Tuesday, March 17, 2015

మన పురాణాలు - శాస్త్రీయత

మన పురాణాలు ఎంతో శాస్త్రీయమైనవి. ప్రాచీన ఋషులు గొప్ప వైజ్ఞానికులు.. ఈమాటంటే , నమ్మని వారు , అదెలా ? అని అడగొచ్చు కానీ , వారికి తెలిసిందీ , వారు విన్నదీ , వారికి నచ్చిందీ తప్ప మిగిలినవన్నీ చెత్త అని పరిహాసము చేయుట , " వారు నేర్చినది వారికేమి నేర్పినదో " తెలుపుతుంది, అంతే..
ఉదాహరణకు , మనస్సును గురించి పురాణాలలో అనేకచోట్ల ఎలా వర్ణించారో చూడండి,
" మనస్సు కు అధిదేవత చంద్రుడు. మనస్సును ప్రేరేపించునవి మోదుగ వంటి సమిధల హవనపు ధూమము. "
నవగ్రహమంత్రాలలో చంద్రునికి సంబంధించిన మంత్రము , " ఆప్యాయస్వ సమేతుతే... " అనేది. అంతే కాదు , పంచామృతాలలో పాలతో అభిషేకం చేసేటప్పుడు చెప్పే మంత్రము కూడా అదే !! అంటే , చంద్రునికీ , పాలకూ ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.. మరి చంద్రుడు పుట్టింది పాల సముద్రములోనే కదా ?
పద్మ పురాణములో , " శివుడు మనో నియామకుడు " అనీ , " విష్ణువుపై మనస్సును నిలుపునట్లు చేసేవాడు శివుడు " అనీ ఉంది.
మన మనస్సు మన ఆధీనములో ఉండదు. దాని ఇఛ్చవచ్చినట్టు పరుగెడుతుంది. శివుడు మనో నియామకుడైనప్పుడు , మనసు శివుని నియంత్రణలో ఉంటుందే కానీ మన ఆధీనములో ఎందుకుంటుంది?, అందుకే , మనకు చిత్తశుద్ధి, మంచి బుద్ధీ కలగాలంటే ఆ శివుడినే వేడుకోవాలి. శివుడికి క్షీరాలాభిషేకం చేసేది అందుకే..
మనస్సును , దాని అధిదేవతనూ , మనో నియామకుడినీ , మనసును ప్రభావితం చేసే పదార్థములనూ ఇంతగొప్పగా అనుసంధానము చేసి చెప్పే పు

No comments:

Post a Comment