శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం - మార్కండేయ మహర్షి విరచితం
ఈ స్తోత్రంలో నాలుగు శ్లోకాలు 'నన్ను రక్షించుగాక' అనే అర్థం వచ్చేవి, చివరి శ్లోకం 'ఫలశ్రుతి' - మొత్తం ఐదు శ్లోకాలు.

ఈ స్తోత్రంలో నాలుగు శ్లోకాలు 'నన్ను రక్షించుగాక' అనే అర్థం వచ్చేవి, చివరి శ్లోకం 'ఫలశ్రుతి' - మొత్తం ఐదు శ్లోకాలు.
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || --- 1
సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరో2(అ)వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః || --- 2
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదా2(అ)వతు |
దేవదేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః || --- 3
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు || --- 4
ఫలశ్రుతి
య ఏతద్ వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || -- 5

భావాలు:
1వ శ్లోకం
శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు. పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆస్వామి పేరును స్మరించుకుంటే) నాకు భద్రకవచమై రక్షించుగాక!
2వ శ్లోకం
వేయి తలలు - అంటే అనంతమైన శిరస్సులు గల పరమాత్ముడైన వేంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువు, అందరి ప్రాణాలకు నిలయుడు అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక!
3వ శ్లోకం
ఆకాశరాజు కూతురు పద్మావతికి భర్త అయిన వేంకటేశ్వరుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక!
4వ శ్లోకం
అలమేలు మంగమ్మ పాటి, అన్నింటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్నిచోట్లా, అన్నికాలాలలో నా సత్కర్మల నన్నింటినీ రక్షించి, వాటిని సఫలం చేయుగాక!
ఫలశ్రుతి భావం
ఈ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినము భక్తితో పఠించేవాళ్ళు మృత్యు భయం లేకుండా ఆనందంగా ఉంటారు.
లఘు వివరణ
కవచము అంటే శరీరాన్ని రక్షించే సాధనము. అది వజ్రంతో తయారయిందైతే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం భక్తుల పాలిటికి వజ్రకవచమై కాపాడుతుంది. శ్రీస్వామి వారిని శరణుపొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తీ-ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్లు అన్న ఆపదలనుండి శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు. మృత్యు భయం లేకుండా హాయిగా ఉంటారు. (మృత్యువుకంటే మృత్యు భయం గొప్పది).
(విద్వాన్ దా. పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, సప్తగిరి, ఆగష్టు 2014).
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || --- 1
సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరో2(అ)వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః || --- 2
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదా2(అ)వతు |
దేవదేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః || --- 3
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు || --- 4
ఫలశ్రుతి
య ఏతద్ వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || -- 5

భావాలు:
1వ శ్లోకం
శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు. పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆస్వామి పేరును స్మరించుకుంటే) నాకు భద్రకవచమై రక్షించుగాక!
2వ శ్లోకం
వేయి తలలు - అంటే అనంతమైన శిరస్సులు గల పరమాత్ముడైన వేంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువు, అందరి ప్రాణాలకు నిలయుడు అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక!
3వ శ్లోకం
ఆకాశరాజు కూతురు పద్మావతికి భర్త అయిన వేంకటేశ్వరుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక!
4వ శ్లోకం
అలమేలు మంగమ్మ పాటి, అన్నింటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్నిచోట్లా, అన్నికాలాలలో నా సత్కర్మల నన్నింటినీ రక్షించి, వాటిని సఫలం చేయుగాక!
ఫలశ్రుతి భావం
ఈ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినము భక్తితో పఠించేవాళ్ళు మృత్యు భయం లేకుండా ఆనందంగా ఉంటారు.
లఘు వివరణ
కవచము అంటే శరీరాన్ని రక్షించే సాధనము. అది వజ్రంతో తయారయిందైతే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం భక్తుల పాలిటికి వజ్రకవచమై కాపాడుతుంది. శ్రీస్వామి వారిని శరణుపొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తీ-ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్లు అన్న ఆపదలనుండి శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు. మృత్యు భయం లేకుండా హాయిగా ఉంటారు. (మృత్యువుకంటే మృత్యు భయం గొప్పది).
(విద్వాన్ దా. పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, సప్తగిరి, ఆగష్టు 2014).
No comments:
Post a Comment