస్తాయా ?
 అది అర్థం చేసుకోవాలంటే మొదట సంస్కారాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవాలి.
ప్రతి మనిషికీ అయిదు రకాల సంస్కారాలుంటాయి. ఈ  అయిదింటిలో ఏది / ఏవి బలంగా ఉంటే మనిషికి ఆ ప్రవృత్తులొస్తాయి.

మొదటగా , మానవులందరికీ పుట్టుకతోనే , వచ్చే ఆత్మ సంస్కారము. అది అందరికీ సమానముగా ఉంటుంది.. ఏది మంచి , ఏది చెడు అర్థం చేసుకో గలిగే సంస్కారము.
రెండోది, పూర్వ జన్మ వాసనల వల్ల వచ్చేది. దీని వల్లనే కొందరికి దొంగతనమంటే అసహ్యము , కొందరికి మక్కువా. మనం ఈ రెండింటి గురించి ఏమీ చేయలేము. ఎలా వచ్చినదాన్ని అలా స్వీకరించడమే. అయితే , ఇవే మన ప్రవర్తనలను నిర్దేశిస్తాయి అని చెప్పుటకు వీలు లేదు. మిగిలిన మూడూ చాలా ముఖ్యమైనవి. వాటిని నియంత్రించ వచ్చు తద్వారా సంస్కారాలనూ , ప్రవర్తననూ మెరుగుపరచవచ్చు.

మూడోది, తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారము. ఇది ఇంటినీ , ఇంట్లోని ఆచారాలనూ , తల్లిదండ్రుల ప్రవర్తననూ బట్టి వచ్చేది. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. వారినుండీ పిల్లలు ఎన్నో చూసి, గమనించీ నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. అందుకే పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పూజలూ , ప్రార్థనలూ అనుష్ఠానాలు చేసేది.

నాలుగోది, వ్యక్తి ఇఛ్చాశక్తి అంటే విల్ పవర్ నుండీ వచ్చేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా , దేన్నో చూసి ప్రేరణ పొంది , లేదా , యే గురువుగారినుండో ఉపదేశము పొంది,  ’ తనకు అది దొరకాలంటే  తాను ఇలాగుండాలి," అని గట్టిగా నిర్ణయించుకోవడము. అలాగే ప్రవర్తించడము. ఈ నాలుగోది కూడా మనిషి ప్రవర్తనకు ఒక కారణము.

ఇక , అయిదోది , ఇదే మనకు ప్రస్తుతము అయోమయాన్ని కలిగిస్తున్నదీ , రకరకాల వివాదాలకు కారణమవుతున్నదీను. అదే , పరిస్థితులూ , స్నేహితులూ , చుట్టూ ఉన్న వాతావరణపు ప్రభావము. దీన్ని కొంచం వివరంగా తెలుసుకోవలసిన అవసరముంది.

మనం ఏదైనా చూసినప్పుడో , చదివినప్పుడో , కొన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి [ ఈ ఆలోచనలకు కారణము ,కొంతవరకూ పైని మూడు సంస్కారాలే] . ఆ ఆలోచనలు ఊరికే వచ్చి పోతే ఫరవాలేదు , కానీ వాస్తవంలో అలా జరగదు. ఆ వచ్చిన ఆలోచనలు ఏదో ఒక అనుభూతిని కలిగిస్తాయి. అది సంతోషమో , కోపమో , కామమో ,  ఇంకేదో కావచ్చు. అటువంటి ఆలోచనలే పదే పదే వచ్చినపుడు , మళ్ళీ మళ్ళీ అవే అనుభూతులు కలుగుతాయి. అవి అలా మరలా మరలా కలగడము వలన వాటి ముద్రలు [ ఇంప్రెషన్ ] మనమెదడులో పడి, మనకొక ’ ధోరణి ’[ Attitude ] కలుగుతుంది. ఆ ధోరణికి తగినట్టే మనం ఇతరులతో వ్యవహరిస్తాము. మన ప్రవర్తన ఆ ధోరణిని బట్టే ఉంటుంది. మన ప్రవర్తన నుండీ మనం ఇతరులకు తదనుగుణమైన ఒక శక్తి , అంటే ’పాజిటివ్ ఎనెర్జీ’ లేక ’నెగెటివ్ ఎనెర్జీ ’ ని ప్రసారం చేస్తాము. వారు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది వారి సంస్కారాలను బట్టి ఉంటుంది.

మొత్తానికి మన ప్రవర్తనకు కారణము మన ధోరణి, ధోరణికి కారణము మన ఆలోచనలు , ఆలోచనలకు కారణము మనము చూసినవీ , చదివినవీ , విన్నవీ. వాటిని ఎన్నిసార్లు చూస్తే / చదివితే / వింటే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి ? అన్నది , మనిషి మనిషికీ మారుతుంది. ఇతర సంస్కారాలు గట్టిగా ఉంటే , ఆ ఆలోచనలు ఏమీ చేయలేవు. కానీ ఎవరి సంస్కారము ఎంత గట్టిదో ఎవరు చెప్పగలరు ? అందుకే చెడు వినవద్దు , చూడవద్దు , కనవద్దు అన్న సూత్రాన్ని మహాత్మా గాంధీ అంతగా నమ్మి మూడు కోతిబొమ్మలను తన దగ్గర ఉంచుకున్నది !

ఇప్పుడు చెప్పండి, వాటిని[ చెడు విషయాలను ] చూడటం మంచిదా ?

Thursday, March 5, 2015

సహజ సిద్ధమైన హోళీ రంగుల తయారీ...

ప్రజాసంక్షేమార్ధం "సేకరించి" ఈ విషయాన్ని
జారీచేస్తున్నవారు smile emoticon smile emoticon ...............................మూర్తి ™
హోలీ రంగులు సహజ" సిద్ధం" గా... హెల్దీ హోలీ - హేపీ హోలీ
పసుపు
ఇది చాలామందికి తెలిసిన చిట్కా. పసుపుపొడిని నీళ్లలో కలిపితే చాలు. అవి చిక్కగా, పెద్దమొత్తంలో కావాలంటే ఆ నీళ్లలో శనగపిండి కలుపుకోవాలి. ఆ ద్రావణంతో స్నానం ఎంతో ఆరోగ్యకరం. పసుపు యాంటిబయాటిక్గా పనిచేస్తుంది. శనగపిండి మనశరీరంపై పట్టి మట్టిని శుభ్రం చేస్తుంది. సాధారణంగా నలుగుపెట్టుకోవడానికి ఈ పిండినే వాడతారన్నది అందరికీ తెలిసిందే. దీనికి కాస్త రోజ్వాటర్, కస్తూరి దట్టిస్తే ఇక ఆ సువాసన మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ శనగపిండి ఇష్టం లేదనుకోండి...మైదా, గోధుమ, వేరుశనగ పొడినీ వాడుకోవచ్చు. లేదంటే పసుపుచామంతి, పసుపు బంతిపూలు, తంగేడు పూల పొడిని నీళ్లలో కలుపుకోవచ్చు. ఈ పూలపొడిని లేదా పూలను నీళ్లలోవేసి మరగబెడితే రంగు స్పష్టంగా కన్పిస్తుంది.
ఎరుపు
ఎర్రచందనం పొడిని, ఎర్ర మందార పువ్వుల పొడిని ఎర రంగుకోసం వాడుకోవచ్చు. ఈ పొడికి మన ఇళ్లలో ఉండే ఏ పండిని కలిపినా పెద్దమొత్తంలో రంగును సిద్ధం చేసుకోవచ్చు. సింధూరపళ్లతోనూ ఎరుపురంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎర్ర దానిమ్మ గింజలు, లేదా తొక్కలను నీళ్లలో మరగనిస్తే ఎర్రటిరంగునీళ్లు సిద్ధం అవుతాయి. రాత్రంతా ఎర్రమందార పూలను నీళ్లలో నానబెట్టి ఆ తరువాత వేడిచేస్తే చక్కటి ఆరోగ్యకరమైన ఎర్రటినీళ్లు సిద్ధమవుతాయి.
కాషాయరంగు
మోదుగ పూలతోకూడా కాషాయ రంగు నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు మోదుగపూలతో తయారుచేసిన రంగునీళ్లతోనే హోలీ ఆడాడని పురాణాలు చెబుతున్నాయి.. ఎండబెట్టిన మోదుగ పూలను, వాటి బెరడునుకూడా రంగుల తయారీకి వాడుకోవచ్చు.
నీలిరంగు
నీలి మందార పూలు, నీలిరంగులో మెరిసిపోయే జకరందా పూలతో పొడిని తయారు చేసుకోవచ్చు.
మెజంటా
బీట్రూట్ ముక్కలను రాత్రంతా నీళ్లలో నాననివ్వండి, పొద్దునే్న వాటిని మరిగించండి. చక్కటి మెజంటా రంగులో నీళ్లు సిద్ధం. ఇక ఎర్ర ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో రాత్రంతా నాననివ్వండి. పొద్దునే్న ఆ ముక్కల్ని తీసిపారేయండి. నీళ్లుమాత్రం ఎర్రగా మెరుస్తూంటాయి.
నలుపు
రాసి ఉసిరికాయలు, మామూలు ఉసిరికాయలని ఇనుపగినె్నలో మరిగిస్తే నల్లని నీళ్లు సిద్ధమవుతాయి. చల్లారాక వాటిని రాత్రంతా నిల్వ ఉంచితే పొద్దున్నకల్లా మరింత నల్లగా తయారవుతాయి. వాటివల్ల ఆరోగ్యంకూడా బాగుంటుంది. ఇక నల్లని ద్రాక్షపళ్ల గుజ్జును నీళ్లలో కలిపితే నల్లనిరంగు నీళ్లు తయారవుతాయి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. ఇక మందార ఆకుల పొడి, రంగురంగుల క్యాబేజీలు, క్యారెట్లు, బీర ఆకుల పొడి, గుమ్మడి గుజ్జుతోకూడా రంగరంగుల నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. గోధుమరంగు
కిళ్లీలో ఎర్రటి రంగుకోసం వాడే కాసు - ఆ బెరడును నీళ్లలో మరగనివ్వాలి. దానికి కాస్త కాఫీ ఆకులు కలిపితే మంచివాసన, మంచి రంగు పడతాయి.
ఆకుపచ్చ
పొడిరంగు కావాలనుకుంటే గోరింటాకుల పొడిని, కాస్త మైదా, లేదా వరి పిండిలో కలుపుకుంటే చాలు. దీనికి ఎట్టిపరిస్థితిలోనూ నిమ్మరసం కలపొద్దు సుమా. అది కలిస్తే వచ్చే ఎరుపురంగు వచ్చేసి ఓ పట్టాన వదలదు. గుల్మొహర్ పూలనుకూడా ఎండబెట్టి పొడిచేసి ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు. గోధుమగడ్డిని ముద్దచేసి నీళ్లలో కలిపితే అదికూడా ఆకుపచ్చరంగులోనే ఉంటుంది. పుదీనా ఆకులనూ ముద్దగా నూరి నీళ్లలో కలిపితే ఆకుపచ్చరంగునీళ్లు సిద్ధం. పైగా ఇవి మంచి వాసననూ కలిగి ఉంటాయి. టమాటా, కొత్తిమీర ఆకులనూ ఇలా ముద్దగా చేసి నీళ్లలో కలపొచ్చు. గోరింటాకు పొడిని నీళ్లలో కలిపితే అవీ ఆకుపచ్చగా కన్పిస్తాయి.
ఓపిక లేని వాళ్లు ఈ ప్రకృతి ప్రసాదించిన పళ్లు, పూలు, కూరగాయలు, ఆకులతో తయారైన పొడిని అమ్మే ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి సరసమైన ధరలకు కొనుగోలు చేసుకోవచ్చు.
google _/\_

Wednesday, March 4, 2015

సంస్కారము ఎలా అబ్బుతుంది ?

సంస్కారము. సంస్కారము దేని వలన అబ్బుతుంది? పూర్వ జన్మల వాసనలను బట్టి. పూర్వ జన్మల వాసనలు బట్టి త్రిగుణాల సమ్మేళనం వుంటుంది. దాని నిష్పత్తి మారుతూ వుంటుంది. మరి ఈ జన్మలో మంచి సంస్కారం అబ్బ లేదు. పోయిన జన్మలో మంచి కర్మ, పుణ్య కార్యం చేయ లేదు. కావున ఈ జన్మలో మంచి బుద్ధి రాలేదు. మంచి రాత రాలేదు. మంచి సంస్కారం లేదు కాబట్టి, ఈ జన్మలో కూడా మంచి పని చేయడానికి బుద్ది రాదు, మనసు రాదు. కాబట్టి వచ్చే జన్మలో కూడా మంచి సంస్కారం రాదు. ఇది ఇలాగే కొనసాగిపోతుంది.
మరి ఏలాగ? ఉద్ధతి ఏలాగ ఈ జీవికి? బాగు పడడానికి మార్గం లేదా?
వున్నది.
సత్ స్సాంగత్యం. మహా పురుషుల మాటలు బలవంతంగానైనా విని తీరాలి. ఏందుకంటే మన మనస్సు వినదు మంచి మాటలు. గురువులు చెప్పే ప్రవచనాలు వినదు! పైగా దేవుడు వున్నాడా? అని ప్రశ్నిస్తుంది? పైశాచిక సిద్దాంతాన్ని లేవదీస్తుంది, వితండ వాదం చేస్తుంది, అంతా చాదస్తం, మూఢ నమ్మకాలు అని మన చేత అనిపిస్తుంది. దేవున్ని, ధర్మాన్ని నమ్మదు. గురువుల మాట చెవి కేక్కించుకోదు. ఓక గుడికి పోదాము అని వుండదు. మంచి మాటలు తలకేక్కవు.
ఇక్కడే జాగ్రత్తగా వుండాలి. ఇక్కడే మనకు మన పురాణాలు, వేద వాంజ్ఞ్మయం అక్కరకు వస్తుంది. మన పెద్దలు, గురువులు ఆచరించి చేసి చూపించి వున్నారు. కళ్లు మూసుకొని గ్రుడ్డిగా వారి మార్గంలో బలవంతంగానైనా సరే మనసు మార్చుకొని నడవడమే. నీ తల్లి నీకు చెడు చెప్పదు. నీ తండ్రి నీకు అబధ్ధం చెప్పడు. నీ గురువులు నీకు అధర్మం భోధించరు. మరి నీకు ఏందుకు అప నమ్మకం. అనుసరించు భక్తి మార్గంలో పెద్దలు చెప్పినట్లు. సత్ స్సాంగత్యం ఏర్పర్చుకో. మహా పురుషులు పుట్టిన నేల ఇది. మహా వాక్యములు విను. ప్రవచనాలు విను. రామాయణ, మహాభారతాది గ్రంధములను చదువు. ఈ జన్మలో నీ బాట మార్చుకో. నీ మార్గం మార్చుకో. సన్మార్గంలో నడువు. వచ్చే జన్మకు నీ వాసనలు మార్చుకో. అంతే మంచి సంస్కారం, మంచి పుట్టుక, మంచి బుద్దులు, మంచి తల వ్రాత లభిస్తుంది. కావలసినది నిన్ను అరిచి తగవులాడి, నాలుగు తన్ని నీ మార్గాన్ని మార్చే గురువు కావాలి. నీ పాపాన్ని హరించి వేసే గురు దేవుళ్లు కావాలి అంతే. పరమ భాగవత్తోత్తములు పుట్టిన నేల. గొంతు చించుకొని కష్టపడి అరిచి, ప్రాణం అడ్డుగా పెట్టి ప్రవచించే పరమ గురువులు, ఆది గురువులు పుట్టిన నేల ఇది. చేయవలసినదంతా వారి అడుగు జాడలలో నడవడమే. నేను వినను అంటే ఏలాగ?
మరి నడుద్దామా! ..........

Wednesday, February 11, 2015

భారతీయ యోగ విజ్ఞానం

భారతీయ యోగ విజ్ఞానం
నేటి ఆధునిక మానవుడు దైనందిన జీవన సమస్యలతో కృంగిపోతూ తనను తాను నియంత్రించలేక అనేక ఆధునిక ఔషధాలతో ఈ సమస్య తొలిగించలేక యోగఃశరణం గచ్చామి అంటున్నాడు. మన భారతీయ సమాజం కూడా ఇటువంటి నాగరిక వ్యాధులతో సతమతమవుతూ ఉన్నది. వీరిలో చాలామంది నేడు ఉదయమే లేచి "యోగా" ఆచరిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు పాశ్చాత్య దేశాలలో కూడా వేగవంతమైన, అనురాగ రహితమైన జీవన విధానానికి బలౌతున్న ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు యోగా ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఇందరిని ఆకర్షిస్తున్న "యోగ" భారతీయ ఋషి పరంపర అందించిన గొప్ప బహుమతి. యోగా అనగా అది కేవలం ఇప్పుడు మనం భావిస్తున్నట్లు ఆసనాలు మరియు రోగాలను తగ్గించే "థెరపీ" మాత్రమే కాదు, యోగా ఒక జీవన విధానం. భారతీయ సంస్కృతిలో అన్నింటా కనిపించే తత్వమే "యోగా". యోగా అనగా కలవటం అని అర్థం. జీవాత్మ - పరమాత్మతో కలవటం మొదలు ప్రతి అనుసంధానం ఒక యోగక్రియ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 'యోగాని'కి నిర్వచనం చెప్పాడు. అసలు గీతయే ఒక యోగశాస్త్రం. స్థిత ప్రజ్ఞత సాధించటమే యోగం. "యోగఃకర్మసుకౌశలం" పనిలో నిపుణత సాధించటమే కర్మ, రాజయోగాలు. ఇది కాకుండా "హఠయోగ"మనే శరీరాన్ని ఆరోగ్యవంతం చేసే ఆసన ప్రక్రియ విశ్వవ్యాపితంగా ప్రసిద్ధి చెందింది. "తంత్రయోగ"మనే తాంత్రిక శాస్త్రం కూడా ఉన్నది.
1. భక్తి యోగం - ప్రేమ, దైవకృప కోసం భగవంతునితో అనుసంధానం కోసం మానవుని తపన భక్తియోగం.
2. కర్మయోగం - ఫలాపేక్ష రహితంగా స్వకర్మను ఆచరిస్తూ జీవించటమే కర్మయోగం.
3. జ్ఞానయోగం - వివేకం, విచారాలతో తన ఉనికిని గ్రహించటం, ఎరుకగల జీవన విధానమే జ్ఞానయోగం.
4. హఠయోగం - ఆసనములు ప్రాణాయామము ద్వారా శరీరాన్ని, మనసును సరైన స్థితిలో ఉంచి జీవన కాలాన్ని పెంపొందించటం హఠయోగం.
5. తంత్రయోగం - వివిధ మంత్ర, యంత్రాలతో శక్తి ఉపాసన మొదలైనవి యోగ ప్రక్రియలు ఆచరించి మహిమలు పొందగలగటం తంత్రయోగం.
6. రాజయోగం - శ్వాస నియంత్రణ, ఇంద్రియ నియంత్రణలతో, చిత్తవృత్తులనిరోధించటమే రాజయోగం. 'రాజయోగం' దీనిని యోగా అనే సామాన్య అర్థంలో ఉపయోగిస్తున్నారు. దీనినే అష్టాంగయోగ పద్ధతి అంటారు. పతంజలి మహర్షి యోగ సూత్రాల ద్వారా ఈ 'యోగ విద్య'ను మనకు అందించారు. మనిషి సిద్ధ పురుషులయ్యే ప్రక్రియలు చాలా శాస్త్రీయంగా, విపులీకరించాడు పతంజలి మహర్షి.
అష్టాంగ యోగ పద్ధతి: 1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యాన, 8. సమాధి.
1. యమ:- ఇది ఐదు అంగాలు. 1. అహింస, 2. సత్య, 3. బ్రహ్మచర్య, 4. అపరిగ్రహ, 5. అస్తేయ(దొంగతనం చేయకుండా ఉండటం)
2. నియమ:- ఇవి కూడా ఐదు అంగాలు. 1. శౌచము, 2. సంతోషము, 3. తపస్సు, 4. స్వాధ్యాయనం, 5. ఈశ్వర ప్రణిధానము.
3. ఆసనము:- ఇందులో పలు రకాలైన ఆసనాలు కలవు. ఉదా: పద్మాసనం, హలాసనం, శీర్షాసనం, సూర్యనమస్కారాలు వంటివి.
4. ప్రాణాయామ:- శ్వాస నియంత్రణమే ప్రాణామాయ.(రచక, పూరక, కుంభక)
5. ప్రత్యాహార:- భౌతిక ఆకర్షణల నుంచి ఇంద్రియాలను నిగ్రహించటం.
6. ధారణ:- మనసును, శరీరంలో ఒక స్థానంలో కేంద్రీకరించటం.
7. ధ్యానం:- ధారణను నిరంతరాయంగా ఏకాగ్రతతో, జాగృతితో ఆచరించటమే ధ్యానం.
8. సమాధి:- ధ్యానంతో కూడా ప్రయాణించి, ఇంద్రియ జ్ఞానాలను, మనసును దాటి వెళ్లి దైవంతో అనుసంధానం పొందటమే సమాధి. ధారణ, ధ్యానం, సమాధి అనే ఈ చివరి మూడు ప్రక్రియలను కలిపి పతంజలి "సంయమనం" అని అన్నాడు. ఒక యోగి ఈ సంయమనాన్ని పొందినప్పుడు ఆ వ్యక్తికి మానవాతీత శక్తులు లభిస్తాయి. వీనిని పతంజలి ఇలా వివరించాడు.
1. భూత - భవిష్యత్ తెలుస్తుంది.
2. పక్షులు, జంతువుల భాష అవగతం అవుతుంది.
3. తన పూర్వజన్మలు తనకు తెలుస్తాయి.
4. ఇతరుల మనసులు చదవగలడు.
5. శరీరాన్ని మాయం చేయగలడు.
6. మరణాన్ని నియంత్రించగలడు.
7. సృష్టి రహస్యాలు తెలుసుకోగలడు.
8. ఆకలి, దప్పులను జయిస్తాడు.
9. నీటిని, అగ్నిని సృజించగలడు, మార్చగలడు.
10. దూరపు విషయాలు తెలుసుకోగలగటం వంటి శక్తి పొందగలడు(టెలీపతి).
11. భారరహిత శక్తిని పొందగలడు.
ఇలా దాదాపు 40 రకాల సిద్ధులు మనిషి యోగనిష్టితో పొందగలడు అని పతంజలి తన "యోగసూత్రాలలో" చెప్పాడు. భగవంతునితో అనుసంధానం కోసం "యోగసాధన" ప్రారంభించిన యోగి మధ్యలో లభించే ఇటువంటి "సిద్ధుల" ఆకర్షణకు లొంగితే పరిపూర్ణమైన, పవిత్రమైన అంతిమ సత్యాన్ని చేరుకోలేడు అని పతంజలి మానవాళిని హెచ్చరించాడు. మానవ శరీరంలో ఆరు "యోగచక్రాలు" ఉంటాయి. మనిషి వెన్నెముకను "మేరుదండము" అని అంటారు. ఇందులో "ఇడ, పింగళ, సుషుమ్న" అనే మూడు నాడులుంటాయి. ఇందులోని సుషుమ్న నాడి ఆరు చక్రాలను కలుపుతుంది. అవి: 1. మూలాధారము, 2. స్వాధిష్టాన, 3. మణిపూరక, 4. అనాహత, 5. విశుద్ధ, 6. ఆజ్ఞాచక్రం. శిరస్సులో 7వ చక్రం. "సహస్రార చక్రం" కూడా ఉంటుంది. మూలాధార చక్రంలో ఉన్న "కుండలిని"ని యోగవిధానంలో జాగృతం చేసి తలలోని సహస్రా పూరక చక్రంతో అనుసంధానం చేయటమే కుండలినీ యోగం.
*మూలాధార చక్రం - వెన్నెముక చివరన, మల ద్వారం దగ్గర ఉంటుంది.
*స్వాధిష్టానం - మర్మావయవాల వద్ద ఉంటుంది.
*మణిపూరక చక్రం - నాభి వద్ద ఉంటుంది.
*అనాహత చక్రం - హృదయంలో ఉంటుంది.
*విశుద్ధ చక్రం - కంఠంలో ఉంటుంది.
*ఆజ్ఞా చక్రం - రెండు కనుబొమల మధ్య ఉంటుంది.
*సహస్రార చక్రం - శిరస్సులో ఉంటుంది.
*ఇట్లు యోగరీతులు, యోగవిధానాలు ఎన్నో ఉన్నాయి. భారత జీవన విధానమే ఒక యోగమయం. దీనిని ప్రతి ఒక్కరు సక్రమంగా ఆచరిస్తే విశ్వశాంతి లభిస్తుంది. ఇంతటి మహోన్నత శాస్త్రాన్ని అందించిన ఆ ఋషి పుంగవులకు ఈ ప్రపంచం సర్వదా ఋణపడి ఉంటుంది.

Wednesday, February 4, 2015

జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్య శాస్త్రం
జ్యోతిష్యం వేదంగాలలో ఒకటి. వేద పురుషునికి కన్ను వంటిది. అంటే వేదాలను అధ్యయనం చేసేటప్పుడు వేదంగామైన జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉండాలి. వేదకర్మలు నిర్వహించటానికి కాలం చాలా ముఖ్యమైనది. కాలానుగుణంగా యజ్ఞయాగాదులు నిర్వహించటం కోసం జ్యోతిష్య శాస్త్రం ఆవిర్భవించింది. "జ్యోతి" అంటే వెలుగు. జ్యోతిష్య శాస్త్రమంటే వెలుగును తెలిపే శాస్త్రం. కానీ ఈ శాస్త్ర విజ్ఞానమంతా నేడు భవిష్యత్తుని తెలుసుకొనే విద్యగా ప్రఖ్యాతి గాంచింది. జ్యోతిష్యశాస్త్రం ఒక అపురూపమైన విజ్ఞానం. అది నమ్మకం కాదు. భవిష్యత్తుని తెలపటం అందులో ఒక చిన్న భాగం మాత్రమే. ఆధునిక విజ్ఞానం గ్రహాల మధ్య ఉండే దూరాన్ని '"కాంతి సంవత్సరం"లో లెక్కిస్తుంది. కాంతిసంవత్సరం అంటే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం. ఒక నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది అంటే దాని నుంచి మనకు ప్రసారమయ్యే కాంతి కనపడటానికి కొన్ని వందల, వేల కాంతి సంవత్సరాల కాలం పడుతుంది. అట్లాగే మన ప్రాచీన భారతీయులు కూడా సూర్యకాంతి ఆధారం చేసుకొని కాలగణన చేసి గ్రహ గతులను నిర్ణయించారు. అలాగే శుభ, అశుభ కాలాలను, ప్రకృతి వైపరీత్యాలను, గ్రహగతులతో అనుసంధానం చేసి మానవ జీవితాలపై అన్ని గ్రహాల ప్రభావాన్ని కనుగొన్నారు. అదే నేడు "జ్యోతిష్య శాస్త్రం"గా ప్రసిద్ధి చెందింది. వరాహమిహురుడు తన జ్యోతిష్యశాస్త్ర గ్రంథమైన "బృహత్ జాతక"లో మొదటి శ్లోకంలో "జ్యోతిష్యశాస్త్రం" సంసారమనే సముద్ర యానాన్ని దాటేందుకు "దిక్సూచి" వంటిది అని అంటాడు. దీనిని బట్టి జ్యోతిష్యశాస్త్రం కాలాన్ని తెలియజేసే మార్గదర్శి అని మనకు అర్థమవుతున్నది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులలో సంచరిస్తున్నపుడు మనిషిపై వాటి యొక్క భావాన్ని వివిధ కోణాల నుండి దర్శింపచేస్తుంది. మనిషి పుట్టిన స్థలాన్ని, కాలాన్ని అనుసరించి 'జన్మకుండలి'ని రచిస్తారు. ఆ జన్మ సమయంలో ఉండే గ్రహాల స్థితిగతుల ఆధారంగా మనిషి యొక్క జాతకాన్ని సూచిస్తారు. ఈ విజ్ఞానం అంతా కూడా ఎన్నో జ్యోతిష్య గ్రంథాలలో పొందపరచబడి ఉంది. ఇది ఒక మహాసముద్రం వంటిది. ఇందులో ప్రసిద్ధి గాంచినవి:
1. పరాశరుని - 'హోరశాస్త్రం'.
2. వరాహమిహురుని - 'బృహత్ జాతక'.
3. కళ్యాణ శర్మ - 'సారావళి'.
4. జైమినీ మహర్షి - 'జైమినీ సిద్ధాంతం'.
5. మంత్రేశ్వరుడు - 'జలదీపిక'.
6. భ్రుగు మహర్షి - 'భ్రుగు సంహిత'.
భారతీయ జ్యోతిష్య విజ్ఞానం ప్రతి శాస్త్రంలోనూ అనుసంధానింపబడి ఉంది. ఆయుర్వేదంలో కూడా 'రోగి' జన్మకుండలిని అనుసరించి వైద్యం చేసే విధానం ఉంది. గృహ నిర్మాణం, వ్యవసాయం, ప్రయాణం, యుద్ధాలు, వివాహాది సంస్కారాలలో, చివరకు దైనందిన కార్యక్రమాలలో తిథి, నక్షత్రం చూడకుండా పనులు ప్రారంభించనంతంగా ఈ శాస్త్రం భారత జనజీవనంలో మమేకమైనది. జ్యోతిష్యశాస్త్రం ఒట్టి బూటకమని, అది మనుషులను మోసం చేసే ప్రక్రియ అని, ఇది అసలు శాస్త్రం కాదనీ, కేవలం మూఢ నమ్మకం అనీ ఎందరో విమర్శకులు చెబుతున్నా ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్యశాస్త్రం ప్రాముఖ్యత తగ్గటం లేదు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా అన్ని రోగాలకు నివారణ ఇవ్వదు. ఒక వైద్యుడు రోగం నయం చేసినట్టు మరో వైద్యుడు నయం చేయలేడు. ఒక వైద్య విధానం చెప్పిన దానిని మరో వైద్య విధానం వ్యతిరేకిస్తుతింది. అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాముకాని నమ్మకం అనం. అలాగే జ్యోతిష్యం విజ్ఞానమా? నమ్మకమా? అన్నది వాళ్ళ విచక్షణకే వదిలివేద్దాం. దీనిని ఉపయోగించుకొని ముందుగా పోయే వారిని ఎవరూ నిరోధించలేరు.
నాడీ జ్యోస్యం:-
మనయొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే తాళపత్ర గ్రంథాలు భారతదేశంలో కొన్ని కుటుంబాల వద్ద ఉన్నాయి. ఆ కుటుంబాలు వాటిని వంశ పరంపరగా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. "శివపార్వతుల" సంభాషణగా, సిద్ధులందించిన ఈ విజ్ఞాన నిధిని "నాడీ జ్యోతిష్యం" అంటారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని 'చిదంబరం' పట్టణానికి దగ్గర గల 'వైదీశ్వరన్ కోయిల్' అనే గ్రామంలో కొన్ని కుటుంబాల వద్ద ఈ తాళపత్రాలు ఉన్నాయి. ఈ తాళపత్రాలనే నాడీ పత్రాలు అంటారు. ఇప్పుడు మనకు లభిస్తున్న తాళపత్రాలు కొన్ని మాత్రమే. కనుక అందరి వృత్తాంతాలు ఈ నాడీ పత్రాలలో ఉండవు. కొన్ని తాళపత్ర గ్రంథాలను ఆనాటి తంజావూరు మహారాజు 'రెండవ షర్ఫోజి'వారు 'సరస్వతీ మహల్' గ్రంథాలయంలో ఉంచగా, వాటిని బ్రిటిషు వారు స్వాధీన పరుచుకొన్నట్టు తెలుస్తున్నది. బ్రిటిషు వారి నుంచి వాటిని సంపాదించి కొందరు విదేశీయులు వీటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ నాడీ 'జోస్య' విధానం మొదట వ్యక్తి తన చేతి బొటన వేలిముద్ర ఇవ్వాలి. దీని ఆధారంగా నిపుణులు తాళపత్ర గ్రంథాలను పరిశీలించి ఆ వ్యక్తి వివరాలను తెలియజేస్తారు, అవి సరిపోలితే తదుపరి పరిశీలన ప్రారంభిస్తారు. ఆ లభించిన వారికి తండ్రి పేరు, తల్లి పేరుతో సహా పుత్రుల, భార్య పేరు తెలియజేయటం కూడా అబ్బురపరచే విషయం. ఇందులో కూడా నేడు కొందరు నకిలీ నాడిజోస్యులు ప్రవేశించి శాస్త్రాన్ని వ్యాపారపరంగా వాడుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రక్రియను కనుగొన్న సిద్ధులను, పరంపరగా దీనిని కాపాడుకుంటున్న కుటుంబాలను మనం అభినందించాలి. మన కృతజ్ఞతలు తెలియజేయాలి.