Saturday, November 1, 2014

అరటి ఆకు

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. 
మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి 
తగిన కారణాలు చాలా ఉన్నాయి.శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి
అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, 
ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది.

అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి 
అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, 
మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.
వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర 
ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన
రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులో అన్ని రకములయిన
విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని
తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. 
ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా,
పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.
వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను. ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో.....
అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో
భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్నిహరిస్తుంది. అటువంటి పనిని చేసేది
కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. 
బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో! అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో
భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులోభోజనం చేయడం వలన కఠిన
హృదయులవుతారు. టేకు ఆకులోభోజనం చేయడం వలన భవిష్యత్త్,వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే
శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. 
ఇది నిజమో లేక కల్పనో తెలియదు కాని మన అరటి ఆకుని మించిన ఆకు లేదు....

Thursday, October 30, 2014

కర్ణుడు.

కర్ణుడు..

కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.
హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.
సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం
మూలము

Tuesday, August 5, 2014

గురివింద గింజ వాదనలు

గురివింద గింజ వాదనలు
ఇప్పుడే మిత్రులు శ్రీ దొడ్డా రాంబాబు గారు "భగవద్గీత " లోని అంశము ఒకటి ఉటంకింపు చేస్తూ, శ్రీ కృష్ణ పరమాత్మను అవహేళన చేస్తూ,అది కులగజ్జి బోధిస్తోంది అని, అది పాఠ్యంశముగా ఎలా చేస్తారని, హిందు వ్యతిరేక శక్తులు ప్రస్నిస్తున్నాయని, ఒక విషయము నా దృష్టికి తీసుకు వచ్చారు. గీతను సమగ్రంగా అర్ధం చేసుకోలేని వారు పేలే అవాకులకు చేవాకులకు భగవద్గీత చదువుకోమనే సమాధానం. అలా కాకుండా ఇంకా మతమౌడ్యముతోనే అంధకారంలో ఉంటే, వెలుగులోకి రమ్మని ఆహ్వానించండి. అయితే వారి ఇవి పరిశీలించి అవి పోగొట్టుకోనమని చెబుదాం.
మనం తరచుగా వింటుంటాం...హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్తవాలు చూడండి..మీకే అర్థం అవ్తుంది.
గమనిక: ఇది ఏ మతాన్ని కించపరుచుటకు కాదు. కేవలం హిందువుల ఐక్యతను తెలియజేయుటకు మాత్రమే !
క్రైస్తవం:
...
ఒక క్రీస్తు
ఒక బైబిలు
ఒక మతం
కాని ఇది తెలుసా?
లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.
ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.
ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.
ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !
=======================
ముస్లింలు:
ఒక అల్లహ్
ఒక ఖురాన్
ఒక ప్రవక్త
గొప్ప ఐక్యత...!
ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !
మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !
సున్నీ మసీదుకు షియా వెళ్ళడు.
ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.
ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు.
ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు.
ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.
=========================
హిందువులు:
1280 ధర్మ గ్రంథాలు,
10,000 భాష్యాలు,
ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,
ముక్కోటి దేవతలు,
భిన్నమైన ఆచార్యులు,
వేలాది ఋషులు,
వందలాది భాషలు.
కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.

Monday, August 4, 2014

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం - మార్కండేయ మహర్షి విరచితం

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ  స్తోత్రం - మార్కండేయ మహర్షి విరచితం

Paritala Gopi Krishna's photo.
































ఈ స్తోత్రంలో నాలుగు శ్లోకాలు 'నన్ను రక్షించుగాక' అనే అర్థం వచ్చేవి, చివరి శ్లోకం 'ఫలశ్రుతి' - మొత్తం ఐదు శ్లోకాలు.
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || --- 1
సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరో2(అ)వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః || --- 2
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదా2(అ)వతు |
దేవదేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః || --- 3
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు || --- 4
ఫలశ్రుతి
య ఏతద్ వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || -- 5
Paritala Gopi Krishna's photo.
































భావాలు:
1వ శ్లోకం
శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు. పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆస్వామి పేరును స్మరించుకుంటే) నాకు భద్రకవచమై రక్షించుగాక!
2వ శ్లోకం
వేయి తలలు - అంటే అనంతమైన శిరస్సులు గల పరమాత్ముడైన వేంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువు, అందరి ప్రాణాలకు నిలయుడు అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక!
3వ శ్లోకం
ఆకాశరాజు కూతురు పద్మావతికి భర్త అయిన వేంకటేశ్వరుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక!
4వ శ్లోకం
అలమేలు మంగమ్మ పాటి, అన్నింటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్నిచోట్లా, అన్నికాలాలలో నా సత్కర్మల నన్నింటినీ రక్షించి, వాటిని సఫలం చేయుగాక!
ఫలశ్రుతి భావం
ఈ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినము భక్తితో పఠించేవాళ్ళు మృత్యు భయం లేకుండా ఆనందంగా ఉంటారు.
లఘు వివరణ
కవచము అంటే శరీరాన్ని రక్షించే సాధనము. అది వజ్రంతో తయారయిందైతే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం భక్తుల పాలిటికి వజ్రకవచమై కాపాడుతుంది. శ్రీస్వామి వారిని శరణుపొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తీ-ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్లు అన్న ఆపదలనుండి శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు. మృత్యు భయం లేకుండా హాయిగా ఉంటారు. (మృత్యువుకంటే మృత్యు భయం గొప్పది).
(విద్వాన్ దా. పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, సప్తగిరి, ఆగష్టు 2014).

Thursday, July 31, 2014

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం
శ్రీకృష్ణభగవానుడు లోకంలో కెల్ల సుందరమూర్తి అని, మహాబల పరాక్రమశాలి అని, రాజనీతి నిపుణుడు అని, తత్త్వవేత్త అని చెప్పవచ్చు. కృష్ణునిపై ఉన్నంత సాహిత్యం ప్రపంచంలో ఏ భాషలోనూ లేదు. శ్రీకృష్ణుడు ప్రపంచానికి ప్రసాదించినది ''భగవద్గీత'' . శ్రీకృష్ణావతార దివ్య లీలామృతం తెలియని వారుండరు. పరమానందాహ్లాదభరిత దివ్య మహాత్యం తెలియని వారు అరుదు. కాని ఆ దివ్య పురుషుని పూర్వోత్తరాల వంశావళి గురించి చాలా మందికి తెలియదు. ఇతని భవ్య వంశ చరిత్ర గురించిన ప్రశంస, ప్రస్తావన భాగవత, భారత, హరివంశ, ఉత్తర హరివంశ, విష్ణుపురాణాది గ్రంథాలలోను వ్రతకాల్పదులలోను, దేవీ భాగవతం లోను కనబడుతుంది. శ్రీకృష్ణుడు ఎంత భోగియో అతని బాల్య లీలల వైభోగం , అష్టమహిషులు, 16 వేల మంది గోపికలు పొందిన సుఖ సంపన్నత అందరికి తెలిసినదే. అనేక తత్త్వాలను గోపికలకు, అక్రూరునకు, ధర్మరాజుకు, ఉద్దవునకు ఉపదేశించిన విషయం జగమెరిగిన సత్యం. సాక్షాత్తుగా యోగీశ్వరుడై అర్జునునకు భగవద్గీత, ఉత్తర గీతను ప్రబోధించెను. అందరితో అనురాగములను అనుభవించినను విరాగిగా, అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. సత్యభామా విధేయుడు, దక్షిణ నాయకుడు అయ్యెను. ''కృష్ణ'' శబ్దానికి కష్టాలు తీర్చేవాడు. కలిమి నిచ్చేవాడు. విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకునేవాడు అని వ్యాఖ్యాతలు అర్థం చెబుతారు! శ్రీమహావిష్ణువుకే తల్లిదండ్రులయ్యే అదృష్టం దేవకీ వసుదేవులకు దక్కింది! అది పూర్వజన్మలో వారికి భగవంతుడిచ్చిన వరం. ఇక నంద, యశోదల భాగ్యం ఇంతని చెప్పలేము. గోకులంలో నంద యశోదల ముద్దుల తనయుడై పెరుగుతూ, ముద్దు మురిపాలతో వారి నలరించి, వ్రేపల్లెలో తనకై ఎదురుచూస్తున్న భక్తకోటిని మురిపించడం కోసం కోరి తరలి వెళ్లినవాడు. ఇక శ్రీకృష్ణావతారం పరిపూర్ణమైన పరమానందభరితమైన ఆశ్రితులను ఆదుకొనేందుకై ధరించిన అవతారం! ద్వాపర యుగంలో రాక్షసాంశంగల వారెందరో ప్రభువులై ప్రజల్ని పీడించ సాగారు. ఆ సందర్భంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి, ధర్మాన్ని సంరక్షించడం కోసం శ్రీమహావిష్ణువు కృష్ణుడిగా అవతారం ధరించాడు. మహర్షులు, దేవతలు, గోప, గోపి జనంగాను, ఆదిశేషుడు 'బలరాముని'గా , శ్రీకృష్ణుని అన్నగారిగాను, ఇంకా ఎందరో ఆయనను అనుసరించి జన్మించారు! శ్రీకృష్ణపరమాత్మ అవతరించినది మొదలు ప్రదర్శించిన దివ్యలీలలు ఎప్పటికి మరచిపోలేము.
శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమీ ఆదివారం రోహిణి నక్షత్ర యుక్త వృషభలగ్న పుష్కరాంశ సుము మూర్తమయిన సుమారుగా అర్థరాత్రి చంద్రుడు లగ్నంతోనూ, మిగతా ఆరు గ్రహాలు మీనంలోను 11వ ఇంటిలో ఉండగా అనగా ఆరు గ్రహాలు ఉచ్ఛలో నుండగా శ్రీకృష్ణుడు జన్మించెను.
''సర్వే గ్రహ: శుభ ఏకాదశ స్థాన ఫలదా, వరదా,
శుభదా, సుఖదా, సప్రసన్నా, సుముఖా భవంతు' అని అంటాం. ఏ గ్రహాలైన 11వ ఇంటిలో శుభం చేకూర్చును. కావున శుభలగ్నాన, అన్ని గ్రహాలు ఉన్నత స్థానంలో నుండగా జన్మించుటచే మహితాత్ముడై, అజేయుడై, త్యాగియై భోగియై, రాగియై, విరాగియై, నిరోగియై, యోగీశ్వరుడై, స్ఫుర ద్రూపియై, తత్త్వవెెత్తయై, కొంగు బంగారమై, సంపూర్ణా యుష్మంతుడై జీవించినాడు.
''శ్రావణ బహుళ అష్టమి ''శ్రీకృష్ణ జయంతి! ''అష్టమి'' ఎనిమిదవ తిథి! ఈ ఎనిమిది అంకెతో చాలా సంబంధమే ఉంది శ్రీకృష్ణమూర్తికి! ''ఓం నమోనారాయణాయ'' ఎనిమిది అక్షరాలుగల మంత్రం! దశావతారాలలో ఎనిమిదవది కృష్ణావతారం! దేవకీదేవికి ఎనిమిదవ సంతానం ఆయన. అదీకాక, కృష్ణుడు జన్మించినదీ ఎనిమిదవ నెలలోనెనట! కృష్ణాజన్మస్థానమైన చెరసాలకు ఎనిమిది ద్వారాలున్నాయట! కృష్ణునికి ధర్మపత్నులు ఎనిమిది మంది. ఏనాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిందో ఆనాడే కలియుగం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు 125 సం 7 మాసాల 7దినములు జీవించిట్లు శ్రీ మహాభారత సారోద్దారమనే గ్రంథంలో మూడవ భాగంలో చర్చించి నిర్ణయింపబడింది. శ్రీమద్భాగవత ఏకాదశ స్కంధమున 6వ అధ్యాయమున 25వ శ్లోకాన
ఇలా వుంది.
యదోర్వం శేవ తీర్ణస్య, భవత: పురుషోత్తమ
శరచ్ఛతం వ్యతతస్య, పంచావింశాధికం విభో
పోతన భాగవతమున కూడా అలాగే ఉంది.
కృష్ణాష్టమి రోజు కృష్ణ వ్రతం చేస్తారు. ఈ రోజు శ్రీకృష్ణుని జన్మ దినంగా భావించినంత మాత్రం చేతనే ఏడు జన్మల చెడుతలపుల యొక్క పాపం నశించి పోతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. రోహిణీ నక్షత్రం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఉసిరి చూర్ణం, నువ్వులతో స్నానం చేసి, నివాస గృహం మధ్యలోగాని, గుళ్లోగాని, ముగ్గులు పెట్టి, వాటి మీద బియ్యం పరిచి, దానిమీద మంచి నీళ్లు, నవరత్నాలు ఉన్న కొత్త కలశాన్ని ప్రతిష్టించి శక్త్యానుసారంగా ఏదైనా లోహంతో బాలకృష్ణుని ప్రతిమను చేసి, ఆ కలశం మీద ఉంచి, దేవకీ దేవిని ప్రార్థించి అనంతరం శ్రీకృష్ణుని ప్రార్థించాలి. చంద్రో దయ వేళ శంఖసమేతులై వెళ్లి స్నానం చేసి శంఖంతో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం కొబ్బరి నీళ్లతో అర్ఘం ఇవ్వాలి. రాత్రికి జాగరణ ఉండి, మర్నాడు ఉదయం స్నానం చేసి, పున: పూజ చేసి కర్పూర హారతి నిచ్చి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలంతో సత్కరించి, బంధుమిత్రులతో కలిసి భోజనం చెయ్యాలి. అష్టమితో రోహిణి నక్షత్రం కూడా కలిస్తే అది శ్రీకృష్ణజయంతి. ఆ రోజున కృష్ణుని పూజించి పెరుగు, పాలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఉట్ల పండుగ చేసుకుంటారు. కుండలు పగులగొట్టుటలోని విశేషం దాన దర్మాలు చేయనివారి బ్రతుకులు వ్యర్థమని తెలుపుట కోసం అంటారు. మహారాష్ట్రలో ఈ ఉత్సవాన్ని గోపాల కాలం అంటారు.
కృష్ణాష్టమి పండుగ వచ్చిందటే సందడే సందడి. ఒక వైపు రాత్రి పూజ చేయడానికి సన్నాహాలు, మరోవైపు ఉట్టికొట్టడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతాయి. యువకులు, ముసలివారు అన్న వయోబేధం లేకుండా అందరూ ఉట్టి సంబరాల్లో పాల్గొంటారు. బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్లల్లోకి తన స్నేహితులతో వెళ్లి తనకిష్టమైన పాలు, పెరుగు, వెన్న దొంగలించేవాడు. తను తిని అందరికీ పెట్టేవాడు. ఆ కృష్ణపరమాత్మ తన స్నేహితులను నేలమీద ఒకరివీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న, పెరుగు తినేవారని అంటారు. ఈ కృష్ణలీలలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టి కొట్టడం. ఇప్పటికీ పల్లెటూర్లలోనూ, పట్టణాలలో కొంతమంది ఈ సంబరం జరుపుకుంటున్నారు.
యువకులందరూ బాగా ఎత్తుగా ఉట్టె కట్టి ఒకరు ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు అటూ ఇటూ నుంచుని వారిపై రంగురంగుల నీళ్లు జల్లుతూ ఉంటారు. ఇలా చాలా సేపు ఆడుకున్నాక ఎవరో ఒకరు ఆ ఉట్టిని కొడతారు. జన్మాష్టమిని అందరూ పండుగలా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తారు. ఇళ్లల్లోనూ, గుడిలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఓపిక ఉన్నవారు ఉదయం నుంచి రాత్రివరకు ఉపవాసం ఉండి పూజ చేసే వారు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి మినపసున్ని ఉడకబెట్టిన శనగలు, పాయసం, గారెలు, చిట్టిగారెలు (మినప పిండి, వరి పిండితో తయారు చేసినవి), పులిహోర ఇలా ఎవరి శక్తిమేరకు వారు ఇరవై ఒక్క రకాలపిండి వంటలు తయారు చేస్తారు. పరమాత్మకు ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న కూడ నైవేద్యం పెడతారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెట్టి పూజలు భజనలు చేస్తారు. రాత్రిపన్నెండు గంటల సమయంలో దేవుడికి నైవేద్యం పెడతారు. ఊయలసేవ చేసి కృష్ణుడిని పడుకోబెడతారు. ఇలా ఎందుకు చేస్తారంటే లోక కల్యాళార్థం భూలోకంలో ఆ మహావిష్ణువు అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలోనే కృష్ణుడి రూపంలోజన్మించాడు కనుక.
ఆ చిన్ని శ్రీకృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని అందరూ తమ ఇంటి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి ముగ్గుతో చిన్నిచిన్ని పాదాలను వేస్తారు. ఆ పాదాల మీద కృష్ణుడు నడిచి వస్తాడని భక్తుల విశ్వాసం.

Tuesday, July 22, 2014

దైవము – లీలలు

దైవము – లీలలు
మనము చేసే పాపపుణ్యాలను బట్టీ దైవము ఫలితాలనిస్తుంది అని మన సనాతన ధర్మం బోధిస్తోంది.
వివరంగా చెప్పాలంటే,
మనం చేసే పాపపుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి
.ఒకటి
. అతిసామాన్య పుణ్యము అతిసామాన్య పాపము. .
రెండు
. సామాన్య పుణ్యము. సామాన్య పాపము.
మూడు
. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము.
దైవము అతిసామాన్య పుణ్యములను , అతిసామాన్య పాపములను, కలలో అనుభవించేవిధముగా చేస్తుంది.
ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చేవానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే మనం అనుకున్న పైకం , జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము. ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది
. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము.దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి వెళుతుందన్నమాట.
ఇలాంటిఅతిసామాన్య పుణ్యాలను మనము కలలో ” ఏదో పదోన్నతి పొందినట్లో” అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.
ఇఖ అనన్య సామాన్య పుణ్యములను , అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది. మనం ఎదో పెద్దయాగము చేశామనుకోండి
, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.
ఇఖ సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది
.ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది
అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది
కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని , సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.
శ్రీరామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా , రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణస్వామి చలించిపోయి “అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?” అని దైవదూషణకు దిగుతాడు. అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో “లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?” అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.
ఇక్కడ గమనించాల్సింది
,” కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు,దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం” అనే శ్రీరామవాక్యాన్ని.
కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ , నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,చేసుకోవాలి
. దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము. భగవంతుని పాదములు మనస్సులో తలచుకుని, ఆయన పాదములు పట్టుకుని
, ” నేను నీశరణాగతుడను, నీపాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ,” అను ఆర్తితో ప్రార్ధించండి. ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.
స్వస్తి
.

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి?
ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన. (భవిష్యపురాణం)..
ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడు ని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరం లో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి ఒస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.
ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా? ఎఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!
కుశలమే! నారాజ్యంలో నేను కాకా నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం '' ఒమ నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

Sunday, July 20, 2014

మనం వెనుకబడిలేమా ?

మనమెక్కడున్నాం ?
మనము సనాతన ధర్మము , సాంప్రదాయాలు , అంటూ మనగొప్పతనాన్ని చెప్పుకుంటున్నామేగానీ , నిజంగా అందులోని సారాంశాన్ని తెలుసుకొని పాటిస్తున్నామా ? అనిపిస్తుంది , ఒకోసారి. ఎందుకంటే మన వేదాలని అర్థం చేసుకొని , వాటి సారాంశాన్ని ఉపయోగిస్తూ మనకన్నా ఎక్కువగా పాటించేవారు.. విదేశాల్లో ఎక్కువ ఉన్నారని అవగతమవుతున్నది.
యజుర్వేదపు మొట్టమొదటి మంత్రము.. " ఇషేత్వోర్జేత్వా వాయవస్థో పాయవస్థ... -----బహ్వీర్యజమానస్య పశూన్ పాహి "
పై మంత్రార్థము చూస్తే , ఇది పశువులను , ముఖ్యంగా వత్సములను ( దూడలను ) కాపాడుటకోసం ప్రయోగించబడుతుంది. దర్శ యాగములో ఇంద్ర దేవతలకు పెరుగును ’ హవిస్సు ’ గా అర్పిస్తారు. ఆ పెరుగు దొరకాలంటే గోవులను ఆశ్రయించక తప్పదు. పాలు దొరికితేనే కదా , పెరుగు తయారయ్యేది ! ఆ పాల కోసము , ఆవుదూడలను కొంతపాలు తాగిన తర్వాత తల్లినుండీ వేరు పరచక తప్పదు. పాలు కావాలంటే ఇదే విధి. ఆ దూడలకు , వేరే ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. దూడలను ఆవునుండీ వేరు చేయాలంటే , వాటిని బెదిరించో , ఆశపెట్టో ఆ పని చేయాలి. వాటికి హింస కలుగరాదు. కాబట్టి , ఒక మోదుగ కొమ్మను చెట్టునుండీ కత్తరించి , ఆకులు గల ఆకొమ్మతో దూడలను అదిలిస్తారు. తర్వాత వాటిని పచ్చిక మేయడానికి పంపిస్తారు. వాటికేమాత్రం బాధ కలగరాదని , వాటిని ఇలాగ ప్రార్థిస్తారు. " ఓ దూడలారా , మీరు వాయువులు కండి ( అంటే , ఇంకో అర్థము , మాతృ సమీపము నుండీ దూరము వెళ్ళండి.) . ఆ వాయువే మిమ్మల్ని రక్షించు గాక ( పశువులకు దేవత అంతరిక్షము , ఆ అంతరిక్షానికి అధ్యక్షుడు వాయువు ) గడ్డి మేసి , సాయంకాలానికి మరలా యజమాని ఇంటికి తిరిగి రండి.."
తర్వాత , గోవులను ఇలాగ ప్రార్థిస్తారు, " ఓ గోవులారా , సర్వప్రేరకుడైన ఆ సవితృ దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన కర్మ అగు యాగానికి హవిస్సును కలుగజేయుటకు ప్రేరేపించనీ.. దేవతలకు ఇవ్వతగిన పాలు , పెరుగు , నేయి మొదలైనవి , మీనుండీ గాక , ఇంకెక్కడ లభించును ? గోవులారా , మీరు హింసకు ఏమాత్రమూ అర్హురాళ్ళు కాదు. ( గోవులను ’ అఘ్ని ’ అని అంటారు... అంటే హింసింపకూడనివి ) మీరు మొదట మీ బిడ్డలకు , తర్వాత మనుషులకూ పాలిచ్చి , పుష్టిని కలిగిస్తున్నారు. ఇప్పుడు బాగా గడ్డి మేసి , ఇంద్రాది దేవతలకు కావలసిన హవిస్సును కూడా ఇవ్వండి.. మిమ్మల్ని , దొంగలు అపహరించకుందురు గాక. కౄర మృగాలు హింసింపకుండు గాక , రుద్రుడూ , రుద్రాయుధాలూ మిమ్మల్ని తాకకుండు గాక ( రుద్రుడి పని , కనిపించినవారిని హింసించుటయే ) మీ సంతతి వృద్ధియై , యజమానుని శాల నిండనీ !
తర్వాత , మోదుగ చెట్టును ( కొమ్మను ) ఇలాగ ప్రార్థిస్తారు. ఓ పాలాశమా , దేవతలకు కావలసిన ఆహారము కోసము , నిన్ను వాడుకుంటున్నాను. నిన్ను నమస్కరించి నిన్ను కత్తరిస్తున్నాను. దూడలు నిన్ను చూడగనే , బెదురు లేకుండా మరలిపోయేటట్టు చేయి , అలాగే యజమానుని గోవులను రక్షించు..
లోకకల్యాణార్థమై , ఒక్క యాగము కోసము , యాగము సక్రమంగా జరిగి , ఎవరికీ ఏ బాధా కలుగరాదని , వాటికి అవసరమైన అన్నిటినీ ప్రార్థించి గానీ మొదలుపెట్టని సంప్రదాయాన్ని మనకు వేదము నేర్పింది.. ఇవే కాదు , ఇంకా వేరు మంత్రాలలో , మట్టినీ , నీటినీ ఇతర పదార్థాలనీ ఇలాగే ప్రార్థించే సన్నివేశాలు కనిపిస్తాయి.
ఈ అవగాహన లేకుండా , ఈనాడు మనుషులను మనుషులే విపరీతంగా హింసించుకుంటూ , సనాతన ధర్మపరాయణులమని చెప్పుకుంటూ మనం చేసేది ఎవర్ని మెప్పించుటకు ?
నిన్న నాతమ్ముడితో ( Pavan Bhaskara ) మాట్లాడుతున్నపుడు కొన్ని ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పాడు. అతడు జర్మనీలో ఉంటాడు.. మనం ఊహించుకునేట్టుగా , విదేశీయులందరూ మాంసాహారులూ , తాగి తందనాలాడేవారూ కాదనీ , చెట్లకు కూడా హాని కలిగించక బ్రతికేవారున్నారనీ అన్నాడు. అక్కడ అనేకులు , చెట్లనుండీ కాయలూ , పళ్ళూ కోయరట. అవే పండి రాలితే గానీ వాటిని తీసుకోరట. మనం మృత్యుంజయ మంత్రములో , " ఉర్వారుకమివ బంధనాత్ ... " అంటూ , పండిన పండువలె రాలిపోదామనీ , అపమృత్యువు రాకూడదనీ ప్రార్థిస్తాము.. దాని అర్థాన్ని తెలుసుకొని వారు ఎంతబాగా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది. పాలు పిండితే పశువులకు బాధ అని , చాలామంది పాలు , పెరుగు ముట్టుకోరట.
అంతే కాదు , నూరేళ్ళనుండే అక్కడ సంస్కృతపు వాడకము ఉందనీ , ఇప్పటికీ సంస్కృతం లో వార్తలు ప్రసారమవుతాయనీ , వేదమంతా అనువదించి లైబ్రరీలలో నిక్షిప్తము చేసుకున్నారనీ అన్నాడు.
..
మనం వెనుకబడిలేమా ?

Tuesday, July 15, 2014

వ్యాధులకు గృహ చికిత్సా చిట్కాలు #

వ్యాధులకు గృహ చికిత్సా చిట్కాలు
1) ఆస్తమా నివారణకు ..... తోలు తీసిన బాదం పప్పు పొడి , విత్తనాలు తీసిన ఎండుఖర్జూరాలు , కిస్మిస్ , పటికబెల్లం , తేనే సమబాగాలుగా తీసుకొని అన్నింటిని కలిపి మెత్తగా గుజ్జులాగా దంచి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని 10 గ్రాముల చొప్పున రోజుకు మూడు పూటలా తీసుకుంటు వుంటే ఆస్తమా సమస్య తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది .
2) కాళ్ళు మడమల నొప్పికి .... శరీర బరువు పెరిగిపోవటం వల్ల ఆ బరువంతా కాలు మడమలపై పడటం వల్ల , రోజు గంటల తరబడి నిల్చొని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల మడమల్లో వాయువు ఉండి ఆబాగంలో గడ్డ కట్టి భరించలేని నొప్పిని కలిగిస్తుంది . ఈ నొప్పి నివారణకు తెల్ల జిల్లేడు చెట్టు పూలు మరియు కొద్దిగా పసుపు కలిపి మెత్తగా నూరి దాన్ని మడమపై పరచి దూది పెట్టి తెల్లటి బట్ట లేదా బ్యాండేజ్ క్లాత్ తో కట్టు కట్టి రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచాలి , వారం రోజులలో నొప్పి తగ్గుతుంది .
3) వయసు వచ్చాకా కూడా పిల్లలు మూత్రం పోసి పక్క తడుపుతుంటే ..... పిల్లలకు పసితనం నుండే చల్లని నీరు , చాకోలేట్స్ , కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అలవాటు చేయటం వల్ల శరీరంలో కఫం అవసరానికి మించి ఉత్పన్న మవుతుంది, క్రమంగా శరీరంలో జలధాతువు పెరిగిపోయి మూత్ర అవయవాలు బలహీనపడి తెలియకుండానే మూత్రం పోయవలసిన బలహీనత కలుగుతుంది. దీనిని నివారించేందుకు జిలకర 100 గ్రాములు దోరగా వేయించి దంచి పొడి చేసి బెల్లం 100 గ్రాములు కలిపి నున్నగా దంచుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రెండు పూటలా 5 గ్రాముల చొప్పున తినిపిస్తూ ఉంటే క్రమంగా పక్క తడపటం తగ్గిస్తారు.
4) పెద్దవారికి మధుమేహం వల్ల అతి మూత్రము నివారణకు .... నేరేడు గింజలను దంచి పొడి చేసుకొని నిల్వ ఉంచుకోవాలి , ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పొడి వేసి సగం గ్లాసు కషాయం అయ్యేటట్లు బాగా మరిగించి కొద్దిగా తాటిబెల్లం తగినన్ని వేడిపాలు కలుపుకొని రెండు పూటలా తాగుతుంటే కొద్ది రోజులలో అతిమూత్రం తగ్గడమే కాకుండా మధుమేహం కూడా అదుపులోకి వస్తుంది ( మీ రెగ్యులర్ మందులు తప్పక వాడాలి )
5) దీపావళి లో పటాకుల వల్ల కాని , వేడి నీరు - నూనె వల్ల మన శరీరంపై బొబ్బలు - మంటలు వస్తాయి . వీటి నివారణకు ...... మెంతులను,తులసి ఆకులను కలిపి మంచి నీటితో మెత్తగా గుజ్జు లాగా నూరి కాలిన చోట పట్టిస్తే మంట తగ్గి బొబ్బలెక్కకుండా ఉంటుంది , ఇలా రెండు పూటలా చేస్తూ ఉంటే కాలిన గాయాలు కూడా తగ్గుతాయి

Monday, July 14, 2014

శరీర త్రయం

జాజిశర్మ
సనాతన ధర్మ ప్రచార భారతి నుండి
శరీరత్రయం (3 శరీరాలు) = (1) స్ధూల శరీరం (2) సూక్ష్మ శరీరం (3) కారణ శరీరం
(1) స్ధూల శరీరం :- కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు చెవులు, చర్మం
(2) సూక్ష్మ శరీరం :- 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాలు - వీటితో కూడి ఉన్నది సూక్ష్మ శరీరం. దీనినే లింగ శరీరం అని కూడా అంటారు.
5 కర్మేంద్రియాలు : వాక్కు, కాళ్ళు, చేతులు, గుదము, జననేంద్రియాలు
5 జ్ఞానేంద్రియాలు : కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక
5 ప్రాణాలు : ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
4 అంతఃకరణాలు : మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
5+5+5+4 = 19
(3) కారణ శరీరం :- నీ నిజస్వరూపాన్ని (ఆత్మను) నీకు తెలియకుండా చేసేది అగ్రహణం, దేహేంద్రియాలే నేను అని విపరీతంగా భావించేట్లు చేసేది అన్యధాగ్రహణం - అజ్ఞానం. ఈ అజ్ఞానాన్నే కారణ శరీరం అన్నారు. ఈ స్ధూల, సూక్ష్మ శరీరాలు నీకు రావటానికి కారణమైనది ఈ కారణ శరీరం (అజ్ఞానం). ఈ అజ్ఞానం పోతే నీ సమస్త దుఃఖాలకు కారణమైన స్ధూల, సూక్ష్మ శరీరాలు ఇక రావు - జన్మలుండవు.

ధృవుని వృత్తాంతం మనకు చెప్పేదేమిటి

ధృవుని వృత్తాంతం మనకు చెప్పేదేమిటి
ధృవుడు తన కన్న తల్లి వద్దకు ఆవేదనతో వెళ్ళినప్పుడు తల్లి, "నీ మనసు బాధపెట్టినవారిని బాధపెట్టడానికి ప్రయత్నించకు. పరమాత్మ గురించి తపించు" అని చెప్పింది. మనందరికి కూడా అదే వర్తిస్తుంది
ధృవుడు తపస్సు చేసేప్పుడు పరమాత్మ మీదే ధ్యానముతో ఉండి, పరమాత్మను తప్ప మరి దేన్నీ చూడలేదు.
పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉన్నందు వలన ఆయనకి ఆకలి దప్పులు కలగలేదు
పరమాత్మని ధృవుడు చేసిన స్తోత్రం పరమాత్మ కృప వలనే కలిగింది
పరమాత్మ మీద ధ్యానం చేసి ధృవుడు ఏ కోరికా కోరలేదు. అందరి హృదయములో ఉండే స్వామికి ధృవుని మనసులో ఉన్న కోరిక తెలుసు.
ధృవుడు కోరిక బయటకి చెప్పకపోయినా, ఆ సమయములో ధృవుని మనసులో ఉన్న దాన్ని పరమాత్మ అనుగ్రహించాడు. అంటే మనం
ధృవుడు అంత తపస్సు చేసినా మోక్షాన్ని కోరలేదు. అంటే మనమేమి కోరాలో అది కూడా స్వామి సంకల్పమే.
ధృవుని పొరబాటు ఎక్కడ జరిగింది? పరమాత్మ యొక్క పాద ధూళిని పొందిన మీవంటి (విదురుని) వాళ్ళు, పరమాత్మ వచ్చి ఏమి కావాలంటే "నీ కైంకర్యం కావాలి" అంటారు గానీ, ఇంకో సంపద కోరరు. మనము ఏదో ఒక దానిని ఎందుకు కోరతాము? కొరత ఉంటే కోరతాము. పరమాత్మ పాద పరాగ స్పర్శ ఉంటే అన్నీ ఉన్నట్లే. సామాన్యమైన జీవుడు ప్రకృతిలో వేటి వేటిని పొందగలడో అవి అన్నీ పరమాత్మకు దాసుడైన వాడు పొందుతాడు. వాటితో బాటు అన్నింటికన్నా శ్రేష్టమైన పరమాత్మ దాస్యం లభిస్తుంది.
అందుకే భగవంతుని దాస్యాన్ని తప్ప మరి దేన్నీ కోరరు

పరమాత్మ సంకల్పం వల్లనే మనకు ఆయన కథల మీద భక్తి, భక్తుల మీద భక్తి, ఆయన మీద భక్తి కలుగుతుంది. ఆయన సంకల్పం చేతనే మనకు వచ్చే ఆలోచనలూ, కోరికలూ. ఆయన సంకల్పమే మన చేత ఇంద్రియ అధిష్ఠాన దేవతల రూపములో ఉంది మన చేత బుద్ధిని ప్రచోదనం చేసి ఆయా కర్మలు చేయిస్తుంది. చివరికి భగవంతుని సాక్షాత్కారం అయినా, ఆయన సంకల్పానుసారమే మనము కోరతాము. మనము చేయవలసిందీ కోరవలసిందీ కూడా ఆయన కైంకర్యాన్నే.

Friday, July 11, 2014

కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?



భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు
6. కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?
హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి మరియు మనుషులకి కాళ్ళను తగలనివ్వ కూడదని నేర్పించబడుతుంది. ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళకద్దుకోవాలని పిల్లలకు నేర్పబడుతుంది.
కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలరాదు?
భారతీయులకు జ్ఞానము పవిత్రము, దివ్యము ఐనది. అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవమివ్వాలి. ఈ రోజుల్లో పాఠ్యంశములను ఆధ్యాత్మికము ఐహికము అని విడదీస్తున్నాము. కానీ ప్రాచీన భారతదేశములో ప్రతి విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది.
చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది. చిన్న తనమునుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి. జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనము పుస్తకాలని వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము. మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము .......
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వరాలనిచ్చి, కోరికలని తీర్చే ఓ సరస్వతీ దేవీ! నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా కోరికలు తీర్చుదువు గాక!
పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు. ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి. పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు.
ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణింప బడుతుంది - ఎందుకు?
మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయముగా పరిగణింప బడుతాడు. అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలో నున్న దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే. అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తీ, వినయములతో కూడిన క్షమాపణను చెప్పాలి.
పై విధముగా మన ఆచారములు చాల సరళమైనవి. కానీ అవి చాలా శక్తివంతమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాలను గుర్తుకు తెస్తాయి. ఇటువంటి ఆచారాలు శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టడానికి కారణమయ్యాయి.
Kb Narayana Sarma

గురు పౌర్ణమి - వ్యాస పూర్ణిమ

వ్యాస పూర్ణిమ


గురు పౌర్ణమి
గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో ...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం "వారణాశి" లో కదుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాదు, ఒకరోజునదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్సిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూత్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి  పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న 'వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులులతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు 'సాలగ్రామమూ, 'తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా1 మీకు ఎమి వరకావాలో కోరుకోండి. నోమూలూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలాను అనుభవిస్తూ; అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని 'వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు.....!....!....!
"శృణు విప్రతవేచ్చా చేత్ దర్శనార్థం తదాత్వయా
పూఅజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం"
అని అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.
అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విస్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వార్మి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్దపాద్యమి"నాడు వార్కి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము గమనిస్తున్నాము గదా!'-మరి. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.
"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."
ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుకాగురువారమూ అయిన ఎడలాది మరింతగా స్రేష్ఠమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్నమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః
అట్టి పరమ పవిత్రమైన "గురుపౌర్ణమి" పుణ్యదినం మనంతా విశేషంగా జరుపుకుని ముందు తరాలవార్కి మార్గదర్శకుల మౌతూ, పునీతులౌదాము.

జీవిత పరమార్ధం

జీవిత పరమార్ధం
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది తరువాత తరువాత ఆ రాయిని అదే పనికి చాలా సార్లు వాడుకున్నది.
ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరు ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ (పల్లీ పట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.
అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.
బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడ సాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు.

అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారికి తెలిసిన పరిధికి లోబడి ఉంటుంది. నిజంగా విలువ తెలిసిన వారు సరిగా వాడుకుంటే జీవన్ముక్తి పొంద గలుగుతారు. లేని వారు దాంతో కుంకుడు కాయలు కొట్టుకుంటే లేక ఒక పేపర్ వెయిట్ గా మాత్రమే వాడుకుంటే ఇక మానవ జన్మకి పరమార్ధం ఏమిటి?

Wednesday, July 9, 2014

ఆశ్రయ పరిత్యాగ దోషం

శ్రీ స్కాంద పురాణము లోని కథ
ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యం. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనమూ ధన్యులం.
మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది
“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.
ఇలా ధర్మము మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.
చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.
తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.
భగవత్ బంధువుల్లారా!
ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.

Monday, July 7, 2014

అన్నీ మన మంచికే

అన్నీ మన మంచికే

శాంతి
సహనం

ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది.
ఏది జరిగినా మన మంచికే!
కానీ మనం అర్ధం చేసుకోలేక పోవచ్చు; ప్రత్యేకంగా మనకి నచ్చకపోతే.

నేను: స్వామీ, నేను మిమల్ని ఒక ప్రశ్న అడగచ్చా?
భగవంతుడు: తప్పకుండా.
నేను: మీరు నొచ్చుకోరు కదా.
భగవంతుడు: నేను ఏమీ అనుకోను.
నేను: ఈ రోజు నాకు ఎందుకు ఇంత జరిగింది?
భగవంతుడు: అంటే ఏమిటి?
నేను: నిజమే, నేను ఆలస్యంగా లేచాను.
భగవంతుడు: సరే.
నేను: నా బండి పని చెయ్యడానికి చాలా సమయం పట్టింది.
భగవంతుడు: సరే.
నేను: భోజనం దగ్గర ఆలస్యం చేశారు, అందుకని నేను వేచి ఉండాల్సి వచ్చింది.
భగవంతుడు: అవును.
నేను: ఇంటికి వచ్చే దారిలో, ఫోను మాట్లాడదాము అంటే పని చెయ్య లేదు.
భగవంతుడు: సరే.
నేను: అన్నిటికంటే, ఇంటికి వచ్చాక, కాసేపు కాళ్ళకి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే, కాళ్ళు ఒత్తే పరికరం పని చెయ్యలేదు. ఈ రోజు ఏదీ సరిగ్గా లేదు! ఎందుకు అలా చేశారు?
భగవంతుడు: ఈ రోజు ఉదయం యముడు నీకు చాలా దగ్గరగా వచ్చాడు, అప్పుడు నేను ఒక దేవతని నీ ప్రాణాలు కాపాడమని పంపించాను. ఆ సమయంలో నిన్ను పడుకో నిచ్చాను.
నేను: అలాగా...
భగవంతుడు: నీ బండి ఎందుకు పనిచెయ్య లేదు అంటే, అదే దోవలో నువ్వు వెళ్ళి ఉంటే , ఒక మద్యపానం త్రాగిన డ్రైవర్ నిన్ను గాయపరిచేవాడు.
నేను: సిగ్గుతో తలవంచుకున్నాను.
భగవంతుడు: నీ భోజనం ఎందుకు ఆలస్యం అయ్యింది అంటే, వంట వాడు జబ్బుతో ఉన్నాడు, అది నీకు అంట కూడదు. నాకు తెలుసు, నీకు ఉద్యోగానికి వెళ్లకపోతే కుదరదు కాబట్టి.
నేను: బాధతో - సరే.
భగవంతుడు: నీ ఫోను ఎందుకు పని చెయ్యలేదంటే, అవతల వాడు తప్పు సమాచారం ఇవ్వ బోతున్నాడు. నువ్వు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు.

నేను: అలాగా స్వామి.
భగవంతుడు: ఆ కాళ్ళ పరికరం పని చేసి ఉంటే, ఇంట్లో రాత్రి కి విద్యుత్ సరఫరా ఉండేది కాదు. నువ్వు చీకట్లో ఉండాల్సివచ్చేది.
నేను: నన్ను క్షమించండి స్వామి.
భగవంతుడు: బాధపడకు, నా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకో .... అన్ని విషయాల్లోను, మంచి, చెడు రెండింటిలో.
నేను: మిమ్మల్ని నమ్ముతాను.
భగవంతుడు: అనుమానం వద్దు. నువ్వు అనుకున్న దాని కంటే, నేను అనుకున్నది ఎప్పుడూ మంచిది.
నేను: నేను అనుమానపడను. ఈ రోజు జరిగిన అన్ని విషయాలకి ధన్యవాదాలు.
భగవంతుడు: సంతోషం. నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ వాళ్ళని గమనిస్తూనే ఉంటాను.

నీతి:
మనం ఏమీ చెయ్యలేని దానికి, సహనం ఓర్పు ఎంతో అవసరం. మనం చెయ్యగలిగినది చెయ్యడం. సరైన స్వభావం కలిగి ఉండడం. ఏమి జరిగినా మన మంచికే అని తెలుసుకోవాలి. ఎప్పుడు దానిలో ఒక నీతి దాగి ఉంది.

నిత్యం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి?

ఎవరైనా సరే నిత్యం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి?
మనల్ని నిత్యం కలవరపెట్టే విషయాలనుంచి దూరంగా ఉండటం మంచిది.
1. ఎప్పుడూ ఎవరినీ ద్వేషించకుండా ఉండాలి.
2. ఎప్పుడూ మనసును ఆందోళనలకు దూరంగా ఉంచాలి. కంగారు పడకూడదు.
3. నిరాడంబర జీవనం సాగించాలి.
4. తక్కువ ఆశించాలి.
5. ఎక్కువ త్యాగం చేయాలి.
6. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
7. తీరిక సమయాల్లో- నచ్చిన, నమ్మిన భగవన్నామస్మరణ చేయాలి.

Thursday, July 3, 2014

చెట్ల వలన లాభములు

మూలము

చెట్లు మన నేస్తాలు..... చెట్ల వలన మనం పొందే లాభాలు.....

మానవ జాతికి చెట్లు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది .చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకోండి మరి .

1.రెండు పెద్ద చెట్లు రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .

2.ఒక పెద్దచెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ కూడా వడబోసే filters లాగా పనిచేస్తాయి.అంటే గాలిని శుభ్ర పరుస్తాయి.

3.ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా ఉండే చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము,ధూళిలను తొలగిస్తాయి.

4.చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటె చెట్లు ఉన్న రోడ్ల దగ్గర కేవలం 3 వేలే ఉంటాయి

5.చెట్టు సహజ మయిన aircondition లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 gallons నీటిని గాలి లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది.

6.ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు రూం ఎయిర్ కండీషనర్స్ రోజుకు ఇరవై గంటల వంతున పని చేస్తేనే గాని ఇవ్వలేవు.

7.ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.

8.చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.

9.ఒక football ground ఆవరణలో ఉండే చెట్లు (సుమారు 400 ) వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగించ గలవు.

10. 50 ఏళ్లలో ఒక చెట్టు 37,500 డాలర్ల (సుమారు 2,175,000) విలువైన ఆక్సిజన్ ను ఇస్తుంది.

ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.

అడ్మిన్ సుకన్య
— with Raju Chundu.
Photo: Srinivasa Bhaskara Rao Yanamandra gari post

చెట్లు మన నేస్తాలు..... చెట్ల వలన మనం పొందే లాభాలు.....

మానవ జాతికి చెట్లు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది .చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకోండి మరి .

1.రెండు పెద్ద చెట్లు రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .

2.ఒక పెద్దచెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ కూడా వడబోసే filters లాగా పనిచేస్తాయి.అంటే గాలిని శుభ్ర పరుస్తాయి.

3.ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా ఉండే చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము,ధూళిలను తొలగిస్తాయి.

4.చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటె చెట్లు ఉన్న రోడ్ల దగ్గర కేవలం 3 వేలే ఉంటాయి

5.చెట్టు సహజ మయిన aircondition లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 gallons నీటిని గాలి లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది.

6.ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు రూం ఎయిర్ కండీషనర్స్ రోజుకు ఇరవై గంటల వంతున పని చేస్తేనే గాని ఇవ్వలేవు.

7.ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.

8.చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.

9.ఒక football ground ఆవరణలో ఉండే చెట్లు (సుమారు 400 ) వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగించ గలవు.

10. 50 ఏళ్లలో ఒక చెట్టు 37,500 డాలర్ల (సుమారు 2,175,000) విలువైన ఆక్సిజన్ ను ఇస్తుంది.

ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.

అడ్మిన్ సుకన్య

Wednesday, July 2, 2014

ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి?

ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి?
పూర్తి సమాచారము కొరకు దీన్ని అనుసరించండి .
 
భారతీయులందరూ పూజకై, ప్రార్ధనకై ఒక గదిని లేక కొంత స్థలాన్ని తమ గృహములలో కేటాయిస్తారు. ప్రతి రోజూ దైవానికి ముందు ఒక దీపాన్ని వెలిగిస్తారు. జపము, ధ్యానము, పారాయణము, ప్రార్ధనలు, భజనలు మొదలగు ఆధ్యాత్మిక సాధనాలు కూడా ఈ ప్రార్ధనా స్థలమందు జరుపుతారు. పుట్టిన రోజు, వివాహాది దినములు మరియు పండుగలు మొదలైన అన్ని శుభ సందర్భాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. గృహములోని పెద్దలు, పిన్నలు అందరు కూడా దైవముతో సాన్నిధ్యము కలిగి పూజ చేసికొంటారు.
పూజాగది - ఎందుకు?
ఈ చరాచర సృష్టికి పరమాత్మ మాత్రమే సొంత దారుడు. కావున మనము నివసించే గృహానికి కూడా నిజమైన హక్కుదారు పరమాత్మయే. పూజా గది అనేది ఆ యజమాని ఐన పరమాత్మ గది. మనము భగవంతుని సొత్తుకు నిజమైన సొంత దారులము కాము అనే భావన వలన మాత్రమె మన దురహంకారము, మనది అనే పెత్తందారి తనమును వదిలించుకోగలము.

మనము నివసించే గృహమునకు మరియు మనకు కూడా యజమాని భగవంతుడే. మనము కేవలము ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమైన సేవకులము అన్న సరైన భావన కల్గి ఉండటము ఉత్తమము. ఈ విధముగా భావించ వీలు కానిచో భగవంతుడిని మన గృహానికి విచ్చేసిన ముఖ్య అతిధిగా భావించి ఆయన సంతోషముగా ఉండడానికి పూజ గదిని కానీ, దైవ పీఠమును గాని వసతిగా కల్పించాలి. అన్ని వేళలా ఆ ప్రదేశం శుభ్రముగా మరియు అలంకార యుక్తంగా ఉండేలా చూడాలి (ఉన్నతాధికారి మన ఇంటికి వస్తుంటే వారికి చేసే సౌకర్యాలకన్నా కొంత ఎక్కువగానే ఉండేలా చూడాలి).
పరమాత్మ సర్వ వ్యాపి . ఈ విషయము గుర్తుంచు కోవడానికి ఆయన మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజా గదులను కల్గి ఉండాలి. భగవంతుని అనుగ్రహము లేనిదే మనము ఎ పనిని విజయవంతముగా చేయలేము, దేనిని సాధించ లేము. పూజ గదిలో భగవంతుడిని ప్రతి రోజూ ప్రార్ధించటము వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము.
ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశింపబడి ఉంటుంది. ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలము కల్గి ఉండేలాగా అమర్చి ఉంటాయి. అదే విధముగా ధ్యానానికి, పూజకు, ప్రార్ధనకు కూడా అనుకూలమైన వాతావరణము కల్గినటువంటి పూజాగది మనకు అవసరము . పవిత్రమైన ఆలోచనలు, శబ్దతరంగాలు ఆ ప్రదేశములో వ్యాపించి అక్కడకు వచ్చినవారి మనస్సుల్ని ప్రభావితము చేస్తాయి . మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలము ప్రార్ధనా గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా చాలు ప్రశాంతత, ఉత్సాహము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందగలము.
(అంతే కాని చేసే కొన్ని విధాలైన పనులు భగవంతుని ముందర చేయటానికి Guilty గా ఉంటుంది కదండీ అందుకు కాస్త దూరంగా ప్రత్యేక గది కట్టి అందులో భగవంతుణ్ణి బంధించేశాము అని మాత్రము దయచేసి అనకండి.)

Tuesday, July 1, 2014

పిల్లలని సరిగా చదివిస్తున్నామా..???



మీ పిల్లలకు ఇవి పనికి వస్తాయేమో చూడండి. మూలము
చదువులో వేగం పెరగాలంటే మన కన్ను చూడవలసింది ఒకసారి ఒక పదాన్ని కాదు; కనీసం రెండు మూడు పదాలను. అలా చేస్తే నిమిషంలో 240-360 పదాలను పూర్తిచేయవచ్చు. ఉత్తమ విద్యార్థి నిమిషానికి 600-840 మాటలను అవలీలగా పూర్తిచేస్తాడు. అతని కన్ను 5 నుంచి 7 పదాలను క్లిక్‌మన్పిస్తుంది. అంటే సగటు విద్యార్థి కంటే ఉత్తమ విద్యార్థి మూడు రెట్లు వేగంగా చదువుతాడు.
చాలామంది చదువుతూ తిరిగి వెనక్కివచ్చి చదివిందే చదువుతూ ఉంటారు. ఒక పేజీ పూర్తయ్యేసరికి ఇలా దాదాపు నలబైసార్లు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ అలవాటు మన విలువైన కాలాన్ని హరించివేస్తుంది.
చూపు పుస్తకంపైన, చిత్తం...
ఒక విషయం అర్థం కావాలంటే దానిపై ధ్యాస పెట్టాలి. ధ్యాస నిలవాలంటే వేగం కావాలి. మెల్లగా చదివితే ధ్యాస నిలవదా అని సందేహం రావొచ్చు.
విద్యానిపుణుల పరిశోధనల ప్రకారం మెల్లగా చదివేవారి దృష్టి పక్కదారులు (divert)పడుతుంది. వేరే సంగతుల మీదికి షికార్లు పోతుంది. 'చూపు శివుడి మీద, చిత్తం చెప్పుల మీద' అన్నట్టు- చూపు పుస్తకంపైన, చిత్తం మాత్రం చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటుంది. మనసు నిలకడగా ఒకచోట ఉండాలంటే వేగంగా చదివే అలవాటు నేర్చుకోవాలి.

గంటకు 10 కి.మీ. వేగంతో కారు నడిపే వాడికీ, గంటకు వంద మైళ్ళ వేగంతో కారు నడిపే వాడికీ తేడా ఏమిటి? 10 కి.మీ. వేగం నిజానికి వేగమే కాదు. ఆ మాత్రం వేగానికి రోడ్డు మీద ధ్యాస నిలవదు. చూపు చుట్టుపక్కల పెత్తనానికి పోతుంది. అందే వంద కిలోమీటర్ల వేగంతో వెళితే దారిమీద తప్ప వేరే దానిమీద ధ్యాసకు అవకాశమే ఉండదు. కాబట్టి వేగంగా చదివితే గానీ ధ్యాస కుదరదు. పైగా మన కన్ను, మనసు కూడా నిమిషానికి 20,000 మాటలకు పైగా చదివి, అర్థాన్ని గ్రహించగలిగే శక్తిమంతమైన సాధనాలు. 'పాల్‌ స్కీల్‌' ఫొటో రీడింగ్‌ పద్ధతి ద్వారా నిమిషానికి 25,000 మాటలు అర్థం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు.
అయితే... సగటు విద్యార్థి నిమిషానికి 200 మాటలే చదువుతాడు. అంటే తన శక్తిలో ఒక శాతం మాత్రమే వినియోగించుకుంటూ మిగతా 99 శాతాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. దీన్ని మరోలా చెప్పాలంటే గంటకు 200 కి.మీ. వెళ్ళగల కారును గంటకు 2 కి.మీ. మందగమనానికే వినియోగించడం లాంటిది. దీనివల్ల ధ్యాస కుదరదు; ఆ చదివింది కూడా అర్థం కాదు.
వేగంగా చదవడం వల్ల విషయంపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం వల్ల విషయం లోతుగా అర్థమవుతుంది. అర్థమైన విషయమే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి అర్థం చేసుకోవడం, ఏకాగ్రత, వేగంగా చదవడం పరస్పర ఆధారితాలు. ఇవి పవర్‌రీడింగ్‌కు ప్రాణాధారమైన అంశాలు.

పుష్కర సందేశం

పుష్కర సందేశం - జాజి శర్మ
ఈ దేశంలో పుష్కరాలంటే- ప్రజల సామూహిక ఆధ్యాత్మిక చైతన్యపు విరాట్‌ స్వరూపానికి చిరునామాలు. జాతి జీవనాడికి స్పష్టమైన ఆనవాలు. భారతీయతకు చెందిన చేవ్రాలు!
ఏ నదిలోనైనా పుష్కరాల వేళ సమస్త దేవతలూ కొలువుతీరి ఉంటారని ప్రజల విశ్వాసం. గీర్వాణ యక్షోరగ సిద్ధసాధ్య గంధర్వ విద్యాధర పూర్ణతీరే... అంటూ తీర్థాలను కొనియాడటం ఆనవాయితీ. పుష్కరుడంటే వేరెవరో కాదు, వరుణుడే! 'సకల తీర్థమయుడు... సన్మార్గ సంధాత... పుష్కరుండు చేరు పుణ్యఘడియ... పసుపు ముద్ద పులిమి పారాణి కైసేసె... తెలుగు పేరటాలు... కడలి ఆలు' అని కవి చమత్కరించడంలో ఆంతర్యం అదే. తీర్థమంటే పుణ్యస్థలం. పుణ్యపురుషులకు ఆశ్రయం కల్పించిన స్థలం తీర్థం అవుతుందన్నది మహాకవి కాళిదాసు 'కుమార సంభవమ్‌'లో చెప్పిన మాట. పుణ్య పురుషులు, రుషులు నదీతీరాల్లో విడిది చేసి, లోక కల్యాణార్థం హోమాలు చేపట్టేవారు. యజ్ఞాలు నిర్వహించేవారు. తిరిగి తమ లోకాలకు తరలిపోతూ దీక్షారూపమైన తపస్సులను వారు నదీజలాల్లో విడిచిపోతారని పురాణాలు చెప్పాయి. యాగ నిర్వహణకోసం సోమలతను నూరి, రసం తీసేందుకు నదీజలాలను వారు ఉపయోగిస్తారు(సోమార్థా ఆపః). ఆ జలాలను 'వసతీవరులు' అంటారు. యాగానంతరం మిగిలిన ఆ పుణ్యజలాలను నదుల్లో కలిపేస్తారు. ఫలితంగా నదీజలాలకు ఎనలేని ప్రభావం, పవిత్రత చేకూరతాయని పెద్దలు చెప్పారు. ఆ యజ్ఞాల్లోని హవిస్సులను స్వీకరించడానికై వివిధ దేవతలు ఆ తీర్థాల్లో కొలువు చేస్తారు. దేవతలకు ఆతిథ్యం ఇచ్చే నిమిత్తం పుష్కరుడు వచ్చి చేరతాడు. ఇదీ వరస! 'బ్రహ్మ బిందువులంతటి పావనంబులయిన వసతీవరుల్దెచ్చి అఖిల రుషులు... యజ్ఞ సంపూర్తి వేళ నీయందు గలుప... పావనోదార జలరూప వీవు...!' అని కవులు స్తుతించడంలో విశేషమదే. రుషుల దీక్షా తపస్సులు నదీజలాలకు పవిత్రత చేకూరుస్తాయని వేదం సైతం నిర్ధారించింది. ...అప్సు దీక్షా తపసీ ప్రావేశయన్‌... అప్సు స్నాతి సాక్షా దేవదీక్షా తపసీ అవన్థే... అనే యజుర్వేద మంత్రం దాన్నే వివరించింది.
ఒకో నదిలో ఏడాది చొప్పున పన్నెండు పుణ్య నదుల్లో తీర్థరాజు అనే పుష్కరుడు నివాసం ఉంటాడు. కాబట్టి ప్రతినదికీ పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. మకరరాశిలోకి దేవగురువు బృహస్పతి ప్రవేశంతో తుంగభద్రకు గత ఏడాది పుష్కరాలొచ్చాయి. పుష్కర వేళల్లో ఆ పన్నెండు నదులకూ ఒకే తరహా పవిత్రత చేకూరినప్పటికీ- ఏ నది ప్రత్యేకత దానిదే! గంగానది మాదిరిగా దక్షిణం నుంచి ఉత్తర వాహినిగా ప్రవహించడం, నేరుగా సముద్రుడితో సంగమించకుండా కృష్ణతో కలవడం... వంటివి తుంగభద్ర ప్రత్యేకతలు. తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహాత్మ్యంలో మరో అడుగు ముందుకు వేసి- నీతో సంగమం లభిస్తే సముద్రుడిక వేరే నదికేసి కన్నెత్తి చూస్తాడా? 'గంగా సంగమం ఇచ్చగించునె! మదిన్‌ కావేరి దేవేరిగా అంగీకారమొనర్చునె...!' అని ప్రశ్నించాడు. పడమటి కనుమల్లో తుంగ, భద్ర రెండుగా పుట్టి ఈశాన్యం వైపు ప్రవహించి 'తుంగభద్ర'గా అవతరించిన ఈ పుణ్యనది- శృంగేరీ శారదా పీఠాన్ని సమ్మానించింది. హంపీ విరూపాక్షుణ్ని ఆరాధించింది. రాఘవేంద్ర స్వామిని అర్చించింది. ఆంధ్రభోజుణ్ని అభినందించింది. విజయనగర సామ్రాజ్యాలను దీవించింది. ఇప్పుడు పుష్కరాల పేరుతో ప్రజల్ని విశేషంగా ఆకర్షించింది. వారి జీవనాడిని ప్రతిబింబించింది. మహర్షులు, మహాపురుషుల ఉనికి నదీతీరాలకు ఎంతటి ఉదాత్తతను ఆపాదించింది! మనిషి ప్రమేయం లేకుండానే మానవ శరీరాల్లోని జీవాణువులు ఈ గాలిలోంచి, ఈ మట్టిలోంచి, ఈ జలాల్లోంచి ఏ తరహా చైతన్య విశేషాన్ని పీల్చుకుంటున్నాయో... మానవత్వపు మహా ఇతిహాసాల సారమైన ఏ సద్గుణ వివేక సంపుటి నదీజలాలతోపాటు మన రక్తంలో ఇంకిపోతోందో... ఏకత్వ భావనను భారతీయతను మనకు అనుభూతం చేస్తోందో- స్థిమితంగా ఆలోచించి ఆకళించుకోవడం ఇక మన కర్తవ్యం. అదే పుష్కరాల సందేశం! ప్రజల మనోభావాలతో మమేకమై వారి ఆలోచనల్ని, ఆంతర్యాలను అర్థం చేసుకున్నప్పుడు ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. పండుగలనగా, తీర్థాలనగా, పుష్కరాలనగా ప్రజలకు ఎనలేని మక్కువ. అది తరతరాలుగా ప్రజల్లో జీర్ణమైపోయిన ఒకానొక సంస్కారం. భారతీయతకు చిహ్నం. జాతి సమైక్యతకు దర్పణం.

మూలము

" మరుగేలరా ఓ రాఘవా " కీర్తన వివరణ - యనమండ్ర శ్రీనివాస శర్మ

రచన : శ్రీ త్యాగరాజ స్వామి వారు
వివరణ  : యనమండ్ర శ్రీనివాస శర్మ






మధునాశిని - Get free from Diabetes

"మధు నాశిని" గురించి క్లుప్తంగా .......................
Laxman Swamy Simhachalam's photo.
సోషల్ మీడియా నష్టాలేమో కాని .నాకు మాత్రం ప్రతిక్షణం ఆత్మీయంగా ప్రోత్సాహం , ప్రేరణ నిచ్చే ఎందరో ఉత్తమోత్తమ స్నేహితులు లభించారు ..వారందరికి హార్థిక వందనాలు .....నేను గత పదేళ్లుగా అమృత నిర్గుండి అనే కషాయాన్ని నాలుగు జిల్లాల్లో లక్షలాది మందికి ఉచితంగా ఇచ్చాను ఇస్తున్నాను .....కానీ 'మధునాశిని' ఒక ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత మూలిక. సన్నని ఈతీగ క్లోమగ్రందిని ప్రభావితం చేసి ....ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది ....తమిళనాడు కేరళలో చాలామంది వాడుతున్నారు .....ఈ అమృత లత ఎంతో పరిచయమున్నదే కావటం, మా కొండగట్టు గుట్టల్లో విస్తారంగా ఉండటం ..అదేసమయంలో ...ఇది విస్తారంగా ప్రాచుర్యం పొందటం ....దీన్ని కొందరికి వాడించటం దాంతో ..వాళ్ళు షుగర్ తో పాటు, షుగర్ వ్యాధిలో కనపడే భయానక దుష్పలితాలు కాళ్ళ వాపు , దృష్టి లోపం , తిమ్మిర్లు ,నొప్పులు , కాళ్ళకు పుళ్ళు మొదలగు వ్యాధులు త్వరగా తగ్గటం, చాలా ఆక్టివ్ గా వుండటం వల్ల అందరికి మరింత ఈ మూలికపై ఆసక్తి పెరిగింది ....వందాలిది ఉచిత క్యాంపులు నిర్వహించిన నాకు ..ఒకే ఒక్క మూలిక ఇంత బాగా పనిచెయ్యటం స్వయంగా అనుభవాలు చూడటం ....ఎంతో సంతోషాన్నిచ్చింది ...వెంటనే కొదరు మిత్రుల సహాయంతో ...ఈ ఉచిత శిబిరాలు ప్రాంభించాం ....శని, ఆది వారాలు వందాలాది మంది కాల్స్ చేశారు ...హైదరాబాద్ లో చాలామంది ఫేస్ బుక్ లో చూసి కలిసిన ప్రముఖులూ ఉన్నారు ....ప్రకృతి ప్రతి వ్యాధికి ఎదో రూపంలో ఔషధాలని సిద్దంగానే ఉంచింది ..కాస్త విజ్ఞత విజ్ఞానంతో ..అనుభవంతో ..గుర్తించి బాధితులకు అందిస్తే చాలా బాగుంటుంది అని భావించాను ...ఎట్టిపరిస్థితిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ నిరపాయకర మూలిక ఎందరినో కాపాడుతుంది ...కానీ ఈమూలిక వాడుతుండగా రోజువారీగా వాడే ఏ ఔషదమైనా మానెయ్యకూడదు..వాటితోపాటే వాడుతూ క్రమంగా తగ్గించుకోవాలి ..సలహా మేరకు. దీన్ని ..రోజు ఉదయమే హెర్బల్ టీలాగా ....తాగటం ..ధన్వంతరికి ఓ నమష్కారం పెట్టుకోవటం ...చేస్తే చాలు ....ఈ మూలిక ను ఎట్టిపరిస్థితుల్లో అమ్మటం వెలకట్టటం ఉండదు ....దొరికిన౦త కాలం ఉచితంగానే ఇస్తాం ...చాలా మంది వెల ఎంతా అని అడుగుతున్నారు ...మేము దీన్ని కొనుక్కుని తేము ..స్వయంగా మేమే అడవుల్లోకి గుట్టల్లోకి వెళ్లి ...ప్రకృతి ఇచ్చిన ప్రసాదంగా తెచ్చిస్తున్నాo ...దయచేసి దీనికి వెలకట్టకండి.....చాలా రాష్ట్రాలనుండి జిల్లాలనుండి అడిగే వారికి ప్యాక్ చేసి కొరియర్లో పంపాలని ఉంది, కానీ అలా ఎందరికని చెయ్యగలం ..మీకు వీలయితో ఒక్కరన్నా వచ్చి మిగతావారికి తీసికెళితే బాగుంటుంది ....అసలే వీలుకాని వారికి అందించే ప్రయత్నం చేస్తాం .............ఇక ఈమూలికతో ఎలాంటి ప్రమాదాలు అనర్థాలు ఉండవు ...యాదృచ్చికంగా ఏది జరిగినా దీనికి ఆపాదించకండి ....ఒక్కసారి వాడి మీ అనుభవాన్ని చూడండి ..నచ్చితే కొనసాగించండి ..లేదంటే మీ ఇష్టం ....ప్రకృతి చాలా గొప్పది అది ఇచ్చే మూలికలూ గొప్పవి ..సంపూర్ణ విశ్వాసం ...నమ్మకం మిమ్మల్ని .. రోగ రహితుల్ని చేస్తుంది ....ఈ విధంగానైనా మధుమేహం మాయమవుతుందేమో....తప్పక మంచే జరుగుతూ ఉంది .................మీ ఆత్మీయ మిత్రులు ..సింహాచలం లక్ష్మణ్ స్వామి , జగిత్యాల సెల్ ........ 99 08 28 98 30 mail dr.laxmanswamy@gmail.com.
 మూలము

చిత్రకందపద్యాలు

ఛిత్రకందపద్యాలు
నాదెండ్ల పురుషోత్తమకవి " చిత్రకందపద్య రత్నాకరము" నుండి
చతుర్ముఖ కందము. ఒకేకందపద్యంలో నాలుగు కందపద్యాలు
అసలుపద్యం:
1. వనమాలిధృతవాసవ
వినుతాకరిదైత్యహరణ విశ్వవిహరణ
మునిరాట్కమలదివాకర
ధనదాపురజైత్రసర్వధర్మ వివరణా
దాగిన పద్యాలు:
2. కరిదైత్యహరణ విశ్వవి
హరణ మునిరాట్కమలదివాకర ధనదా
పురజైత్రసర్వధర్మ వి
వరణా వనమాలిధృతవాసవవినుతా
3. మునిరాట్కమలదివాకర
ధనదా పురజైత్రసర్వధర్మ వివరణా
వనమాలిధృతవాసవ
వినుతా కరిదైత్యహరణ విశ్వవిహరణ
4. పురజైత్రసర్వధర్మ వి
వరణా వనమాలిధృతవాసవ వినుతా
కరిదైత్యహరణ విశ్వవి
హరణ మునిరాట్కమలదివాకర ధనదా

అష్టముఖి :
ఒకేకందంలో ఎనిమిది కందపద్యాలు:
అసలు పద్యం
1. స్థిరమతిఁ దలఁతును మురహర
శరనినుఁ దలఁగని కరణిని జలమొగిఁ బొలియన్
గరిమము మొలఁగను బురికొను
వరములు మెలపుము తిరమయి వలయితములుగన్
దాగిన పద్యాలు:
2. మురహరశరనినుఁ దలఁగని
కరణిని జలమొగిఁ బొలియను గరిమము మొలఁగన్
బురికొను వరములు మెలపుము
తిరమయి వలయితములుగను స్థిరమతిఁ దలఁతున్
3. తలఁగని కరణిని జలమొగి
బొలియను గరిమము మొలఁగను బురికొను వరముల్
మెలపుము తిరమయి వలయిత
ములుగను స్థిరమతిఁ దలఁతును మురహరశరనిను
4. చలమొగి బొలియను గరిమము
మొలఁగను బురికొను వరములు మెలపుము తిరమయి
వలయిత ములుగను స్థిరమతి
దలఁతును మురహరశరనిను దలఁగని కరణిన్
5. గరిమము మొలఁగను బురికొను
వరములు మెలపుము తిరమయి వలయితములుగన్
స్థిరమతి మురహర
శరనిను దలఁగని కరణిని జలమొగి బొలియన్
6. పురికొను వరములు మెలపుము
తిరమయి వలయితములుగను స్థిరమతిదలతున్
మురహరశర నిను దలగని
కరణినిజలమొగి బొలియను గరిమము మెలగన్
7. మెరపుము తిరమయి వలయిత
ములుగను స్థిరమతిదలతును మురహరశరనిన్
దలగనికరణిని జలమొగి
బొలియును గరిమము మెలగను బురికొనువరముల్
8. వలయితములుగను స్థిరమతి
దలతును మురహరశరనిను దలగనికరాణిన్
జలమొగిబొలియును గరిమము
మెలగనుబురికొను వరములు మెలపుముతిరమై

మూలము

కొన్ని విశిష్టమైన శైవ క్షేత్రాలు

Vinjamuri Venkata Apparao's photo.
కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:
భైరవకోన ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.
ధర్మస్థల ::
కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.
తంజావూరు ::
తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.
దుగ్ధేశ్వరనాథ్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.
తలకాడు ::
(1)
కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.
(2)
కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.
మహేశ్వర్ ::
మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.
కోటప్పకొండ ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.
సురుటుపల్లి ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.
పోండా ::
గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.
ఖాట్మండు ::
(1)
నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.
(2)
శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.
తిరువల్లం ::
తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.
నత్తరామేశ్వరం ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.
కాళేశ్వరం ::
అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.
పృధుదక్ ::
హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.
గార్హముక్తేశ్వర్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.
శివగంగ ::
కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.
కాంచీపురం ::
ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.
పంచరామాలు ::
ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.
చిదంబరం ::
పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.
తిరువణ్ణామలై ::
'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.
శ్రీకాళహస్తి ::
శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.
శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ ::
చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.