సులభమైన కొన్ని ఆయుర్వేద పద్దతులు
ఆయుర్వేదమే ఒక సముద్రము వంటిది. అందులోని అన్ని విషయాలనూ తెలుసుకోవడం అంత సులభమూ కాదు , అంత అవసరమూ కాదు. తెలుసుకున్నా , అన్నిటినీ ఆచరణలో పెట్టలేము కూడా !
కాబట్టి, ఈ కాలానికి తగినట్టు , మనము తరచుగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోడానికి అతి ముఖ్యమైన కొన్ని మార్గాలను చూద్దాం. ఈ మార్గాలు ఏదో ఉబుసుపోకకి రాసినవి, పేజీలు నింపడానికి రాసినవీ కాదు. ఎన్నో లక్షలమంది వీటిని అనుసరించి చాలా ఉపశమనమూ , ఫలితమూ పొందారు. నూటికి రెండు వందల పాళ్ళూ ఇవి పనిచేస్తాయి. ఇందులో చెప్పిన పదార్థాలు, మంచి నాణ్యత గలవీ , శుభ్రమైనవీ మాత్రమే వాడండి.
గుండెకి ఆరోగ్యం
గుండెరోగాలకి అనేక మానసిక కారణాలున్నా , కొన్ని ఆహారపుటలవాట్లు కూడా కారణలే.
ఎప్పుడూ అతి వేడి, అతి చల్లటి , అతి పుల్లటి , వగరు , చేదు పదార్థాలు తినేవారికి కూడా గుండె రోగాలు వస్తాయి.
౧. అజీర్తి వల్ల వాయువు ఏర్పడి , గుండె నొప్పి వస్తుంది. అతిగా అజీర్తి అయితే , నీటి లో ఉప్పు కలిపి , కొద్ది కొద్దిగా తాగి , వేలితో నోటిలో గొంతు దగ్గర శుభ్రం చేస్తే, వాంతి అయి , వ్యర్థాలు బయటికి పోతాయి. వాయువు తగ్గిపోతుంది.
౨. ఒక శుభ్రమైన బట్టలో ఎర్రమట్టి ముద్దగా చేసి , ప్యాక్ చేసి,పొట్టపై ఉంచుకుంటే అతి వేడి తగ్గి, గుండె బాగుపడును.
౩. గుండె నొప్పి నివారణకి భోజన నియమాలు :
కింద కూర్చొని భోజనం చేయడం మంచిది.
అతి వేడిగానూ, అతి చల్లగానూ, ఫ్రిజ్ లో నిలవచేసిన అన్నాన్ని తినవద్దు.
కొత్త బియ్యం వద్దే వద్దు.
కొత్త చింతపండు మంచిది కాదు , నల్లటి పాత చింత పండు మంచిది. అలాగే, పాత నెయ్యి , పాత బెల్లము మంచివి. చింతపండు అతిగా వాడవద్దు. చింతపండు బదులు ఎండించిన మామిడి కాయ పొడి వాడండి.
ఉప్పు కు బదులు సైంధవ లవణం వాడండి.
కాకరకాయలో తప్పనిసరిగా కొంచం బెల్లం కలిపి వాడండి.
ముఖ్యమైన చిట్కాలు :
చిరి శెనగలు ( గ్రీన్ గ్రామ్ ) వేయించి పెట్టుకుని , పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క గింజా తింటూ ఉండండి. గుండె జబ్బులు రావు.
పచ్చి శెనగలువేయించి , పిండికొట్టించి , దానికి ఉల్లిపాయ ముక్కలు ( ఎర్ర గడ్డ ) పెరుగూ కలిపి తింటే గుండె జబ్బులు రావు.
నిత్యనూతన యౌవనం కోసం
ఉసిరికాయల గింజలుతీసి ఎండించి పొడికొట్టీ 100 గ్రాములు తీసుకోవాలి.
నల్ల నువ్వులు ఒకచుక్క నూనెలో వేయించి పొడికొట్టి 100 గ్రాములు ,
గుంటకలగరాకు మొక్క సమూలంగా ఎండించి పొడికొట్టి 100 గ్రాములు ,
పల్లేరు మొక్క సమూలంగా ఎండించి పొడికొట్టి 100 గ్రాములూ,
పై నాలుగూ బాగా కలిపి , వస్త్ర ఘాళితం పట్టాలి. అంటే ఒక శుభ్రమైన తెల్లటి కాటన్ బట్టలో వేసి జల్లించితే నున్నటి ( Fine ) పొడి వస్తుంది. ఆ పొడికి 400 గ్రాములు పటిక బెల్లం ( కలకండ , లేక మిశ్రీ అంటారు ) , 100 గ్రాములు స్వచ్చమైన నెయ్యి, 200 గ్రాములు కల్తీ లేని తేనె కలిపి బాగా ముద్ద చేసి సీసాలో పెట్టుకోవాలి.
పరగడుపున పొద్దునా , రాత్రీ ఒక చెంచాడు తిని కప్పు పాలు తాగాలి.
నూరేళ్ళు నిత్య నూతన యౌవనంతో , మంచి కంటి చూపుతో , గట్టి దంతాలు , నల్లటి వెంట్రుకలతో , మేని నిగారింపుతో ఉంటారు.
బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువలు కాకుండా ఉండాలంటే రెగులర్ గా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి.
అప్పుడప్పుడు ఆవు పంచితం ( మూత్రం ) తాగితే గొప్ప మేలు చేస్తుంది. మనపూర్వీకులు చేసే పూజలలో ’ పంచ గవ్యం ’ తప్పనిసరిగా వాడేవారు. పంచ గవ్యం అంటే ఆవు పాలు , పెరుగు , నెయ్యి , మూత్రము , పేడ కలిపిన పదార్థము . ఆరోగ్య పరంగా ఇది ఎంతో మేలు చేస్తుంది.
అన్ని రకాల నొప్పులను హరించే " చరకాంజనము "
అన్ని రకాల తల నొప్పులు , వాతపు నొప్పులు , కీళ్ళ నొప్పులు , అడ తల నొప్పి , పార్శ్వపు నొప్పులు , బెణుకు నొప్పులు హరించే ఏకైక ఔషధం. మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు
కావలసినవి :
మొదట100 గ్రాముల నువ్వుల నూనె లో ఒక టీ స్పూనెడు టీ పొడి వేసి ఉడికించాలి. వడపోసి ఆ నూనెని తీసుకోవాలి.తర్వాత ,
50 గ్రాముల తేనె మైనము , 50 గ్రాముల ఆవు నెయ్యి , 50 గ్రాముల కొబ్బెరి నూనె , 25 గ్రాముల ’ హారతి కర్పూరం ’ ముక్కలు , 10 గ్రాముల ’ వాము పువ్వు , 10 గ్రాముల ’ పుదీనా ’ పువ్వు.
చివరివి రెండూ మూలికలు , గ్రంధులూ అమ్మే దుకాణం లో అడగండి.
పైన తీసుకున్న నువ్వులనూనెలో మిగిలినవన్నీ కలిపి, ఒక కల్వము లో వేసి, బాగా మెత్తగా , వెన్నపూస లాగా నూరాలి. ఈ మెత్తటి ముద్దని ఒక గాజు సీసాలో భద్ర పరచి, అవసరమైనపుడు నొప్పులున్న చోట కొద్దిగా రాసి మాసాజ్ ( మర్దన ) చేస్తే, క్షణాలలో ఉపశమనము కలుగును.
అతిగా పెరిగిన మాంసపు కండలు , కొవ్వు కరగటానికి
కొంతమందికి శరీరంలో ఎటుచూసినా ’ టైర్లు ’ లగా అధిక కొవ్వు పెరిగి చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. అంతే కాక, చర్మం బిరుసెక్కి , మచ్చలు మచ్చలు ఏర్పడి , చూసినవాళ్ళు దూరంగా పరిగెత్తేలా ఉంటారు.
వీరి అధిక కొవ్వు కరగి , చర్మము సౌకుమార్యంగా మార్చుకోవడము చాలా తేలిక.
కావలసినవి :
కరక్కాయ బెరడు , మామిడి చెట్టు బెరడు , దానిమ్మ పండు చెక్క ( తొక్క ) వేప చిగురాకులు , లొద్దుగ ( లోధ్ర ) బెరడు
పైవన్నీ సమాన తూకం లో తీసుకొని , ఆ మొత్తం బరువుకు సమానమైన బరువున్న నువ్వుల నూనె తీసుకొని అందులోకి పైవన్నీ కలిపి , సన్నటి మంటమీద మరగించి, కాస్త నల్లబడే వరకు కాచి , దింపి వడ కట్టాలి. ఆ నూనెని జాగ్రత్త పరచి , కావలసినప్పుడు కొవ్వు పెరిగిన భాగాల్లో ఆ నూనె రాసి , మర్దన చేస్తుంటే కొవ్వు కరగి పోతుంది. దళసరిగా మారిన చర్మం , నల్లని మచ్చలు ఏర్పడిన చర్మం కూడా కాంతివంతంగా మారి , నవనవలాడుతూ మెరుస్తుంది.
ఇంకో పద్దతి : కరక్కాయ పొడి , వేప ఆకులు , బిల్వ ( మారేడు ) ఆకులు , తులసి ఆకులు కలిపి నూరి, ఆ ముద్దని కొవ్వు పెరిగిన చోట పట్టించిఆరాక , స్నానం చేయాలి. కొవ్వు తగ్గి , దుర్వాసన కూడా మాయమగును.
మగగొంతు గల ఆడవారికి , ఆడగొంతుగల మగవారికి
కంఠస్వరము మృదువుగా , గాంభీర్యముగా కావాల్సిన మగవారికి , శ్రావ్యముగా కావాల్సిన ఆడవారికీ కూడా ఈ ఔషధము బాగా ఉపయోగపడును.
2 1/2 గ్రాముల వేయించిన శొంఠి పొడి , 5 గ్రాముల కలకండ పొడి , 10 గ్రాముల తేనె- ఈ మూడూ కలిపి రంగరించి రోజుకు రెండు పూటలు కొద్దికొద్దిగా చప్పరిస్తూ ఉంటే కంఠ స్వరము బాగగును.
బట్టతల పోయి వెంట్రుకలు రావడానికి :
ఉల్లిపాయ రసము , తేనె కలిపి బట్టతల వచ్చినచోట బాగారాసి , వేళ్ళతో బాగా మర్దన చేసి ఆరాక కడగాలి ఇలా చేస్తే నూనూగు వెంట్రుకలు వస్తాయి వాటిని కత్తరించి మళ్ళీ ఈ రసం రాసి మర్దన చేయాలి ఇలా రెందుమూడు సార్లు చేశాక ఒత్తుగా వెంట్రుకలు వస్తాయి.
నల్లజుత్తుకి
వెల్లుల్లి పొట్టు దండిగా తీసుకొని, దానిని బాణెలిపై వేసి సన్నటి మంటపై నిదానంగా వేయించాలి. వెల్లుల్లిపొట్టు నల్లగా మాడి భస్మము తయారవుతుంది. దానిని పిండి జల్లెడలో జల్లించి, ఆ భస్మాన్ని డబ్బాలో పోసుకోవాలి. తర్వాత 100 మి. లీ. ఆలివ్ ఆయిలు తీసుకుని , 1/2 స్పూను భస్మము కలిపి ముద్దచేసి ఒక వారము రోజులు కదలకుండా ఉంచాలి. తర్వాత దాన్ని రాత్రి తలకు పట్టించి , మెల్లగా మర్దించి, ఉదయాన్నే తల స్నానం చేయాలి.
తెల్ల వెంట్రుకలు నల్లబడి , తర్వాత నల్ల వెంట్రుకలే వస్తాయి.
తలనొప్పులకు
సబ్జా ఆకులు ( దీన్నే కమ్మ గొగ్గరి అంటారు ) ఒక గుప్పెడు సన్నగా తుంచి , 100 మి.లీ. నేతిలో అతి తక్కువ మంటలో వేయించి , వడగట్టి ఆ నేతిని భద్రపరచాలి. రోజూ భోజనానికి ముందు గోరువెచ్చటి ఈ నేతిని ముక్కులో మూడు చుక్కలు పోయాలి. రోజుకు మూడు పూటలా చేయవచ్చు. అన్ని తలనొప్పులూ మాయమవుతాయి.
కడుపులో క్యాన్సరు గడ్డలు , ఇతర గడ్డలు తగ్గుటకు ( కరగుటకు )
కలబంద పైచెక్కు తీసి పారేసి , మిగిలిన దాన్ని ముక్కలు కోసి పిండితే గుజ్జు లాంటి రసం వస్తుంది. దానికి మిరియాల పొడి , జీలకర్ర పొడి , స్వఛ్చమైన పసుపు పొడి కలిపి తాగాలి. ఎలాంటి గడ్డలైనా , దుర్మాంసాలైనా తగ్గును , కరగి పోవును. కడుపులో అల్సరు ఉన్నవారు మిరియాలు వదిలేసి , మిగిలినవి వాడాలి.
మంచి కంటి చూపు కు
10 గ్రా. కరక్కాయ బెరడు పొడి , 20 గ్రా. తానికాయ బెరడు పొడి ,20 గ్రా. ఎండిన ఉసరి పొడి , 5 గ్రా. వేయించిన పిప్పళ్ళు , 5 గ్రా. అతి మధురం ( యష్టి మధుకం ) 20 గ్రా పటిక బెల్లం
పైవన్నీ పొడి కొట్టి వస్త్ర ఘాళితం పట్టాలి. తర్వాత దానికి 20 గ్రా. తేనె , 35 గ్రా ఆవునెయ్యి, కలిపి ముద్ద చేసి నిలవ వుంచుకోవాలి.
దీన్ని రోజుకి 5 -- 10 గ్రాములు తినాలి. కంటి సమస్యలన్నీ పోయి చూపు మెరుగవుతుంది.
మూలము
Nice one.. anni powders chesukovadam kastam emo.. let me try.. some of these..
ReplyDelete