Friday, March 20, 2015

వదిలేయమంటారా ??

రోజూ అందరూ ఇక్కడ రామాయణ,భారతాలు, సనాతన గ్రంధాలు, పురాణాలు, దేవుని కధలు ...ఇత్యాదివాటిపై నిప్పులు చెరుగుతున్నారు కదా ... చాలామంది ఆనాటి కాలపు పురాతన ఆచారాలు నేడు పాటిస్తావా అని ప్రశ్నిస్తున్నారు కదా.. వారు ఈ అజ్ఞానికి ఒక్క సలహా ఇవ్వగలరు.
-----------------------------------------------------------------------------
మీరంటున్న అవే పుక్కిట పురాణాల నుండి నేను నేర్చుకున్నవి కొన్ని ఉన్నాయి.
మరి వాటిల్ని వదిలేయమంటారా??

౧) పెద్దలను గౌరవించుట (రాముని చూసి)
౨) వదినని తల్లిగా గౌరవించుట/భావించుట ( లక్ష్మణుని చూసి)
౩) తమ్ముడు అనుబంధం ఎలా ఉండాలో నేర్చుకున్నా (భరతుని చూసి)
౪) పరాయి స్త్రీ ని కామిస్తే ఎంత గొప్పవాడైనా మట్టి కరుస్తాడు అని తెలుసుకున్నా (రావణ బ్రహ్మ ను చూసి )
౫)ధర్మానిదే తుది గెలుపు అని చూసి నేర్చుకున్నా
౬)బంటు/సేవకుడు ఎలా ఉండాలో నేర్చుకున్నా
7)౭ బాధ్యత ఎలా నిర్వర్తించాలో నేర్చుకున్నా
8)౮ వెళ్తున్న మార్గం మంచిదైనప్పుడు ఎవరెన్ని చెప్పినా ఆ మార్గమును వీడకూడదన్నది నేర్చుకున్నా (ప్రహ్లాదుని చూసి)
9)౯ గొప్పతనం అనేది బాధ్యతను నిర్వర్తించటంలో ఉన్నదని తెలుసుకున్నా
10)౦౧ మంచిదే పై చేయి అని తెలుసుకుని చెడు సావాసాల జోలికి పోకూడదని నేర్చుకున్నా
11)౧౧ నా జీవితాన నేటి వరకు నలుగురిలో నాకు పేరు తెచ్చిపెట్టిన ప్రతీ సంధర్భం నాకు పురాణాలు పెట్టిన భిక్ష
1౧౨) జూదం లో మునిగితే నువ్వెంత గొప్పవాడివైనా , ఎంత గొప్ప జూదరి వైనా అన్నీ మరచి అధ:పాతాళానికి పోతావని మాయాజూదాన్ని చూసి తెలుసుకున్నా
౧౩) కష్టాలొచ్చినా కుంగిపోక , ధర్మమార్గమును వీడక ముందడుగు వేయాలని నేర్చుకున్నా
౧౪) ఏ పరిస్థితుల్లోనైనా ఆలిపై చేయి చేసుకోరాదని, తన వారిని వదిలి నాతో జీవితాన్ని పంచుకోవటానికి వచ్చిన ఆమెను అన్ని వేళలా తోడుగా ఉండాలని నేర్చుకున్నా.
౧౫) సన్మార్గం ఎంత ఉన్నతమైనదో తెలుసుకున్నా
౧౬) పుట్టుకని బట్టి కాదు గుణాన్ని, చేసే పనిని , వాడి సంస్కారాన్ని బట్టి వాడి వర్ణం లెక్క వేయాలని నేర్చుకున్నా (చాతుర్వర్ణాం మయా సృష్టం గుణ కర్మ విభాగస:) [అంటే భేదం చూపడానికి కాదు]
17)౭౧ ప్రతి జీవిలోనూ పరమాత్ముడున్నాడని తెలుసుకుని అన్నిటినీ సమానంగా చూడడం నేర్చుకున్నా
౧౮) జన్మనా జాయతే సూద్ర: సంస్కారేన జాయతే ద్విజ: అన్న సూత్రం ప్రతి మనిషికీ వర్తిస్తుందని తెలుసుకున్నా.
19)౯౧ విచక్షణ, విశ్లేషణ నేర్చుకున్నా
౨౦) నీ ప్రయత్నం నీవు చేయనిదే లాభం ఏం ఉండదు.
౨౧) వక్రవ్యాఖ్యానాల జోలికి అసలు పోకూడదు అని తెలుసుకున్నా

"గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం"" అన్న చందాన ప్రవర్తించకూడదు ,
కష్ట పడడం వరకు మనచేతిలో ఉంటుంది . ఫలితం మన చేతుల్లో ఉండదు అన్న విషయాన్ని అర్ధం చేసుకున్నా
______________________________
పాత మట్టి చిప్ప తినడానికి పనికిరాకపోవచ్చు కానీ లెక్కలేనంత విలువ చేస్తుంది (పురాతన వస్తువు)
ఇవన్నీ స్వతహాగా తెలుసుకోలేని మూర్ఖుడను , పురాణాలలోని వాటిని ఉదాహరణలుగా తీసుకుని చిన్నప్పటి నుంచి నన్ను(సాధారణంగా ప్రతి ఇంటిలోనూ అంతే) పెంచారు .
నన్ను ఏం చేయమంటారు మరి??
సుష "సౌ"రభాలు #సుషస్వరాలు

Tuesday, March 17, 2015

మన పురాణాలు - శాస్త్రీయత

మన పురాణాలు ఎంతో శాస్త్రీయమైనవి. ప్రాచీన ఋషులు గొప్ప వైజ్ఞానికులు.. ఈమాటంటే , నమ్మని వారు , అదెలా ? అని అడగొచ్చు కానీ , వారికి తెలిసిందీ , వారు విన్నదీ , వారికి నచ్చిందీ తప్ప మిగిలినవన్నీ చెత్త అని పరిహాసము చేయుట , " వారు నేర్చినది వారికేమి నేర్పినదో " తెలుపుతుంది, అంతే..
ఉదాహరణకు , మనస్సును గురించి పురాణాలలో అనేకచోట్ల ఎలా వర్ణించారో చూడండి,
" మనస్సు కు అధిదేవత చంద్రుడు. మనస్సును ప్రేరేపించునవి మోదుగ వంటి సమిధల హవనపు ధూమము. "
నవగ్రహమంత్రాలలో చంద్రునికి సంబంధించిన మంత్రము , " ఆప్యాయస్వ సమేతుతే... " అనేది. అంతే కాదు , పంచామృతాలలో పాలతో అభిషేకం చేసేటప్పుడు చెప్పే మంత్రము కూడా అదే !! అంటే , చంద్రునికీ , పాలకూ ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.. మరి చంద్రుడు పుట్టింది పాల సముద్రములోనే కదా ?
పద్మ పురాణములో , " శివుడు మనో నియామకుడు " అనీ , " విష్ణువుపై మనస్సును నిలుపునట్లు చేసేవాడు శివుడు " అనీ ఉంది.
మన మనస్సు మన ఆధీనములో ఉండదు. దాని ఇఛ్చవచ్చినట్టు పరుగెడుతుంది. శివుడు మనో నియామకుడైనప్పుడు , మనసు శివుని నియంత్రణలో ఉంటుందే కానీ మన ఆధీనములో ఎందుకుంటుంది?, అందుకే , మనకు చిత్తశుద్ధి, మంచి బుద్ధీ కలగాలంటే ఆ శివుడినే వేడుకోవాలి. శివుడికి క్షీరాలాభిషేకం చేసేది అందుకే..
మనస్సును , దాని అధిదేవతనూ , మనో నియామకుడినీ , మనసును ప్రభావితం చేసే పదార్థములనూ ఇంతగొప్పగా అనుసంధానము చేసి చెప్పే పు

Friday, March 6, 2015

నిర్భయ మీద డాక్యుమెంటరీ - by విభాతమిత్ర

నిర్భయ మీద డాక్యుమెంటరీ

నిర్భయ మీద డాక్యుమెంటరీ

చాలామంది, ఆ డాక్యుమెంటరీ లో తప్పేముంది ? నిజాలే కదా ? మనోభావాలను దెబ్బతీయలేదు కదా ? వాస్తవాలను అంగీకరించక, బ్యాన్ చేస్తే ఉపయోగమేమి ? అని అడుగుతున్నారు.

అయ్యా, మాంసము తింటారు కదా అని ఎవరూ ఎముకలు మెడలో వేసుకొని తిరగరు.  ఎందుకు తిరగరంటే అదొక సంస్కారము.

ఆ డాక్యుమెంటరీ తీసినావిడ తన పద్ధెనిమిదేళ్ళ వయసులో మాన భంగానికి గురయ్యిందట . చాలా యేళ్ళు ఆత్మ న్యూనత తో బాధపడిందట. నిర్భయ కేసు , స్పందనలూ చూసి , ధైర్యము వచ్చి , తన తప్పేమీ లేదని గ్రహించి , అటువంటి కాముకుల మనస్తత్త్వాలు ఎలాగుంటాయో కనుక్కుందామని వచ్చిందట.
ఆమె ఉద్దేశం బాగున్నా , ఇక్కడికే ఎందుకు రావాలి? మెడ అటూఇటూ తిప్పి చూస్తే కాముకులు అక్కడే ఎక్కువ కనపడరా ? అంటే , నిర్భయ కేసును ఉపయోగించుకొని , శవం మీద మరమరాలు ఏరుకొనే ఉద్దేశమే కదా ?  రామ్ గోపాల్ వర్మ 26/11 సంఘటనలో ఆ ప్రదేశాన్ని దర్శించుట కూడా అదే ఉద్దేశంతోనే కదా ?  అంతే కాదు , భారత్ ను తక్కువ చేసి చూపించే ప్రయత్నమే ముఖ్యోద్దేశంగా కనబడుతుంది. దాన్ని కప్పిపుచ్చటానికి,  నిజమో కాదో తెలీని తన అనుభవాన్ని అడ్డుపెట్టుకోవటమొకటి.
పైగా , ఆ డాక్యుమెంటరీ తీసేందుకు ఒప్పుకున్న షరతులను ఉల్లంఘించి బీబీసీ కి అమ్ముకుంది.

సరే , దాన్ని చూస్తే తప్పేమి , ఎందుకు బ్యాన్ చేయాలి?

పైన ’ సంస్కారం ’ గురించి ఉటంకించాను.

అంటే అదిచూస్తే మన సంస్కారాలు పాడవుతాయా ? అందరూ రేపిస్టులవుతారా ?

" అ.ను.మా.న.మా ? "

" ఎలా ?"

ఇక్కడే అందరూ అయోమయానికి లోనవుతుంటారు. ఏవో కొన్ని చూసినంత మాత్రానో , చదివినంత మాత్రానో , అవి మనల్ని ప్రభావితం చేస్తాయా ?
 అది అర్థం చేసుకోవాలంటే మొదట సంస్కారాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవాలి.
ప్రతి మనిషికీ అయిదు రకాల సంస్కారాలుంటాయి. ఈ  అయిదింటిలో ఏది / ఏవి బలంగా ఉంటే మనిషికి ఆ ప్రవృత్తులొస్తాయి.

మొదటగా , మానవులందరికీ పుట్టుకతోనే , వచ్చే ఆత్మ సంస్కారము. అది అందరికీ సమానముగా ఉంటుంది.. ఏది మంచి , ఏది చెడు అర్థం చేసుకో గలిగే సంస్కారము.
రెండోది, పూర్వ జన్మ వాసనల వల్ల వచ్చేది. దీని వల్లనే కొందరికి దొంగతనమంటే అసహ్యము , కొందరికి మక్కువా. మనం ఈ రెండింటి గురించి ఏమీ చేయలేము. ఎలా వచ్చినదాన్ని అలా స్వీకరించడమే. అయితే , ఇవే మన ప్రవర్తనలను నిర్దేశిస్తాయి అని చెప్పుటకు వీలు లేదు. మిగిలిన మూడూ చాలా ముఖ్యమైనవి. వాటిని నియంత్రించ వచ్చు తద్వారా సంస్కారాలనూ , ప్రవర్తననూ మెరుగుపరచవచ్చు.

మూడోది, తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారము. ఇది ఇంటినీ , ఇంట్లోని ఆచారాలనూ , తల్లిదండ్రుల ప్రవర్తననూ బట్టి వచ్చేది. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. వారినుండీ పిల్లలు ఎన్నో చూసి, గమనించీ నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. అందుకే పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పూజలూ , ప్రార్థనలూ అనుష్ఠానాలు చేసేది.

నాలుగోది, వ్యక్తి ఇఛ్చాశక్తి అంటే విల్ పవర్ నుండీ వచ్చేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా , దేన్నో చూసి ప్రేరణ పొంది , లేదా , యే గురువుగారినుండో ఉపదేశము పొంది,  ’ తనకు అది దొరకాలంటే  తాను ఇలాగుండాలి," అని గట్టిగా నిర్ణయించుకోవడము. అలాగే ప్రవర్తించడము. ఈ నాలుగోది కూడా మనిషి ప్రవర్తనకు ఒక కారణము.

ఇక , అయిదోది , ఇదే మనకు ప్రస్తుతము అయోమయాన్ని కలిగిస్తున్నదీ , రకరకాల వివాదాలకు కారణమవుతున్నదీను. అదే , పరిస్థితులూ , స్నేహితులూ , చుట్టూ ఉన్న వాతావరణపు ప్రభావము. దీన్ని కొంచం వివరంగా తెలుసుకోవలసిన అవసరముంది.

మనం ఏదైనా చూసినప్పుడో , చదివినప్పుడో , కొన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి [ ఈ ఆలోచనలకు కారణము ,కొంతవరకూ పైని మూడు సంస్కారాలే] . ఆ ఆలోచనలు ఊరికే వచ్చి పోతే ఫరవాలేదు , కానీ వాస్తవంలో అలా జరగదు. ఆ వచ్చిన ఆలోచనలు ఏదో ఒక అనుభూతిని కలిగిస్తాయి. అది సంతోషమో , కోపమో , కామమో ,  ఇంకేదో కావచ్చు. అటువంటి ఆలోచనలే పదే పదే వచ్చినపుడు , మళ్ళీ మళ్ళీ అవే అనుభూతులు కలుగుతాయి. అవి అలా మరలా మరలా కలగడము వలన వాటి ముద్రలు [ ఇంప్రెషన్ ] మనమెదడులో పడి, మనకొక ’ ధోరణి ’[ Attitude ] కలుగుతుంది. ఆ ధోరణికి తగినట్టే మనం ఇతరులతో వ్యవహరిస్తాము. మన ప్రవర్తన ఆ ధోరణిని బట్టే ఉంటుంది. మన ప్రవర్తన నుండీ మనం ఇతరులకు తదనుగుణమైన ఒక శక్తి , అంటే ’పాజిటివ్ ఎనెర్జీ’ లేక ’నెగెటివ్ ఎనెర్జీ ’ ని ప్రసారం చేస్తాము. వారు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది వారి సంస్కారాలను బట్టి ఉంటుంది.

మొత్తానికి మన ప్రవర్తనకు కారణము మన ధోరణి, ధోరణికి కారణము మన ఆలోచనలు , ఆలోచనలకు కారణము మనము చూసినవీ , చదివినవీ , విన్నవీ. వాటిని ఎన్నిసార్లు చూస్తే / చదివితే / వింటే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి ? అన్నది , మనిషి మనిషికీ మారుతుంది. ఇతర సంస్కారాలు గట్టిగా ఉంటే , ఆ ఆలోచనలు ఏమీ చేయలేవు. కానీ ఎవరి సంస్కారము ఎంత గట్టిదో ఎవరు చెప్పగలరు ? అందుకే చెడు వినవద్దు , చూడవద్దు , కనవద్దు అన్న సూత్రాన్ని మహాత్మా గాంధీ అంతగా నమ్మి మూడు కోతిబొమ్మలను తన దగ్గర ఉంచుకున్నది !

ఇప్పుడు చెప్పండి, వాటిని[ చెడు విషయాలను ] చూడటం మంచిదా ?

Thursday, March 5, 2015

సహజ సిద్ధమైన హోళీ రంగుల తయారీ...

ప్రజాసంక్షేమార్ధం "సేకరించి" ఈ విషయాన్ని
జారీచేస్తున్నవారు smile emoticon smile emoticon ...............................మూర్తి ™
హోలీ రంగులు సహజ" సిద్ధం" గా... హెల్దీ హోలీ - హేపీ హోలీ
పసుపు
ఇది చాలామందికి తెలిసిన చిట్కా. పసుపుపొడిని నీళ్లలో కలిపితే చాలు. అవి చిక్కగా, పెద్దమొత్తంలో కావాలంటే ఆ నీళ్లలో శనగపిండి కలుపుకోవాలి. ఆ ద్రావణంతో స్నానం ఎంతో ఆరోగ్యకరం. పసుపు యాంటిబయాటిక్గా పనిచేస్తుంది. శనగపిండి మనశరీరంపై పట్టి మట్టిని శుభ్రం చేస్తుంది. సాధారణంగా నలుగుపెట్టుకోవడానికి ఈ పిండినే వాడతారన్నది అందరికీ తెలిసిందే. దీనికి కాస్త రోజ్వాటర్, కస్తూరి దట్టిస్తే ఇక ఆ సువాసన మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ శనగపిండి ఇష్టం లేదనుకోండి...మైదా, గోధుమ, వేరుశనగ పొడినీ వాడుకోవచ్చు. లేదంటే పసుపుచామంతి, పసుపు బంతిపూలు, తంగేడు పూల పొడిని నీళ్లలో కలుపుకోవచ్చు. ఈ పూలపొడిని లేదా పూలను నీళ్లలోవేసి మరగబెడితే రంగు స్పష్టంగా కన్పిస్తుంది.
ఎరుపు
ఎర్రచందనం పొడిని, ఎర్ర మందార పువ్వుల పొడిని ఎర రంగుకోసం వాడుకోవచ్చు. ఈ పొడికి మన ఇళ్లలో ఉండే ఏ పండిని కలిపినా పెద్దమొత్తంలో రంగును సిద్ధం చేసుకోవచ్చు. సింధూరపళ్లతోనూ ఎరుపురంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎర్ర దానిమ్మ గింజలు, లేదా తొక్కలను నీళ్లలో మరగనిస్తే ఎర్రటిరంగునీళ్లు సిద్ధం అవుతాయి. రాత్రంతా ఎర్రమందార పూలను నీళ్లలో నానబెట్టి ఆ తరువాత వేడిచేస్తే చక్కటి ఆరోగ్యకరమైన ఎర్రటినీళ్లు సిద్ధమవుతాయి.
కాషాయరంగు
మోదుగ పూలతోకూడా కాషాయ రంగు నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు మోదుగపూలతో తయారుచేసిన రంగునీళ్లతోనే హోలీ ఆడాడని పురాణాలు చెబుతున్నాయి.. ఎండబెట్టిన మోదుగ పూలను, వాటి బెరడునుకూడా రంగుల తయారీకి వాడుకోవచ్చు.
నీలిరంగు
నీలి మందార పూలు, నీలిరంగులో మెరిసిపోయే జకరందా పూలతో పొడిని తయారు చేసుకోవచ్చు.
మెజంటా
బీట్రూట్ ముక్కలను రాత్రంతా నీళ్లలో నాననివ్వండి, పొద్దునే్న వాటిని మరిగించండి. చక్కటి మెజంటా రంగులో నీళ్లు సిద్ధం. ఇక ఎర్ర ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో రాత్రంతా నాననివ్వండి. పొద్దునే్న ఆ ముక్కల్ని తీసిపారేయండి. నీళ్లుమాత్రం ఎర్రగా మెరుస్తూంటాయి.
నలుపు
రాసి ఉసిరికాయలు, మామూలు ఉసిరికాయలని ఇనుపగినె్నలో మరిగిస్తే నల్లని నీళ్లు సిద్ధమవుతాయి. చల్లారాక వాటిని రాత్రంతా నిల్వ ఉంచితే పొద్దున్నకల్లా మరింత నల్లగా తయారవుతాయి. వాటివల్ల ఆరోగ్యంకూడా బాగుంటుంది. ఇక నల్లని ద్రాక్షపళ్ల గుజ్జును నీళ్లలో కలిపితే నల్లనిరంగు నీళ్లు తయారవుతాయి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. ఇక మందార ఆకుల పొడి, రంగురంగుల క్యాబేజీలు, క్యారెట్లు, బీర ఆకుల పొడి, గుమ్మడి గుజ్జుతోకూడా రంగరంగుల నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. గోధుమరంగు
కిళ్లీలో ఎర్రటి రంగుకోసం వాడే కాసు - ఆ బెరడును నీళ్లలో మరగనివ్వాలి. దానికి కాస్త కాఫీ ఆకులు కలిపితే మంచివాసన, మంచి రంగు పడతాయి.
ఆకుపచ్చ
పొడిరంగు కావాలనుకుంటే గోరింటాకుల పొడిని, కాస్త మైదా, లేదా వరి పిండిలో కలుపుకుంటే చాలు. దీనికి ఎట్టిపరిస్థితిలోనూ నిమ్మరసం కలపొద్దు సుమా. అది కలిస్తే వచ్చే ఎరుపురంగు వచ్చేసి ఓ పట్టాన వదలదు. గుల్మొహర్ పూలనుకూడా ఎండబెట్టి పొడిచేసి ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు. గోధుమగడ్డిని ముద్దచేసి నీళ్లలో కలిపితే అదికూడా ఆకుపచ్చరంగులోనే ఉంటుంది. పుదీనా ఆకులనూ ముద్దగా నూరి నీళ్లలో కలిపితే ఆకుపచ్చరంగునీళ్లు సిద్ధం. పైగా ఇవి మంచి వాసననూ కలిగి ఉంటాయి. టమాటా, కొత్తిమీర ఆకులనూ ఇలా ముద్దగా చేసి నీళ్లలో కలపొచ్చు. గోరింటాకు పొడిని నీళ్లలో కలిపితే అవీ ఆకుపచ్చగా కన్పిస్తాయి.
ఓపిక లేని వాళ్లు ఈ ప్రకృతి ప్రసాదించిన పళ్లు, పూలు, కూరగాయలు, ఆకులతో తయారైన పొడిని అమ్మే ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి సరసమైన ధరలకు కొనుగోలు చేసుకోవచ్చు.
google _/\_

Wednesday, March 4, 2015

సంస్కారము ఎలా అబ్బుతుంది ?

సంస్కారము. సంస్కారము దేని వలన అబ్బుతుంది? పూర్వ జన్మల వాసనలను బట్టి. పూర్వ జన్మల వాసనలు బట్టి త్రిగుణాల సమ్మేళనం వుంటుంది. దాని నిష్పత్తి మారుతూ వుంటుంది. మరి ఈ జన్మలో మంచి సంస్కారం అబ్బ లేదు. పోయిన జన్మలో మంచి కర్మ, పుణ్య కార్యం చేయ లేదు. కావున ఈ జన్మలో మంచి బుద్ధి రాలేదు. మంచి రాత రాలేదు. మంచి సంస్కారం లేదు కాబట్టి, ఈ జన్మలో కూడా మంచి పని చేయడానికి బుద్ది రాదు, మనసు రాదు. కాబట్టి వచ్చే జన్మలో కూడా మంచి సంస్కారం రాదు. ఇది ఇలాగే కొనసాగిపోతుంది.
మరి ఏలాగ? ఉద్ధతి ఏలాగ ఈ జీవికి? బాగు పడడానికి మార్గం లేదా?
వున్నది.
సత్ స్సాంగత్యం. మహా పురుషుల మాటలు బలవంతంగానైనా విని తీరాలి. ఏందుకంటే మన మనస్సు వినదు మంచి మాటలు. గురువులు చెప్పే ప్రవచనాలు వినదు! పైగా దేవుడు వున్నాడా? అని ప్రశ్నిస్తుంది? పైశాచిక సిద్దాంతాన్ని లేవదీస్తుంది, వితండ వాదం చేస్తుంది, అంతా చాదస్తం, మూఢ నమ్మకాలు అని మన చేత అనిపిస్తుంది. దేవున్ని, ధర్మాన్ని నమ్మదు. గురువుల మాట చెవి కేక్కించుకోదు. ఓక గుడికి పోదాము అని వుండదు. మంచి మాటలు తలకేక్కవు.
ఇక్కడే జాగ్రత్తగా వుండాలి. ఇక్కడే మనకు మన పురాణాలు, వేద వాంజ్ఞ్మయం అక్కరకు వస్తుంది. మన పెద్దలు, గురువులు ఆచరించి చేసి చూపించి వున్నారు. కళ్లు మూసుకొని గ్రుడ్డిగా వారి మార్గంలో బలవంతంగానైనా సరే మనసు మార్చుకొని నడవడమే. నీ తల్లి నీకు చెడు చెప్పదు. నీ తండ్రి నీకు అబధ్ధం చెప్పడు. నీ గురువులు నీకు అధర్మం భోధించరు. మరి నీకు ఏందుకు అప నమ్మకం. అనుసరించు భక్తి మార్గంలో పెద్దలు చెప్పినట్లు. సత్ స్సాంగత్యం ఏర్పర్చుకో. మహా పురుషులు పుట్టిన నేల ఇది. మహా వాక్యములు విను. ప్రవచనాలు విను. రామాయణ, మహాభారతాది గ్రంధములను చదువు. ఈ జన్మలో నీ బాట మార్చుకో. నీ మార్గం మార్చుకో. సన్మార్గంలో నడువు. వచ్చే జన్మకు నీ వాసనలు మార్చుకో. అంతే మంచి సంస్కారం, మంచి పుట్టుక, మంచి బుద్దులు, మంచి తల వ్రాత లభిస్తుంది. కావలసినది నిన్ను అరిచి తగవులాడి, నాలుగు తన్ని నీ మార్గాన్ని మార్చే గురువు కావాలి. నీ పాపాన్ని హరించి వేసే గురు దేవుళ్లు కావాలి అంతే. పరమ భాగవత్తోత్తములు పుట్టిన నేల. గొంతు చించుకొని కష్టపడి అరిచి, ప్రాణం అడ్డుగా పెట్టి ప్రవచించే పరమ గురువులు, ఆది గురువులు పుట్టిన నేల ఇది. చేయవలసినదంతా వారి అడుగు జాడలలో నడవడమే. నేను వినను అంటే ఏలాగ?
మరి నడుద్దామా! ..........