మానవ జన్మని ఎట్లా వాడుకోవాలో తెలిపేదే రామావతారం !
మనిషి బుద్దిని సరిగ్గా వాడుకోవాలంటే కొన్ని స్థాయిలు ఉన్నాయి. మొదట శరీరాన్ని గుర్తించాలి. శరీరానికి తగినట్లు పనిచేయాలి. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరాన్ని పోషించుకోవాలి, దానికి తగినట్లు పనిచేయాలి, పనిచేయడానికి వీలయ్యేట్టు ఆలోచించాలి. ఇది ఒక మెట్టు. ఆలోచనలలో ఒక భాగం శరీరం కోసం వాడుకోవాలి, కానీ అక్కడికే సర్వస్వం కాదు, ఇక్కడితోనే ఆగిపోవడం కాదు, ఇది ఒక భాగమే. శ్రీకృష్ణుడు 6వ ఆధ్యాయంలో "యుక్త ఆహార యుక్త విహార యుక్త చేష్టశ్చ్య కర్మసు యుక్త స్వప్న యుక్త అవబోధ", ఇవన్నీ యుక్తంగా ఉండాలి, మానేయాల్సిన అవసరం లేదు. ఆహారం ఏవి ఎంతవరకు అవసరమో తెలుసుకొని తిని. హాయిగా తిరుగు, కానీ ఎవరెవరో తెలుసుకొని తిరుగు. ఏఏపనులు తగివవో ఏవి తగనినో తెలుసుకొని చెయ్యి. ఎంత అవసరమో అంత నిద్ర,ఎంత మెలుకువగా ఉండాలో అంత తప్పవు. శరీరానికి ఒక క్రమం ఉంది, ఆక్రమాన్ని గుర్తించి దాన్ని గౌరవించి జీవిస్తే అప్పుడు శరీర పోషణ తప్పుకాదు.
రెండో భాగం, ఈ లోకంలోకి తెచ్చే వ్యవస్థ ప్రకృతి, ఇది మనకు తల్లిగా, తండ్రిని ఇచ్చింది. వారికి వారి తల్లి తండ్రులు, మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందులో ఒకనిగా మనం వచ్చాం. మనంతట మనం స్వతంత్రంగా రాలేదు. శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఎంత భాగం ఆలోచిస్తున్నామో, అంత మన కుటుంబ విషయంలో కూడా ఆలోచించాలి. శరీరాన్ని కొంతకు మించి వాడుకోలేము. అట్లానే మనం జన్మించిన కుటుంబం యొక్క నియమాన్ని పాటిస్తూ, అందరిని గౌరవించి బ్రతకాలి. అందులో తల్లి తండ్రులు ఉండొచ్చు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఉండొచ్చు. హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి. జంతువులు వాటి హద్దులు తెలిసి ప్రవర్తిస్తాయి. తమ పిల్లలను ఎంత వరకు అవసరమో అంతవరకు పెంచుతాయి. మనుషులం కనక ఎంతవరకు చేయాలో చేసి, ఆపై పిల్లలు అడిగితే సలహా ఇవ్వడానికి ఉండాలి తప్ప అన్నింటిని తమపై పూసుకోకూడదు. "వార్ధకే ముని వృత్తినాం" ఒక కాలంలో వృద్దాప్యం వచ్చాక బాధ్యతలు అప్పగించి ప్రశాంతంగా భగవంతుని గురించి ఆలోచించుకొనే వారు. సలహాలు మాత్రం ఇచ్చేవారు. పిల్లలు పాటిస్తున్నారా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. చెప్పడం వరకు పెద్దల బాధ్యత. మాట వినక నష్టపోతుంటే పట్టించుకోనవసరం లేదు. హద్దులు ఉంటాయి అని గుర్తించాలి. అట్లా ఒక భాగం కుటుంబం కోసం ఆలోచించాలి, ఆ ఆలోచనని ఆచరణలోకి తేవాలి. ఇది రెండవ మెట్టు.
మన కుటుంబం చుట్టూ సమాజం ఉంది, కొన్ని కోట్ల సంస్కారాలు కలిగిన సమాజం ఉంది. దాన్ని గుర్తించి, దాన్ని ఇబ్బంది కలిగించకుండా, దానికి తగినట్లుగా మనం బ్రతకాలి. ఇది మూడో భాగం. శరీరం, కుటుంబం ఎంత వాస్తవమో సమాజం కూడా అంతే వాస్తవం, దాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇది మూడో మెట్టు.
సమాజంతో పాటు, రకరకాల ప్రాణికోటి జీవిస్తుంది, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. శాస్త్రం కూడా అదే చెబుతుంది. ప్రతి వస్తువు కూడా మన యొక్క ఉనికికి ఆధారమే. కొన్ని జీవుల ద్వారా మనం ఎక్కువ లాభం పొందవచ్చు, కొన్ని ఉపయోగపడక పోవచ్చు. కానీ వాటి కంటూ ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది, ఈ విశ్వంలోని ప్రతి వస్తువుకి మరొక వస్తువుకి పరస్పర సంబంధం ఉంటుంది. ప్రపంచంలో ఏమూల ఒక గడ్డిపోచ కదిలినా అది ప్రపంచం అంతటిమీదా ప్రభావం ఉంటుంది. ఎంత ఎలా అనేది మనం గుర్తించలేనంతగా ఉంటుందేమో కాని తప్పక ఒక ప్రభావం ఉంటుంది. మన శరీరంలో ఒక భాగంలో నొప్పి అయితే మరొక భాగం ఎందుకు స్పందిస్తుంది. ఈ ప్రపంచంలోని ధూలికణం కదిలినా, గాలి తరంగం వీచినా, చిన్న నీటి బొట్టు కదిలినా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుకీ స్పందన ఉంటుంది. అట్లా ప్రపంచంలో ఉండే ప్రతి జీవితో మనకు సంబంధం ఉంటుంది. కదిలే జంతువులే కాదు, కదలని చెట్లు, రాల్లు, గాలి అన్నింటితో సంబంధం ఉంటుంది. మన బుద్దిలో ఒక భాగం వాటికి కూడా కెటాయించాలి. మన చుట్టూ ఉండే ప్రాణికోటితో సహా ప్రకృతిలోని నీటితో, నేలతో, గాలితో అట్లానే ప్రవర్తించాలి. అందుకే వేదమంత్రాలలో "ఓం ద్యౌ శాంతిః అంతరిక్షగుం శాంతిః పృథివీ శాంతిః " ఆకాశానికి శాంతి కలుగుగాక, భూమికి శాంతి కలుగుగాక, అంతరిక్షానికి శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. ఇదంతా ఏమిటో చాదస్తం అని కొందరి అభిప్రాయం. అది ఎవడెవడికి వాడిదాకా వచ్చినప్పుడు అర్థం అవుతుంది. శరీరం పంచభూతాల కలయిక. ఒక్కో సారి ఒకటి ఎక్కువ, తక్కువ లైతే ఏమవుతుందో మనకు తెలుసు. ఆకాశం తక్కువైటే అంటే ఖాలి తక్కువ అయితే భుక్తాయసం. నీటి శాతం పెరిగితే శరీరం వాచి కష్టమే. ఒక్కో సారి వేడి శాంతం పెరిగి నీరు తగ్గుతుంది, అప్పుడు శరీరంలో నీటిని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రకృతిలో కూడా అంతే కదా. అది గుర్తించగలిగేవాడు మానవుడు. మన శరీరంలో మట్టి భాగం కానీ, నీటిభాగం కానీ, గాలి భాగం గానీ, అగ్ని భాగం గానీ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు మనకు. ఎది ఎక్కువైనా, ఏది తక్కువైనా ఇబ్బందే. అట్లానే ప్రకృతిలో ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇది నాలుగో స్థాయి.
ఈ శరీరాన్ని మనకిచ్చి, వెనకాతల ఉండి నడిపే తత్వం బ్రహ్మ తత్వం. దైవం అంటాం. పరమాత్మ అంటాం. అక్కడి దాకా గుర్తించి, మనకు దైవానికి ఉన్న సంబంధం గుర్తించి మన బుద్దిలో ఒక భాగాన్ని కెటాయించ గలిగితే అది ఐదవ భాగం. ఇది ఐదో మెట్టు.
ఈ ఐదింటికి మన బుద్దిలో ఒక్కో భాగం ఇచ్చి ఆలోచించగలగాలి, దాన్ని కార్య రూపం చేయాలి. ఒకదానితో ఒకటి పరస్పర భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగినటువంటివి, ఏదో ఒకదానికే మనం పూర్తిగా కెటాయిస్తే, అది సరికాదు. ఇవన్నింటిని ఆలోచించి బ్రతక గలిగితే మనిషి అంటారు. ఇది మానవ జన్మకు ఉన్న గొప్పతనం. అది గ్రహించి బ్రతికితే వేరే యోగాలు, యాగాలు చేయనవసరం లేదు, ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలోకి రానవసరం లేదు. అది మోక్షం అంటే. శరీరం పోతే మరోక శరీరం వస్తుంది, మనం అది కోరటంలేదు, ఈ కర్మ బంధం తొలగాలి అని కోరుకుంటుంన్నాం. ఆట్లా తొలగించుకొనే అవకాశం మానవ జన్మకు మాత్రమే ఉంది. జీవితాన్ని ఎలా వాడుకోవాలో, మన చుట్టు ఉండే వారి ప్రేమను ఎట్లా పొందగల్గుతామో, అట్లే వారిని ఆనందంగా ఉంచగలమో ఒకరు ఆచరించి చూపితే మనం కొంతనైనా సాధించగలం. ఇవన్నీ ఆచరించి చూపాడు శ్రీరామచంద్రుడు ఒక మానవుడిగా, ఆయన ఎలా ఆచరించాడు, ఎందుకు ఆచరించాడు, ఏమి ఆచరించడం తెలుసుకోవడం విలువలకి తిలోదకాలు ఇచ్చే ఈనాటి మన వంటి వారికి చాలా అవసరం.
మనిషి బుద్దిని సరిగ్గా వాడుకోవాలంటే కొన్ని స్థాయిలు ఉన్నాయి. మొదట శరీరాన్ని గుర్తించాలి. శరీరానికి తగినట్లు పనిచేయాలి. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరాన్ని పోషించుకోవాలి, దానికి తగినట్లు పనిచేయాలి, పనిచేయడానికి వీలయ్యేట్టు ఆలోచించాలి. ఇది ఒక మెట్టు. ఆలోచనలలో ఒక భాగం శరీరం కోసం వాడుకోవాలి, కానీ అక్కడికే సర్వస్వం కాదు, ఇక్కడితోనే ఆగిపోవడం కాదు, ఇది ఒక భాగమే. శ్రీకృష్ణుడు 6వ ఆధ్యాయంలో "యుక్త ఆహార యుక్త విహార యుక్త చేష్టశ్చ్య కర్మసు యుక్త స్వప్న యుక్త అవబోధ", ఇవన్నీ యుక్తంగా ఉండాలి, మానేయాల్సిన అవసరం లేదు. ఆహారం ఏవి ఎంతవరకు అవసరమో తెలుసుకొని తిని. హాయిగా తిరుగు, కానీ ఎవరెవరో తెలుసుకొని తిరుగు. ఏఏపనులు తగివవో ఏవి తగనినో తెలుసుకొని చెయ్యి. ఎంత అవసరమో అంత నిద్ర,ఎంత మెలుకువగా ఉండాలో అంత తప్పవు. శరీరానికి ఒక క్రమం ఉంది, ఆక్రమాన్ని గుర్తించి దాన్ని గౌరవించి జీవిస్తే అప్పుడు శరీర పోషణ తప్పుకాదు.
రెండో భాగం, ఈ లోకంలోకి తెచ్చే వ్యవస్థ ప్రకృతి, ఇది మనకు తల్లిగా, తండ్రిని ఇచ్చింది. వారికి వారి తల్లి తండ్రులు, మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందులో ఒకనిగా మనం వచ్చాం. మనంతట మనం స్వతంత్రంగా రాలేదు. శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఎంత భాగం ఆలోచిస్తున్నామో, అంత మన కుటుంబ విషయంలో కూడా ఆలోచించాలి. శరీరాన్ని కొంతకు మించి వాడుకోలేము. అట్లానే మనం జన్మించిన కుటుంబం యొక్క నియమాన్ని పాటిస్తూ, అందరిని గౌరవించి బ్రతకాలి. అందులో తల్లి తండ్రులు ఉండొచ్చు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఉండొచ్చు. హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి. జంతువులు వాటి హద్దులు తెలిసి ప్రవర్తిస్తాయి. తమ పిల్లలను ఎంత వరకు అవసరమో అంతవరకు పెంచుతాయి. మనుషులం కనక ఎంతవరకు చేయాలో చేసి, ఆపై పిల్లలు అడిగితే సలహా ఇవ్వడానికి ఉండాలి తప్ప అన్నింటిని తమపై పూసుకోకూడదు. "వార్ధకే ముని వృత్తినాం" ఒక కాలంలో వృద్దాప్యం వచ్చాక బాధ్యతలు అప్పగించి ప్రశాంతంగా భగవంతుని గురించి ఆలోచించుకొనే వారు. సలహాలు మాత్రం ఇచ్చేవారు. పిల్లలు పాటిస్తున్నారా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. చెప్పడం వరకు పెద్దల బాధ్యత. మాట వినక నష్టపోతుంటే పట్టించుకోనవసరం లేదు. హద్దులు ఉంటాయి అని గుర్తించాలి. అట్లా ఒక భాగం కుటుంబం కోసం ఆలోచించాలి, ఆ ఆలోచనని ఆచరణలోకి తేవాలి. ఇది రెండవ మెట్టు.
మన కుటుంబం చుట్టూ సమాజం ఉంది, కొన్ని కోట్ల సంస్కారాలు కలిగిన సమాజం ఉంది. దాన్ని గుర్తించి, దాన్ని ఇబ్బంది కలిగించకుండా, దానికి తగినట్లుగా మనం బ్రతకాలి. ఇది మూడో భాగం. శరీరం, కుటుంబం ఎంత వాస్తవమో సమాజం కూడా అంతే వాస్తవం, దాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇది మూడో మెట్టు.
సమాజంతో పాటు, రకరకాల ప్రాణికోటి జీవిస్తుంది, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. శాస్త్రం కూడా అదే చెబుతుంది. ప్రతి వస్తువు కూడా మన యొక్క ఉనికికి ఆధారమే. కొన్ని జీవుల ద్వారా మనం ఎక్కువ లాభం పొందవచ్చు, కొన్ని ఉపయోగపడక పోవచ్చు. కానీ వాటి కంటూ ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది, ఈ విశ్వంలోని ప్రతి వస్తువుకి మరొక వస్తువుకి పరస్పర సంబంధం ఉంటుంది. ప్రపంచంలో ఏమూల ఒక గడ్డిపోచ కదిలినా అది ప్రపంచం అంతటిమీదా ప్రభావం ఉంటుంది. ఎంత ఎలా అనేది మనం గుర్తించలేనంతగా ఉంటుందేమో కాని తప్పక ఒక ప్రభావం ఉంటుంది. మన శరీరంలో ఒక భాగంలో నొప్పి అయితే మరొక భాగం ఎందుకు స్పందిస్తుంది. ఈ ప్రపంచంలోని ధూలికణం కదిలినా, గాలి తరంగం వీచినా, చిన్న నీటి బొట్టు కదిలినా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుకీ స్పందన ఉంటుంది. అట్లా ప్రపంచంలో ఉండే ప్రతి జీవితో మనకు సంబంధం ఉంటుంది. కదిలే జంతువులే కాదు, కదలని చెట్లు, రాల్లు, గాలి అన్నింటితో సంబంధం ఉంటుంది. మన బుద్దిలో ఒక భాగం వాటికి కూడా కెటాయించాలి. మన చుట్టూ ఉండే ప్రాణికోటితో సహా ప్రకృతిలోని నీటితో, నేలతో, గాలితో అట్లానే ప్రవర్తించాలి. అందుకే వేదమంత్రాలలో "ఓం ద్యౌ శాంతిః అంతరిక్షగుం శాంతిః పృథివీ శాంతిః " ఆకాశానికి శాంతి కలుగుగాక, భూమికి శాంతి కలుగుగాక, అంతరిక్షానికి శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. ఇదంతా ఏమిటో చాదస్తం అని కొందరి అభిప్రాయం. అది ఎవడెవడికి వాడిదాకా వచ్చినప్పుడు అర్థం అవుతుంది. శరీరం పంచభూతాల కలయిక. ఒక్కో సారి ఒకటి ఎక్కువ, తక్కువ లైతే ఏమవుతుందో మనకు తెలుసు. ఆకాశం తక్కువైటే అంటే ఖాలి తక్కువ అయితే భుక్తాయసం. నీటి శాతం పెరిగితే శరీరం వాచి కష్టమే. ఒక్కో సారి వేడి శాంతం పెరిగి నీరు తగ్గుతుంది, అప్పుడు శరీరంలో నీటిని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రకృతిలో కూడా అంతే కదా. అది గుర్తించగలిగేవాడు మానవుడు. మన శరీరంలో మట్టి భాగం కానీ, నీటిభాగం కానీ, గాలి భాగం గానీ, అగ్ని భాగం గానీ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు మనకు. ఎది ఎక్కువైనా, ఏది తక్కువైనా ఇబ్బందే. అట్లానే ప్రకృతిలో ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇది నాలుగో స్థాయి.
ఈ శరీరాన్ని మనకిచ్చి, వెనకాతల ఉండి నడిపే తత్వం బ్రహ్మ తత్వం. దైవం అంటాం. పరమాత్మ అంటాం. అక్కడి దాకా గుర్తించి, మనకు దైవానికి ఉన్న సంబంధం గుర్తించి మన బుద్దిలో ఒక భాగాన్ని కెటాయించ గలిగితే అది ఐదవ భాగం. ఇది ఐదో మెట్టు.
ఈ ఐదింటికి మన బుద్దిలో ఒక్కో భాగం ఇచ్చి ఆలోచించగలగాలి, దాన్ని కార్య రూపం చేయాలి. ఒకదానితో ఒకటి పరస్పర భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగినటువంటివి, ఏదో ఒకదానికే మనం పూర్తిగా కెటాయిస్తే, అది సరికాదు. ఇవన్నింటిని ఆలోచించి బ్రతక గలిగితే మనిషి అంటారు. ఇది మానవ జన్మకు ఉన్న గొప్పతనం. అది గ్రహించి బ్రతికితే వేరే యోగాలు, యాగాలు చేయనవసరం లేదు, ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలోకి రానవసరం లేదు. అది మోక్షం అంటే. శరీరం పోతే మరోక శరీరం వస్తుంది, మనం అది కోరటంలేదు, ఈ కర్మ బంధం తొలగాలి అని కోరుకుంటుంన్నాం. ఆట్లా తొలగించుకొనే అవకాశం మానవ జన్మకు మాత్రమే ఉంది. జీవితాన్ని ఎలా వాడుకోవాలో, మన చుట్టు ఉండే వారి ప్రేమను ఎట్లా పొందగల్గుతామో, అట్లే వారిని ఆనందంగా ఉంచగలమో ఒకరు ఆచరించి చూపితే మనం కొంతనైనా సాధించగలం. ఇవన్నీ ఆచరించి చూపాడు శ్రీరామచంద్రుడు ఒక మానవుడిగా, ఆయన ఎలా ఆచరించాడు, ఎందుకు ఆచరించాడు, ఏమి ఆచరించడం తెలుసుకోవడం విలువలకి తిలోదకాలు ఇచ్చే ఈనాటి మన వంటి వారికి చాలా అవసరం.
No comments:
Post a Comment