మీ పిల్లలకు ఇవి పనికి వస్తాయేమో చూడండి. మూలము
చదువులో వేగం పెరగాలంటే మన కన్ను చూడవలసింది ఒకసారి ఒక పదాన్ని కాదు; కనీసం రెండు మూడు పదాలను. అలా చేస్తే నిమిషంలో 240-360 పదాలను పూర్తిచేయవచ్చు. ఉత్తమ విద్యార్థి నిమిషానికి 600-840 మాటలను అవలీలగా పూర్తిచేస్తాడు. అతని కన్ను 5 నుంచి 7 పదాలను క్లిక్మన్పిస్తుంది. అంటే సగటు విద్యార్థి కంటే ఉత్తమ విద్యార్థి మూడు రెట్లు వేగంగా చదువుతాడు.
చాలామంది చదువుతూ తిరిగి వెనక్కివచ్చి చదివిందే చదువుతూ ఉంటారు. ఒక పేజీ పూర్తయ్యేసరికి ఇలా దాదాపు నలబైసార్లు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ అలవాటు మన విలువైన కాలాన్ని హరించివేస్తుంది.
చూపు పుస్తకంపైన, చిత్తం...
ఒక విషయం అర్థం కావాలంటే దానిపై ధ్యాస పెట్టాలి. ధ్యాస నిలవాలంటే వేగం కావాలి. మెల్లగా చదివితే ధ్యాస నిలవదా అని సందేహం రావొచ్చు.
విద్యానిపుణుల పరిశోధనల ప్రకారం మెల్లగా చదివేవారి దృష్టి పక్కదారులు (divert)పడుతుంది. వేరే సంగతుల మీదికి షికార్లు పోతుంది. 'చూపు శివుడి మీద, చిత్తం చెప్పుల మీద' అన్నట్టు- చూపు పుస్తకంపైన, చిత్తం మాత్రం చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటుంది. మనసు నిలకడగా ఒకచోట ఉండాలంటే వేగంగా చదివే అలవాటు నేర్చుకోవాలి.
గంటకు 10 కి.మీ. వేగంతో కారు నడిపే వాడికీ, గంటకు వంద మైళ్ళ వేగంతో కారు
నడిపే వాడికీ తేడా ఏమిటి? 10 కి.మీ. వేగం నిజానికి వేగమే కాదు. ఆ మాత్రం
వేగానికి రోడ్డు మీద ధ్యాస నిలవదు. చూపు చుట్టుపక్కల పెత్తనానికి పోతుంది.
అందే వంద కిలోమీటర్ల వేగంతో వెళితే దారిమీద తప్ప వేరే దానిమీద ధ్యాసకు
అవకాశమే ఉండదు. కాబట్టి వేగంగా చదివితే గానీ ధ్యాస కుదరదు. పైగా మన కన్ను,
మనసు కూడా నిమిషానికి 20,000 మాటలకు పైగా చదివి, అర్థాన్ని గ్రహించగలిగే
శక్తిమంతమైన సాధనాలు. 'పాల్ స్కీల్' ఫొటో రీడింగ్ పద్ధతి ద్వారా
నిమిషానికి 25,000 మాటలు అర్థం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు.
అయితే... సగటు విద్యార్థి నిమిషానికి 200 మాటలే చదువుతాడు. అంటే తన శక్తిలో ఒక శాతం మాత్రమే వినియోగించుకుంటూ మిగతా 99 శాతాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. దీన్ని మరోలా చెప్పాలంటే గంటకు 200 కి.మీ. వెళ్ళగల కారును గంటకు 2 కి.మీ. మందగమనానికే వినియోగించడం లాంటిది. దీనివల్ల ధ్యాస కుదరదు; ఆ చదివింది కూడా అర్థం కాదు.
వేగంగా చదవడం వల్ల విషయంపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం వల్ల విషయం లోతుగా అర్థమవుతుంది. అర్థమైన విషయమే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి అర్థం చేసుకోవడం, ఏకాగ్రత, వేగంగా చదవడం పరస్పర ఆధారితాలు. ఇవి పవర్రీడింగ్కు ప్రాణాధారమైన అంశాలు.
అయితే... సగటు విద్యార్థి నిమిషానికి 200 మాటలే చదువుతాడు. అంటే తన శక్తిలో ఒక శాతం మాత్రమే వినియోగించుకుంటూ మిగతా 99 శాతాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. దీన్ని మరోలా చెప్పాలంటే గంటకు 200 కి.మీ. వెళ్ళగల కారును గంటకు 2 కి.మీ. మందగమనానికే వినియోగించడం లాంటిది. దీనివల్ల ధ్యాస కుదరదు; ఆ చదివింది కూడా అర్థం కాదు.
వేగంగా చదవడం వల్ల విషయంపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం వల్ల విషయం లోతుగా అర్థమవుతుంది. అర్థమైన విషయమే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి అర్థం చేసుకోవడం, ఏకాగ్రత, వేగంగా చదవడం పరస్పర ఆధారితాలు. ఇవి పవర్రీడింగ్కు ప్రాణాధారమైన అంశాలు.
No comments:
Post a Comment