Sunday, May 10, 2015

facts of fast food

దయచేసి షేర్ చేయండి..........కనీసం చదవండి..........ప్లీజ్............ఇలాంటి పోస్టింగ్స్ వల్ల ఒక్కరైనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నమ్మకంతో...........

దినేష్ అనే వ్యక్తి తన మాటలతో నిజాలను చెప్పి ....తను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరెవరూ పోగొట్టుకోకూడదని భావించి తాను చేసిన తప్పిదాలను మనకు తెలియజేశారు.......

దినేష్ అనే వ్యక్తి .ఫాస్ట్ ఫుడ్డు సెంటర్ నిర్వహించిన ఓ యజమాని.......5 నిమిషాలలో 400 రూ; సంపాదించేవాడు.......తనకు జరిగిన ఓ సంఘటననే
అతని నోటివెంట నిజాలను చెప్పించింది......తాను చేసిన ఆహారాన్ని తానేతిని
చాలా అనారోగ్యంతో ఇలా చేప్పాడు........అతను చెప్పిన నిజాలు ఇవి.......

1.ఫాస్టు ఫుడ్డు షాపులో వాడే చికెను తాజా అయినది కాదు.. . ....నిన్నటిది......మొన్నటిది........ఒక్కోసారి ఒకవారం క్రితంవి కూడా వాడుతాము.
చెడిపోయిన చికెనును వెనీగరులో ముంచి వాటి వాసన కస్టమర్లకు
తెలియకుండా చేస్తాము.

2.చికెను రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెనుకు ఆరెంజ్ కలరును
వాడి రంగును మారుస్తాము.......ఆ కలరును మీ చేతిలో వేసుకుని ఒక నిమిషం
తరువాత కడిగితే ఆ కలరు వారం రోజులవరకు పోదు......అలాంటి కలరు మీ
కడుపులోకి పోతే........

3.సోయా సాస్ ....రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ,,,,,,,10 రోజుల క్రితం
కాగి కాగి మరరిగిన నూనెతో కలిపి వాడుతాము........

4.ఏ షాపులోనూ మంచి నూనె వాడరు...పామాయిలు తప్ప ఏదీ వాడరు....

5.కళాయిలో అన్నం అంటుకుపోకుండా,ఎక్కువగా పామాయిలును వాడి,
తొందరగా,లేటు లేకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తాము,,,,,,,,,

6. చెపితే నమ్మరు.........ఆ కళాయిలను రోజుల తరబడి కడగనే కడగము........\
నూనే జిడ్డుపోయి మళ్ళీ లేటు అయితే పక్క షాపుకు వె్ళ్ళిపోతారని........
I
7. అజినోమోటో అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు...........మేము దాన్ని
చాలా ఎక్కువగా వాడుతాము.......మీరు ఒక్కసారి దాన్ని మీ నాలుక మీద
పెట్టుకుని చూడండి మీ కే తెలుస్తుంది......

8. తెల్ల మిరియాలపొడి లో చేతికి దొరికిన పిండిని కలిపి వాడుతాము......ఆ పిండిలో
పురుగులు కూడా ఉంటాయి.......

9.టొమాటో సాస్ .......ఎక్కువమోతాదులలో కొనిపారేస్తాము.........అందువల్ల
అవి చెడిపోయినా,,,,,,,,,exp.date అయిన వాటిని కూడా వాడేస్తాము..

10.చిల్లీ సాస్ .....వాడుతున్న బాటిలును మీ ముక్కుదగ్గర పెట్టుకుని చూడండి.
ఆ వాసనకు మీకు వాంతులు రాక మానవు......

5 నిమిషాలలో 8 ప్లేట్లు అందిస్తాము........ఒక్కొక్క ప్లేటు 50 రూ......అంటే
5 నిమిషాలలో 400 సంపదించేవాడిని....కానీ డబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నానే కానీ నేను నా పిల్లలు కూడా అవి తిని చాలా అనారోగ్యంతో
బాధపడుతున్నాము..........చేసిన తప్పును చెప్పుకుని మీలో కొంతమందిలో
అయినా మార్పు రావాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ......తప్పుకు శిక్ష అనుభవిస్తూ.........8,000 జీతానికి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను...........ఆ ఫాస్టుఫుడ్డు సెంటరును మూసేసి ఇలా నిజాలను మనకు చెప్పి..........కనీసం మనలో కొందరైనా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని

మూలము 

ఆదిశంకరులు – ఐదు అశ్రుకణాలు ( మాతృదినోత్సవ సందర్భంగా)

From Shri కొంపెల్ల రామకృష్ణమూర్తి Time Line
ఆదిశంకరులు – ఐదు అశ్రుకణాలు
( మాతృదినోత్సవ సందర్భంగా)
శంకరుల అద్వైతప్రచార జైత్రయాత్ర అప్రతిహతంగా జరుగుతోంది. కాలటిలో ఆర్యాంబ మరణ శయ్యపై ఉంది. ఆమె శంకరులను స్మరించింది. ఎంతో దూరంలో ఉన్న శంకరులకు ధ్యానం చెదరింది. ఇది ఏ తర్కానికీ అందని స్పందన. తల్లి అవసాన దశలో ఉన్నట్లు గ్రహించారు. యోగశక్తితో వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, తత్త్వోపదేశం చేసి సద్గతిని కలిగించారు. ఆమెకు ఉత్తరక్రియలు ఆయనే చేయవలసి వచ్చింది.
ఆ సందర్భంలో ఆయన చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధాలు. అంతటి జగద్గురువు, పరమేశ్వరాంశ, లోకానికి దుఃఖ నివృత్తిమార్గం చెప్పిన అద్వైతసిద్ధాంత ప్రతిష్ఠాత - మాతృమూర్తి మృతికి స్పందించిన తీరు అనిర్వచనీయం. "విరాగికి రాగమేమిటి ?" అనే తర్కానికి ఇక్కడ తావులేదు. ఆ మహామహుడు మాతృవాత్సల్యాన్ని గౌరవించిన తీరు - అందరికీ తమ తల్లుల పట్ల మంచి ఆలోచనను కలిగించాలి.
ఆ శ్లోకాలూ, వాటి స్థూలభావాలూ ఇవీ -
1. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కమ్.
“నా ముత్యానివి ! నా రత్నానివి ! నా కంటి వెలుగువు ! కుమారా ! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో అమ్మా ! ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను !
2. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిః.
"అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అంటూ పంటిబిగువున ప్రసవవేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ ! నీకు నమస్కరిస్తున్నాను.
3. ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమో
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.
అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను అనుభవించావో కదా ! కళను కోల్పోయి, శరీరం శుష్కించి,శయ్య మలినమైనా - సంవత్సరకాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావోకదా ! ఎవరైనా అలాంటి బాధను సహించ గలరా ? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు అంజలి ఘటిస్తున్నాను.
4. గురుకులముపసృత్య స్వప్నకాలేపి తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం
సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః.
స్వప్నంలో నన్ను సన్యాసివేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా !
5. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ గావా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న దత్తో మాతస్తే మరణసమయే తారక మనురకాలే
సంప్రాప్తే మయి కురు దయాం మాతరతులామ్.
అమ్మా ! సమయం మించిపోయాక వచ్చినందువల్ల మరణసమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని ఉచ్చరించలేదు. నన్ను క్షమించి, నాయందు తులలేని దయ చూపించు తల్లీ !
ఈ ఐదు శ్లోకాశ్రు కణాల్లోనూ "మాతృదేవోభవ" అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్ఠితమై ఉంది. మహిత వేదాంత ప్రవచనానికే కాదు – మహనీయ మాతృభక్తిప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.
(శంకరుల సన్న్యాసాశ్రమ స్వీకారానికి సంబంధించి, వారి మాతృదేవి మరణాన్ని గూర్చి భిన్న కథనాలు లోకంలో ఉన్నాయి)