సంస్కారము.
సంస్కారము దేని వలన అబ్బుతుంది? పూర్వ జన్మల వాసనలను బట్టి. పూర్వ జన్మల
వాసనలు బట్టి త్రిగుణాల సమ్మేళనం వుంటుంది. దాని నిష్పత్తి మారుతూ
వుంటుంది. మరి ఈ జన్మలో మంచి సంస్కారం అబ్బ లేదు. పోయిన జన్మలో మంచి కర్మ,
పుణ్య కార్యం చేయ లేదు. కావున ఈ జన్మలో మంచి బుద్ధి రాలేదు. మంచి రాత
రాలేదు. మంచి సంస్కారం లేదు కాబట్టి, ఈ జన్మలో కూడా మంచి పని చేయడానికి
బుద్ది రాదు, మనసు రాదు. కాబట్టి వచ్చే జన్మలో కూడా మంచి సంస్కారం రాదు.
ఇది ఇలాగే కొనసాగిపోతుంది.
మరి ఏలాగ? ఉద్ధతి ఏలాగ ఈ జీవికి? బాగు పడడానికి మార్గం లేదా?
వున్నది.
సత్ స్సాంగత్యం. మహా పురుషుల మాటలు బలవంతంగానైనా విని తీరాలి. ఏందుకంటే మన మనస్సు వినదు మంచి మాటలు. గురువులు చెప్పే ప్రవచనాలు వినదు! పైగా దేవుడు వున్నాడా? అని ప్రశ్నిస్తుంది? పైశాచిక సిద్దాంతాన్ని లేవదీస్తుంది, వితండ వాదం చేస్తుంది, అంతా చాదస్తం, మూఢ నమ్మకాలు అని మన చేత అనిపిస్తుంది. దేవున్ని, ధర్మాన్ని నమ్మదు. గురువుల మాట చెవి కేక్కించుకోదు. ఓక గుడికి పోదాము అని వుండదు. మంచి మాటలు తలకేక్కవు.
ఇక్కడే జాగ్రత్తగా వుండాలి. ఇక్కడే మనకు మన పురాణాలు, వేద వాంజ్ఞ్మయం అక్కరకు వస్తుంది. మన పెద్దలు, గురువులు ఆచరించి చేసి చూపించి వున్నారు. కళ్లు మూసుకొని గ్రుడ్డిగా వారి మార్గంలో బలవంతంగానైనా సరే మనసు మార్చుకొని నడవడమే. నీ తల్లి నీకు చెడు చెప్పదు. నీ తండ్రి నీకు అబధ్ధం చెప్పడు. నీ గురువులు నీకు అధర్మం భోధించరు. మరి నీకు ఏందుకు అప నమ్మకం. అనుసరించు భక్తి మార్గంలో పెద్దలు చెప్పినట్లు. సత్ స్సాంగత్యం ఏర్పర్చుకో. మహా పురుషులు పుట్టిన నేల ఇది. మహా వాక్యములు విను. ప్రవచనాలు విను. రామాయణ, మహాభారతాది గ్రంధములను చదువు. ఈ జన్మలో నీ బాట మార్చుకో. నీ మార్గం మార్చుకో. సన్మార్గంలో నడువు. వచ్చే జన్మకు నీ వాసనలు మార్చుకో. అంతే మంచి సంస్కారం, మంచి పుట్టుక, మంచి బుద్దులు, మంచి తల వ్రాత లభిస్తుంది. కావలసినది నిన్ను అరిచి తగవులాడి, నాలుగు తన్ని నీ మార్గాన్ని మార్చే గురువు కావాలి. నీ పాపాన్ని హరించి వేసే గురు దేవుళ్లు కావాలి అంతే. పరమ భాగవత్తోత్తములు పుట్టిన నేల. గొంతు చించుకొని కష్టపడి అరిచి, ప్రాణం అడ్డుగా పెట్టి ప్రవచించే పరమ గురువులు, ఆది గురువులు పుట్టిన నేల ఇది. చేయవలసినదంతా వారి అడుగు జాడలలో నడవడమే. నేను వినను అంటే ఏలాగ?
మరి నడుద్దామా! ..........
మరి ఏలాగ? ఉద్ధతి ఏలాగ ఈ జీవికి? బాగు పడడానికి మార్గం లేదా?
వున్నది.
సత్ స్సాంగత్యం. మహా పురుషుల మాటలు బలవంతంగానైనా విని తీరాలి. ఏందుకంటే మన మనస్సు వినదు మంచి మాటలు. గురువులు చెప్పే ప్రవచనాలు వినదు! పైగా దేవుడు వున్నాడా? అని ప్రశ్నిస్తుంది? పైశాచిక సిద్దాంతాన్ని లేవదీస్తుంది, వితండ వాదం చేస్తుంది, అంతా చాదస్తం, మూఢ నమ్మకాలు అని మన చేత అనిపిస్తుంది. దేవున్ని, ధర్మాన్ని నమ్మదు. గురువుల మాట చెవి కేక్కించుకోదు. ఓక గుడికి పోదాము అని వుండదు. మంచి మాటలు తలకేక్కవు.
ఇక్కడే జాగ్రత్తగా వుండాలి. ఇక్కడే మనకు మన పురాణాలు, వేద వాంజ్ఞ్మయం అక్కరకు వస్తుంది. మన పెద్దలు, గురువులు ఆచరించి చేసి చూపించి వున్నారు. కళ్లు మూసుకొని గ్రుడ్డిగా వారి మార్గంలో బలవంతంగానైనా సరే మనసు మార్చుకొని నడవడమే. నీ తల్లి నీకు చెడు చెప్పదు. నీ తండ్రి నీకు అబధ్ధం చెప్పడు. నీ గురువులు నీకు అధర్మం భోధించరు. మరి నీకు ఏందుకు అప నమ్మకం. అనుసరించు భక్తి మార్గంలో పెద్దలు చెప్పినట్లు. సత్ స్సాంగత్యం ఏర్పర్చుకో. మహా పురుషులు పుట్టిన నేల ఇది. మహా వాక్యములు విను. ప్రవచనాలు విను. రామాయణ, మహాభారతాది గ్రంధములను చదువు. ఈ జన్మలో నీ బాట మార్చుకో. నీ మార్గం మార్చుకో. సన్మార్గంలో నడువు. వచ్చే జన్మకు నీ వాసనలు మార్చుకో. అంతే మంచి సంస్కారం, మంచి పుట్టుక, మంచి బుద్దులు, మంచి తల వ్రాత లభిస్తుంది. కావలసినది నిన్ను అరిచి తగవులాడి, నాలుగు తన్ని నీ మార్గాన్ని మార్చే గురువు కావాలి. నీ పాపాన్ని హరించి వేసే గురు దేవుళ్లు కావాలి అంతే. పరమ భాగవత్తోత్తములు పుట్టిన నేల. గొంతు చించుకొని కష్టపడి అరిచి, ప్రాణం అడ్డుగా పెట్టి ప్రవచించే పరమ గురువులు, ఆది గురువులు పుట్టిన నేల ఇది. చేయవలసినదంతా వారి అడుగు జాడలలో నడవడమే. నేను వినను అంటే ఏలాగ?
మరి నడుద్దామా! ..........
No comments:
Post a Comment