Tuesday, August 5, 2014

గురివింద గింజ వాదనలు

గురివింద గింజ వాదనలు
ఇప్పుడే మిత్రులు శ్రీ దొడ్డా రాంబాబు గారు "భగవద్గీత " లోని అంశము ఒకటి ఉటంకింపు చేస్తూ, శ్రీ కృష్ణ పరమాత్మను అవహేళన చేస్తూ,అది కులగజ్జి బోధిస్తోంది అని, అది పాఠ్యంశముగా ఎలా చేస్తారని, హిందు వ్యతిరేక శక్తులు ప్రస్నిస్తున్నాయని, ఒక విషయము నా దృష్టికి తీసుకు వచ్చారు. గీతను సమగ్రంగా అర్ధం చేసుకోలేని వారు పేలే అవాకులకు చేవాకులకు భగవద్గీత చదువుకోమనే సమాధానం. అలా కాకుండా ఇంకా మతమౌడ్యముతోనే అంధకారంలో ఉంటే, వెలుగులోకి రమ్మని ఆహ్వానించండి. అయితే వారి ఇవి పరిశీలించి అవి పోగొట్టుకోనమని చెబుదాం.
మనం తరచుగా వింటుంటాం...హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్తవాలు చూడండి..మీకే అర్థం అవ్తుంది.
గమనిక: ఇది ఏ మతాన్ని కించపరుచుటకు కాదు. కేవలం హిందువుల ఐక్యతను తెలియజేయుటకు మాత్రమే !
క్రైస్తవం:
...
ఒక క్రీస్తు
ఒక బైబిలు
ఒక మతం
కాని ఇది తెలుసా?
లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.
ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.
ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.
ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !
=======================
ముస్లింలు:
ఒక అల్లహ్
ఒక ఖురాన్
ఒక ప్రవక్త
గొప్ప ఐక్యత...!
ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !
మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !
సున్నీ మసీదుకు షియా వెళ్ళడు.
ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.
ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు.
ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు.
ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.
=========================
హిందువులు:
1280 ధర్మ గ్రంథాలు,
10,000 భాష్యాలు,
ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,
ముక్కోటి దేవతలు,
భిన్నమైన ఆచార్యులు,
వేలాది ఋషులు,
వందలాది భాషలు.
కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.

Monday, August 4, 2014

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం - మార్కండేయ మహర్షి విరచితం

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ  స్తోత్రం - మార్కండేయ మహర్షి విరచితం

Paritala Gopi Krishna's photo.
































ఈ స్తోత్రంలో నాలుగు శ్లోకాలు 'నన్ను రక్షించుగాక' అనే అర్థం వచ్చేవి, చివరి శ్లోకం 'ఫలశ్రుతి' - మొత్తం ఐదు శ్లోకాలు.
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || --- 1
సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరో2(అ)వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః || --- 2
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదా2(అ)వతు |
దేవదేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః || --- 3
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు || --- 4
ఫలశ్రుతి
య ఏతద్ వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || -- 5
Paritala Gopi Krishna's photo.
































భావాలు:
1వ శ్లోకం
శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు. పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆస్వామి పేరును స్మరించుకుంటే) నాకు భద్రకవచమై రక్షించుగాక!
2వ శ్లోకం
వేయి తలలు - అంటే అనంతమైన శిరస్సులు గల పరమాత్ముడైన వేంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువు, అందరి ప్రాణాలకు నిలయుడు అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక!
3వ శ్లోకం
ఆకాశరాజు కూతురు పద్మావతికి భర్త అయిన వేంకటేశ్వరుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక!
4వ శ్లోకం
అలమేలు మంగమ్మ పాటి, అన్నింటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్నిచోట్లా, అన్నికాలాలలో నా సత్కర్మల నన్నింటినీ రక్షించి, వాటిని సఫలం చేయుగాక!
ఫలశ్రుతి భావం
ఈ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినము భక్తితో పఠించేవాళ్ళు మృత్యు భయం లేకుండా ఆనందంగా ఉంటారు.
లఘు వివరణ
కవచము అంటే శరీరాన్ని రక్షించే సాధనము. అది వజ్రంతో తయారయిందైతే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం భక్తుల పాలిటికి వజ్రకవచమై కాపాడుతుంది. శ్రీస్వామి వారిని శరణుపొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తీ-ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్లు అన్న ఆపదలనుండి శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు. మృత్యు భయం లేకుండా హాయిగా ఉంటారు. (మృత్యువుకంటే మృత్యు భయం గొప్పది).
(విద్వాన్ దా. పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, సప్తగిరి, ఆగష్టు 2014).