వ్యాధులకు గృహ చికిత్సా చిట్కాలు
1) ఆస్తమా నివారణకు ..... తోలు తీసిన బాదం పప్పు పొడి , విత్తనాలు తీసిన ఎండుఖర్జూరాలు , కిస్మిస్ , పటికబెల్లం , తేనే సమబాగాలుగా తీసుకొని అన్నింటిని కలిపి మెత్తగా గుజ్జులాగా దంచి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని 10 గ్రాముల చొప్పున రోజుకు మూడు పూటలా తీసుకుంటు వుంటే ఆస్తమా సమస్య తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది .
2) కాళ్ళు మడమల నొప్పికి .... శరీర బరువు పెరిగిపోవటం వల్ల ఆ బరువంతా కాలు మడమలపై పడటం వల్ల , రోజు గంటల తరబడి నిల్చొని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల మడమల్లో వాయువు ఉండి ఆబాగంలో గడ్డ కట్టి భరించలేని నొప్పిని కలిగిస్తుంది . ఈ నొప్పి నివారణకు తెల్ల జిల్లేడు చెట్టు పూలు మరియు కొద్దిగా పసుపు కలిపి మెత్తగా నూరి దాన్ని మడమపై పరచి దూది పెట్టి తెల్లటి బట్ట లేదా బ్యాండేజ్ క్లాత్ తో కట్టు కట్టి రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచాలి , వారం రోజులలో నొప్పి తగ్గుతుంది .
3) వయసు వచ్చాకా కూడా పిల్లలు మూత్రం పోసి పక్క తడుపుతుంటే ..... పిల్లలకు పసితనం నుండే చల్లని నీరు , చాకోలేట్స్ , కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అలవాటు చేయటం వల్ల శరీరంలో కఫం అవసరానికి మించి ఉత్పన్న మవుతుంది, క్రమంగా శరీరంలో జలధాతువు పెరిగిపోయి మూత్ర అవయవాలు బలహీనపడి తెలియకుండానే మూత్రం పోయవలసిన బలహీనత కలుగుతుంది. దీనిని నివారించేందుకు జిలకర 100 గ్రాములు దోరగా వేయించి దంచి పొడి చేసి బెల్లం 100 గ్రాములు కలిపి నున్నగా దంచుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రెండు పూటలా 5 గ్రాముల చొప్పున తినిపిస్తూ ఉంటే క్రమంగా పక్క తడపటం తగ్గిస్తారు.
4) పెద్దవారికి మధుమేహం వల్ల అతి మూత్రము నివారణకు .... నేరేడు గింజలను దంచి పొడి చేసుకొని నిల్వ ఉంచుకోవాలి , ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పొడి వేసి సగం గ్లాసు కషాయం అయ్యేటట్లు బాగా మరిగించి కొద్దిగా తాటిబెల్లం తగినన్ని వేడిపాలు కలుపుకొని రెండు పూటలా తాగుతుంటే కొద్ది రోజులలో అతిమూత్రం తగ్గడమే కాకుండా మధుమేహం కూడా అదుపులోకి వస్తుంది ( మీ రెగ్యులర్ మందులు తప్పక వాడాలి )
5) దీపావళి లో పటాకుల వల్ల కాని , వేడి నీరు - నూనె వల్ల మన శరీరంపై బొబ్బలు - మంటలు వస్తాయి . వీటి నివారణకు ...... మెంతులను,తులసి ఆకులను కలిపి మంచి నీటితో మెత్తగా గుజ్జు లాగా నూరి కాలిన చోట పట్టిస్తే మంట తగ్గి బొబ్బలెక్కకుండా ఉంటుంది , ఇలా రెండు పూటలా చేస్తూ ఉంటే కాలిన గాయాలు కూడా తగ్గుతాయి
1) ఆస్తమా నివారణకు ..... తోలు తీసిన బాదం పప్పు పొడి , విత్తనాలు తీసిన ఎండుఖర్జూరాలు , కిస్మిస్ , పటికబెల్లం , తేనే సమబాగాలుగా తీసుకొని అన్నింటిని కలిపి మెత్తగా గుజ్జులాగా దంచి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని 10 గ్రాముల చొప్పున రోజుకు మూడు పూటలా తీసుకుంటు వుంటే ఆస్తమా సమస్య తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది .
2) కాళ్ళు మడమల నొప్పికి .... శరీర బరువు పెరిగిపోవటం వల్ల ఆ బరువంతా కాలు మడమలపై పడటం వల్ల , రోజు గంటల తరబడి నిల్చొని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల మడమల్లో వాయువు ఉండి ఆబాగంలో గడ్డ కట్టి భరించలేని నొప్పిని కలిగిస్తుంది . ఈ నొప్పి నివారణకు తెల్ల జిల్లేడు చెట్టు పూలు మరియు కొద్దిగా పసుపు కలిపి మెత్తగా నూరి దాన్ని మడమపై పరచి దూది పెట్టి తెల్లటి బట్ట లేదా బ్యాండేజ్ క్లాత్ తో కట్టు కట్టి రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచాలి , వారం రోజులలో నొప్పి తగ్గుతుంది .
3) వయసు వచ్చాకా కూడా పిల్లలు మూత్రం పోసి పక్క తడుపుతుంటే ..... పిల్లలకు పసితనం నుండే చల్లని నీరు , చాకోలేట్స్ , కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అలవాటు చేయటం వల్ల శరీరంలో కఫం అవసరానికి మించి ఉత్పన్న మవుతుంది, క్రమంగా శరీరంలో జలధాతువు పెరిగిపోయి మూత్ర అవయవాలు బలహీనపడి తెలియకుండానే మూత్రం పోయవలసిన బలహీనత కలుగుతుంది. దీనిని నివారించేందుకు జిలకర 100 గ్రాములు దోరగా వేయించి దంచి పొడి చేసి బెల్లం 100 గ్రాములు కలిపి నున్నగా దంచుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రెండు పూటలా 5 గ్రాముల చొప్పున తినిపిస్తూ ఉంటే క్రమంగా పక్క తడపటం తగ్గిస్తారు.
4) పెద్దవారికి మధుమేహం వల్ల అతి మూత్రము నివారణకు .... నేరేడు గింజలను దంచి పొడి చేసుకొని నిల్వ ఉంచుకోవాలి , ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పొడి వేసి సగం గ్లాసు కషాయం అయ్యేటట్లు బాగా మరిగించి కొద్దిగా తాటిబెల్లం తగినన్ని వేడిపాలు కలుపుకొని రెండు పూటలా తాగుతుంటే కొద్ది రోజులలో అతిమూత్రం తగ్గడమే కాకుండా మధుమేహం కూడా అదుపులోకి వస్తుంది ( మీ రెగ్యులర్ మందులు తప్పక వాడాలి )
5) దీపావళి లో పటాకుల వల్ల కాని , వేడి నీరు - నూనె వల్ల మన శరీరంపై బొబ్బలు - మంటలు వస్తాయి . వీటి నివారణకు ...... మెంతులను,తులసి ఆకులను కలిపి మంచి నీటితో మెత్తగా గుజ్జు లాగా నూరి కాలిన చోట పట్టిస్తే మంట తగ్గి బొబ్బలెక్కకుండా ఉంటుంది , ఇలా రెండు పూటలా చేస్తూ ఉంటే కాలిన గాయాలు కూడా తగ్గుతాయి
No comments:
Post a Comment